Green energy park: అదానీ గ్రీన్ ఎనర్జీ పార్క్.. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందటా..
గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ గుజరాత్లో గ్రీన్ ఎనర్జీ పార్క్ నిర్మిస్తోంది. ఇది అంతరిక్షం నుంచి చూసిన కనిపిస్తుందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.
అహ్మదాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ(Gautam Adani)కి చెందిన అదానీ గ్రూప్ గుజరాత్(Gujarat)లోని రాణ్ ఆఫ్ కచ్(Rann of Kutch) ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్రీన్ ఎనర్జీ పార్క్(Green Energy Park)ను ఏర్పాటు చేస్తోంది. ఈ పార్క్ను 726 చదరపు కి.మీ పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద పార్క్ అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందట. అదానీ గ్రూప్ ఛైర్మన్ అదానీ ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా గ్రీన్ ఎనర్జీ పార్క్కు సంబంధించి విశేషాలను పంచుకున్నారు. కొన్ని చిత్రాలను పోస్టు చేశారు.
‘‘ప్రపంచంలోనే అతిపెద్ద పార్క్ నిర్మాణం చేపట్టి పునరుత్పాదక ఇంధన రంగంలో భారత దేశ అద్భుత పురోగతికి సంబంధించి కీలక భూమిక పోషిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. వాతావరణ పరంగా చాలా సవాళ్లు ఎదురయ్యే రాణ్ ఆఫ్ కచ్లో ఈ గొప్ప ప్రాజెక్టును మొత్తం 726 చదరపు కి.మీ.లలో చేపడుతున్నాం. అంతరిక్షం నుంచి నుంచి చూసినా ఈ పార్క్ కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రెండు కోట్ల ఇళ్లకు సరిపడా 30 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తాం. పర్యావరణ అనుకూల సౌర, పవన విద్యుత్ కోసం విస్తృత, సమీకృత పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలో ఒక ప్లాంట్ను మన ఖర్మ భూమిగా పిలిచే ముంద్రాకు కేవలం 150 కి.మీ దూరంలో నిర్మిస్తున్నాం. పునరుత్పాదక విద్యుత్ రంగానికి సంబంధించి స్థిరమైన శక్తి సాధనకు భారత్ మొదలుపెట్టిన ప్రయాణంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. అంతేకాకుండా సౌర కూటమి, ఆత్మనిర్భర్ భారత్ చొరవ పట్ల ఇది మా నిబద్ధతను తెలియజేస్తుంది’’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుతో ఇండియా గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం పెరగడమే కాకుండా ‘కాప్’ సదస్సు వాగ్దానాలను సైతం నెరవేర్చడంలో ఇది ఎంతో కీలకపాత్ర పోషించనుంది. 2021లో జరిగిన కాప్ 26 సదస్సులో భారత్ ‘పంచామృత్’ వాగ్దానం చేసింది. దీనిలో భాగంగా 2030లోగా వాతావరణంలో 1 బిలియన్ టన్నుల కాలుష్య ఉద్గారాలను తగ్గించడం, 500 గిగావాట్ల శిలాజ రహిత విద్యుత్ ఉత్పత్తి చేయడం వంటివి ఉన్నాయి. కాప్ సదస్సులో భారత్ తీసుకున్న నిర్ణయాల్లో ఈ గ్రీన్ ఎనర్జీ పార్క్ కీలక పాత్ర పోషించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?