అమర్‌నాథ్‌ యాత్ర రద్దు నిర్ణయం వెనక్కి

కరోనా కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. ఆ వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకుంది జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగం. దీంతో ఈ అంశం....

Updated : 22 Apr 2020 20:37 IST

జమ్మూ: కరోనా కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. ఆ వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకుంది జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగం. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది జూన్‌ 23 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ యంత్రాంగం ఓ ప్రకటనలో వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము నేతృత్వంలో జరిగిన శ్రీ అమర్‌నాథ్‌జీ బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తొలుత పేర్కొన్నారు. ప్రథమ పూజ, సంపన్న పూజలను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసి.. ఆ వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నారు.

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లోని అమర్‌నాథుడిని దర్శనార్థం ఏటా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మొత్తం  42 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ ఏడాది జూన్‌ 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగాల్సి ఉంది. కశ్మీర్‌లో తీవ్ర ఉగ్రవాద ముప్పు ఉన్న సమయంలోనూ ఈ యాత్ర జరగడం గమనార్హం. మరి ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని