Justice Madan B Lokur: నెలల తరబడి జైళ్లలో ఉంచడం అత్యంత దురదృష్టకరం
బెయిల్ మంజూరు, లేదా తిరస్కరణపై మూల సిద్ధాంతాలను న్యాయస్థానాలు మరిచిపోతున్నట్లున్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్ అభిప్రాయపడ్డారు.
బెయిల్ మూల సిద్ధాంతాల్ని కోర్టులు మరిచిపోతున్నాయి
దర్యాప్తు సంస్థల దుర్బుద్ధిని గుర్తించడం లేదు
పీటీఐ ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్ వ్యాఖ్యలు
దిల్లీ: బెయిల్ మంజూరు, లేదా తిరస్కరణపై మూల సిద్ధాంతాలను న్యాయస్థానాలు మరిచిపోతున్నట్లున్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్(Justice Madan B Lokur) అభిప్రాయపడ్డారు. నిందితులను కారాగారంలో ఉంచాలనే ఉద్దేశంతో దర్యాప్తు సంస్థలు చేసే ప్రయత్నాలను గుర్తించేందుకు న్యాయవ్యవస్థ సుముఖంగా లేకపోవడం ‘అత్యంత దురదృష్టకరం’ అని అన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి అరెస్టయితే కనీసం కొన్ని నెలలపాటు జైల్లో ఉండాల్సి రావడం ఖాయమని అన్నారు.
‘పోలీసులు మొదట ఒక వ్యక్తిని అరెస్టు చేస్తారు. ఆ తర్వాత సీరియస్గా దర్యాప్తు మొదలుపెడతారు. దర్యాప్తు సంస్థలు అరకొర వివరాలతో ఛార్జిషీటు వేసి, తర్వాత అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేస్తాయి. ఈ కోణాన్ని కొన్ని కోర్టులు చూడడం లేదు. న్యాయశాస్త్ర పుస్తకాలు ఇలాంటి మొత్తం కథను చెప్పవు. ఈ సత్యాలను న్యాయవ్యవస్థ గుర్తెరగాలి’ అని జస్టిస్ లోకుర్ చెప్పారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తమ దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బెయిల్ విషయాల్లో విచక్షణాధికారాలను ఎలా వినియోగించుకోవాలనే ప్రాథమిక సూత్రాలను నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పులు వెలువరించిందని గుర్తుచేశారు. ఈ విషయం తెలిసినా కొన్ని కోర్టులు వాటిని పాటించడం లేదని, అది ఎందుకనేదే ప్రశ్న అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.