India Or Bharat: ఇండియా స్థానంలో భారత్!
జీ20 సదస్సు నేపథ్యంలో విదేశీ నేతలకు రాష్ట్రపతి పంపిన విందు ఆహ్వాన పత్రంలో ఇండియా స్థానంలో భారత్ అని పేర్కొనడం, విదేశీ అతిథులకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్ అని ముద్రించడం కలకలం రేపింది.
జీ20 నేతల విందు ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొన్న రాష్ట్రపతి కార్యాలయం
కేంద్ర ప్రభుత్వం విదేశీ అతిథులకిచ్చిన పుస్తకాల్లోనూ అదే తరహాలో..
మార్పునకు సంకేతమన్న అస్సాం సీఎం
దుమ్మెత్తిపోసిన ప్రతిపక్షాలు
తమ కూటమికి ‘ఇండియా’ పేరు ఉండడం వల్లేనని ధ్వజం
ఈనాడు, దిల్లీ: జీ20 సదస్సు నేపథ్యంలో విదేశీ నేతలకు రాష్ట్రపతి పంపిన విందు ఆహ్వాన పత్రంలో ఇండియా స్థానంలో భారత్ అని పేర్కొనడం, విదేశీ అతిథులకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్ అని ముద్రించడం కలకలం రేపింది. ఈ నెల 9వ తేదీన జీ20 దేశాధినేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరుతో ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వాన పత్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ట్వీట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ట్యాగ్ చేశారు. ‘జనగణమన అధినాయక జయహే.. భారత భాగ్య విధాత’ అని మంత్రి ట్వీట్లో వ్యాఖ్యానించారు. ఇది వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్రంగా మండిపడ్డాయి. ఎప్పటి నుంచో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ‘ఇండియా’ పేరును కాదని భారత్గా పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించాయి. ఈ విమర్శలను అధికార భాజపా తిప్పికొట్టింది. పురాణాల నుంచి భారత్ అనే పేరుందని, రాజ్యాంగంలోనూ భారత్ అనే పేరు ఉందని స్పష్టం చేసింది. బ్రిటిషర్లే ఇండియా అని పిలిచారని పేర్కొంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ దేశాన్ని భారత్ అని పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
భాగవత్ సంకేతమిచ్చారా?
కేంద్ర ప్రభుత్వం భారత్ అనే పేరును ఉపయోగించడానికి సిద్ధమైందన్న వాదనలకు ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇచ్చిన పిలుపు, తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. ఇటీవల గువాహటిలో భాగవత్ మాట్లాడుతూ.. ఇండియాకు బదులుగా భారత్ అని పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంగ్లీషు మాట్లాడేవారు అర్థం చేసుకోవడానికి ఇండియాగా పిలిచేవారని, తర్వాత అదే అలవాటుగా మారిందని, ఇప్పుడు ఆ పేరును మానేయాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత్గానే వినిపించాలని, మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు ఇదే ఉండాలని కోరారు. రాష్ట్రపతి ఆహ్వాన పత్రాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్వాగతించారు. ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్ ద్వారా మన నాగరిక సమాజం అమృత కాలంవైపు ధైర్యంగా ముందడుగు వేయడం సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఇండోనేషియా పర్యటనకు వెళ్తున్న ప్రధాని గురించి ట్వీట్ చేస్తూ ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇదే తొలిసారి..
అధికార ఆహ్వాన పత్రాల్లో ఇలా భారత్ అని పేర్కొనడం ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులు భారత్ అని ముద్రించింది. ఇండియా జీ20 సదస్సుకు నాయకత్వం వహించడాన్ని గుర్తు చేస్తూ ‘భారత్, ద మదర్ ఆఫ్ డెమోక్రసీ’గా పేర్కొంది. ఇక్కడ వేల ఏళ్ల నుంచి ప్రజాస్వామ్య విలువలు నెలకొన్నట్లు తెలిపింది. భారత్గా పిలుచుకునే ఇండియా చరిత్ర తొలినాళ్ల నుంచీ పరిపాలనలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం అంతర్భాగంగా మారినట్లు పేర్కొంది.
‘ప్రత్యేక తీర్మానం అవసరం లేదు’
రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్, భారత్ అంటే ఇండియా అని ఉన్నందున దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని, దీని కోసం తీర్మానం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మంగళవారం విలేకరులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్విటర్లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘భారత్గా పిలిచేందుకు రాజ్యాంగపరంగా ఎలాంటి అభ్యంతరం లేదు. దేశానికి ఉన్న రెండు అధికారిక నామాల్లో అదీ ఒకటి. అయితే శతాబ్దాలుగా లెక్కలేనంత బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఇండియా పేరును పూర్తిగా విస్మరించేంత తెలివి తక్కువగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చారిత్రకంగా గుర్తింపు పొందిన పేరును వదులుకోవడానికి బదులు రెండు పేర్లను కొనసాగించడం మేలు’ అని పేర్కొన్నారు.
మా కూటమికి ‘ఇండియా’ పేరువల్లే: ప్రతిపక్షాలు
రాష్ట్రపతి ఆహ్వాన పత్రంలో భారత్ అని పేర్కొనడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంవల్లే భాజపా ఇలా వ్యవహరించిందని విమర్శించాయి. ‘రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాన్ని బట్టి ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇక మీదట భారత్, దట్ వాజ్ ఇండియా, షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చదువుకోవాలి. కానీ ఇప్పుడు ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ దాడికి గురవుతున్నాయి’ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 52లో ‘దేర్ షల్ బీ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని ఉంది.. ఇంతకు మించి చెప్పడానికి ఇంకేమీ లేదని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడంవల్లే కేంద్ర ప్రభుత్వం భారత్ను వాడటానికి ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ‘ఈ దేశం 140 కోట్ల మంది ప్రజలది తప్పితే ఒక పార్టీది కాదు. ఒకవేళ రేప్పొద్దున ప్రతిపక్ష కూటమి ఇండియా తన పేరును భారత్గా మార్చుకుంటే ఆ పేరునూ వాడకుండా ఉంటారా? ఇదేం తమాషా? ప్రతిపక్ష కూటమికి ఓట్లు పడతాయేమోనన్న భయంతో ఇలా చేయడమంటే దేశానికి ద్రోహం చేయడమే’ అని ధ్వజమెత్తారు.
పార్లమెంటులో తీర్మానం చేస్తారా?
వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం భారత్గా పేర్కొంటూ తీర్మానం చేయబోతోందని ఆంగ్ల ప్రసార మాధ్యమాలు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. జులై 18న బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కూటమి పేరును ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్గా (ఇండియా)’ నామకరణం చేసిన నాటి నుంచి దానిపై చర్చ ప్రారంభమైంది. తాజాగా ముంబయిలో ఆగస్టు 31, సెప్టెంబరు 1న జరిగిన కూటమి సమావేశంలో ‘జుడేగా భారత్.. జీతేగా ఇండియా’ అనే నినాదాన్ని ఖరారు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆహ్వాన పత్రంలో ఇండియాకు బదులు భారత్ ఉన్నట్లు వెలుగులోకి రావడంతో చర్చ మొదలైంది.
- ఇండియా, భారత్ అనేవి మనందరికీ తెలుసని, ప్రపంచానికి ఇండియా అనే తెలుసని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
- ప్రతిపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టడంవల్లే భాజపా సర్కారు దేశాన్ని ‘భారత్’గా పిలిచేందుకు ప్రయత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు.
- దేశం పేరును మార్చే అధికారం ఏ ఒక్కరికీ లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.
రాజ్యాంగంలో రెండూ..
సాధారణ ప్రజల భాషలో భారత దేశాన్ని భారత్, ఇండియాగా పిలుచుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘ఇండియా, దట్ ఈజ్ భారత్, షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని ఉంది. ఆర్టికల్ 52లో రాష్ట్రపతిని ‘ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి అధికారిక ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడంతో కేంద్రం రాజ్యాంగంలో ఇప్పటివరకు వాడుతున్న ఇండియా స్థానంలో భారత్ను వాడేందుకు సిద్ధమైనట్లు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
‘భారత్ మాతాకీ జై’ అంటూ అమితాబ్ ట్వీట్
చర్చనీయాంశంగా మారిన వైనం
ముంబయి: బిగ్బీ అమితాబ్ బచ్చన్ మంగళవారం చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన ‘భారత్ మాతాకీ జై’ అని ట్విటర్లో పోస్టు చేశారు. దేశం పేరును ‘ఇండియా’గా కాకుండా.. ‘భారత్’గా సంబోధిస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేయడం గమనార్హం. దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఆయనకు మద్దతు పలకగా.. మరి కొందరు ‘‘జయా జీ అంటే మీకు భయం లేదా’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే
తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
మళ్లీ బెదిరింపు ఈ-మెయిళ్లు
దేశ రాజధాని దిల్లీలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిహాడ్ జైలుకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
దిల్లీ మద్యం కుంభకోణం నిందితుల జాబితాలో ‘ఆప్’!
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరును నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు మంగళవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంతా శర్మకు ఈడీ నివేదించింది. -
ఐటీవో సీఆర్ భవనంలో అగ్నిప్రమాదం
సెంట్రల్ దిల్లీలోని ఐటీవోలో ఆదాయపుపన్ను సెంట్రల్ రెవెన్యూ (సీఆర్) భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తూర్పు దిల్లీకి చెందిన 46 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. -
లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేశారా?
ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
రఫాలో భారత మాజీ సైన్యాధికారి మృతి
గాజాలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) తరఫున పనిచేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతి చెందారు. -
‘ఎన్నికల బాండ్లపై దర్యాప్తు’ పిటిషన్లను సత్వరమే విచారించండి
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చిన ‘ఎన్నికల బాండ్ల’పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను సత్వరమే విచారణకు చేపట్టాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల వేళ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గత 60 రోజుల్లో పాక్ సరిహద్దు వెంబడి 49 డ్రోన్లను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వెల్లడించింది. -
క్యాన్సర్ పునరావృతానికి అడ్డుకట్ట!
చికిత్స తర్వాత క్యాన్సర్ పునరావృతమవుతుంటుంది. దీన్ని అడ్డుకునే సామర్థ్యమున్న మూడు రకాల మందులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
విదేశీయులకు విద్యానంతరం రెండేళ్ల వీసా కొనసాగించాలి
విదేశీ విద్యార్థులకు తమ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యావకాశాలు కల్పించడం, అందుకోసం జారీచేసే గ్రాడ్యుయేట్ వీసాల వల్ల కలిగే లాభనష్టాల గురించి అధ్యయనం చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నియమించిన రివ్యూ కమిటీ కీలక సూచనలు చేసింది. -
ప్రభుత్వ లాంఛనాలతో సుశీల్ మోదీ అంత్యక్రియలు
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం పట్నాలో పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. -
రాగి గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు
రాజస్థాన్లోని నీమ్కా థానా జిల్లాలో రాగి గనుల్లో మంగళవారం ప్రమాదం సంభవించింది. సిబ్బందిని తరలించేందుకు ఉపయోగించే లిఫ్ట్ కుప్పకూలింది. -
ఎల్టీటీఈపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగింపు
శ్రీలంకకు చెందిన ఉగ్ర సంస్థ ఎల్టీటీఈపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరో ఐదేళ్లు పొడిగించింది. -
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
విట్ వ్యవస్థాపకుడు విశ్వనాథన్కు న్యూయార్క్ వర్సిటీ డాక్టరేట్
తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) వ్యవస్థాపకుడు, ఛాన్స్లర్ అయిన డాక్టర్ జి.విశ్వనాథన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ (ఎస్యూఎన్వై) నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. -
అంబేడ్కర్ పేరును కేజ్రీవాల్ వినియోగించకుండా అడ్డుకోవాలంటూ పిల్
జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను రాజకీయ నాయకులు ఎవరూ స్వప్రయోజనాలకు వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. -
ఐఎంఏ అధ్యక్షుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు ఆర్.వి.అశోకన్ చేసిన వ్యాఖ్యలపై ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం...ఆయన బేషరతుగా క్షమాపణలు చెబుతూ దాఖలు చేసిన అఫిడవిట్ను తిరస్కరిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. -
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
ప్రజ్వల్ వీడియోలు ఉన్న పెన్డ్రైవ్లను లీక్ చేయడం వెనక ‘భారీ తిమింగలం’ ఉందని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!