అరాచకం సృష్టించాలని కుట్ర
పార్లమెంటులో ఆగంతకుల చొరబాటు ఘటనపై దర్యాప్తులో క్రమంగా కీలక వివరాలు బయటికొస్తున్నాయి. దేశంలో అరాచకం సృష్టించేందుకు నిందితులు కుట్ర పన్నారని.. తద్వారా తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకున్నారని పోలీసులు తాజాగా వెల్లడించారు.
తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని భావించారు
పార్లమెంటులోకి చొరబాటు ఘటనలో నిందితుల ప్రణాళిక ఇదే
దిల్లీ: పార్లమెంటులో ఆగంతకుల చొరబాటు ఘటనపై దర్యాప్తులో క్రమంగా కీలక వివరాలు బయటికొస్తున్నాయి. దేశంలో అరాచకం సృష్టించేందుకు నిందితులు కుట్ర పన్నారని.. తద్వారా తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకున్నారని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను తమ కస్టడీకి అప్పగించాలని కోరిన సందర్భంగా దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు పటియాలా హౌజ్ కోర్టులో శుక్రవారం పలు వివరాలు వెల్లడించారు. పార్లమెంటులోకి చొరబడే కుట్ర పన్నేందుకు నిందితులు చాలాసార్లు సమావేశమయ్యారని తెలిపారు.
పోలీసుల అదుపులో మరో ఇద్దరు
కేసు దర్యాప్తులో భాగంగా కైలాశ్, మహేశ్ అనే మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారిని ఇంకా అరెస్టు చేయలేదు. దిల్లీ నుంచి పారిపోయిన అనంతరం రాజస్థాన్లో తలదాచుకునేందుకు లలిత్కు వారు సహకరించారు. ఆ ఇద్దరిలో ఒకరు రాజస్థాన్వాసి. నిజానికి వారిలో ఒకరు పార్లమెంటులోకి చొరబడాలనుకున్నారు. కానీ బుధవారం అక్కడికి చేరుకోలేకపోయారు.
ఫోన్లు తగలబెట్టేశాడు
కోర్టులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పార్లమెంటులో సంచలన ఘటనల అనంతరం దిల్లీ నుంచి రాజస్థాన్కు లలిత్ పారిపోయాడు. అక్కడ రెండు రోజులు ఉండి.. గురువారం రాత్రి దిల్లీకి తిరిగొచ్చి లొంగిపోయాడు. సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా దిల్లీ-జైపుర్ సరిహద్దుకు సమీపంలో తన ఫోన్ను పారేశాడు. నలుగురు సహ నిందితుల ఫోన్లను కూడా వెంట తీసుకెళ్లిన అతడు.. వాటిని తగలబెట్టేశాడు. ఫోన్లు లేకపోవడంతో.. నిందితుల కుట్ర ఎప్పుడు ప్రారంభమైందన్నది తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. తన ఫోన్ను పారేసిన, ఇతరుల ఫోన్లను కాల్చేసిన ప్రాంతాలకు లలిత్ను వారు తీసుకెళ్లనున్నారు.
ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా..
పార్లమెంటు ఆవరణలో అలజడి సృష్టించేందుకు నిందితులు ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ప్లాన్-ఎ ప్రకారం.. నీలం, అమోల్ శిందే పార్లమెంటుకు చేరుకొని నిరసన తెలియజేయాలి. ప్లాన్-బి ప్రకారం మహేశ్, కైలాశ్లు మరో మార్గంలో అక్కడికి చేరుకొని మీడియా కెమెరాల ముందు రంగుల పొగగొట్టాలను తెరిచి ఆందోళన చేపట్టాలి. అనుకున్న సమయానికి మహేశ్, కైలాశ్ గురుగ్రామ్ చేరుకోలేకపోవడంతో ‘ప్లాన్-ఎ’నే వారు అమలు చేశారు.
లలిత్ ఝాకు ఏడు రోజుల పోలీసు కస్టడీ
లలిత్ ఝాకు కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అతణ్ని విచారించేందుకు వీలుగా 15 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా.. 7 రోజులకే అనుమతి లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాగర్, మనోరంజన్, నీలం, శిందేలకు కూడా కోర్టు గురువారం 7 రోజుల పోలీసు కస్టడీ విధించిన సంగతి గమనార్హం. మరోవైపు- లలిత్ ఝా స్నేహితుడైన నీలాక్ష్య ఆయిచ్ను పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో పోలీసులు గురువారం కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. ఆయిచ్ కళాశాలలో చదువుకుంటున్న అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థి. లోక్సభలోకి తన సహ నిందితులు చొరబడిన కొద్దిసేపటికే సంబంధిత వీడియోను లలిత్ అతడికి పంపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సిజేరియన్’ శిశువులకు రెండో తట్టు టీకా తప్పనిసరి
సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. -
కేజ్రీవాల్కు ఇచ్చినట్లే నాకూ బెయిలివ్వండి
లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
వీవీప్యాట్ స్లిప్పుల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్
లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీయం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిస్థాయిలో సరిపోల్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఏప్రిల్ 26నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
కేజ్రీవాల్ సహాయకుడు నాపై దాడి చేశారు
మద్యం కుంభకోణం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. -
త్రిపురకు వెళ్లి ఏనుగులను కాపాడిన అంబానీ ‘వన్ తారా’బృందం
గుజరాత్లోని జామ్నగర్కు చెందిన ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్ర సిబ్బంది జబ్బుపడిన ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకు ఏకంగా 3,500 కి.మీ. ప్రయాణించారు. -
ముంబయిలో గాలివాన బీభత్సం
కొన్నిరోజులుగా వేడి వాతావరణంతో సతమతమవుతోన్న ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. -
56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు
రాజస్థాన్లోని జైపుర్లో ఉన్న 56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం మెయిల్ రూపంలో ఈ సందేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. -
మోదీ మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
దర్యాప్తునకు పనికొచ్చే సమాచారం అందించని కెనడా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ (45) హత్య కేసు దర్యాప్తునకు తోడ్పడే నిర్దిష్ట సమాచారమేదీ కెనడా నుంచి భారత దర్యాప్తు సంస్థలకు అందలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం తెలిపారు. -
భారత్-ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణ ‘ఎక్సర్సైజ్ శక్తి’ ప్రారంభం
భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ‘ఎక్సర్సైజ్ శక్తి’ సంయుక్త సైనిక శిక్షణ సోమవారం మేఘాలయలోని ఉమ్రోయ్లో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైందని రక్షణ శాఖ తెలిపింది. -
ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహియానగర్లోని స్థానిక నర్సింగ్ హోంలో చేరారు. -
సంక్షిప్త వార్తలు
దిల్లీలోని ఒక పెట్రోల్ పంపు వద్ద దాడికి పాల్పడిన ఘటనలో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్, అతని కుమారుడు అనాస్ అహ్మద్పై సోమవారం బెయిల్కు వీల్లేని వారెంట్ జారీ అయినట్లు పోలీసులు తెలిపారు. -
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
Rahul gandhi: రాహుల్తో చర్చించేందుకు భాజపా సిద్ధమైంది. ఓ యువ నాయకుడికి అవకాశం ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం