ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నారు..!
పార్లమెంటులో పొగను వెదజల్లి హడావుడి సృష్టించిన వ్యక్తులు మొదట వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆత్మాహుతి నాటకం ఆడాలని భావించారు! లేదంటే కరపత్రాలు విసరాలని అనుకున్నారు.
పార్లమెంటు ఘటనపై వెలుగులోకి మరిన్ని వివరాలు
ఆరో వ్యక్తి కూడా అరెస్టు
దిల్లీ: పార్లమెంటులో పొగను వెదజల్లి హడావుడి సృష్టించిన వ్యక్తులు మొదట వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆత్మాహుతి నాటకం ఆడాలని భావించారు! లేదంటే కరపత్రాలు విసరాలని అనుకున్నారు. చివరకు లోక్సభ ఛాంబర్లోకి దూకి రంగుల పొగతో కలకలం సృష్టించే నిర్ణయానికి వచ్చారు. అరెస్టయి తమ కస్టడీలో ఉన్న అయిదుగురు నిందితులు ఈ విషయాన్ని వెల్లడించారని దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగాధికారులు శనివారం తెలిపారు. ‘లోక్సభ ఛాంబర్లోకి దూకే ప్రణాళికను ఖరారు చేయడానికి ముందు నిందితులు ప్రభుత్వానికి తమ సందేశాన్ని బలంగా పంపేందుకు ఇతర మార్గాలనూ అన్వేషించారు. శరీరానికి ‘ఫైర్ప్రూఫ్ జెల్’ (నిప్పు నుంచి రక్షణ కల్పించే లేపనాన్ని) పూసుకుని.. నిప్పంటించుకునే యోచన చేశారు. దానివల్ల తమకెలాంటి హాని కలగకుండానే మీడియా దృష్టిని ఆకర్షించి దేశంలో సంచలనం సృష్టించవచ్చని అనుకున్నారు. తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. కారణం తెలియాల్సి ఉంది’ అని వివరించారు. నిందితులకు సందర్శకుల పాసులు జారీ చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు.
కుమావత్కు వారం రోజుల కస్టడీ
దర్యాప్తులో భాగంగా అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నిందితులను.. గతంలో వారు కలిసిన, ఈ కుట్రకు ప్రణాళిక రూపొందించిన ప్రాంతాలకు తీసుకువెళ్లారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న లలిత్ ఝాను త్వరలో రాజస్థాన్లోని నాగౌర్కు తీసుకువెళ్లనున్నారు. ఘటనానంతరం ఝా దిల్లీ నుంచి రాజస్థాన్కు పారిపోయి ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకడైన మహేశ్ కుమావత్ను ఏడురోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ దిల్లీలోని న్యాయస్థాన ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. నిందితుల ఫోన్ల విధ్వంసంలో అతని పాత్ర ఉందని, కేసులో మరోవ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పార్లమెంటు సముదాయ భద్రతలో వివిధ కోణాలను సమీక్షించడానికి ఉన్నతస్థాయి సంఘాన్ని నియమించినట్లు ఎంపీలకు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఓ లేఖ ద్వారా తెలిపారు. హోంశాఖ నియమించిన కమిటీ నివేదికను త్వరలోనే సభకు తెలియజేస్తామన్నారు. ఎంపీల సస్పెన్షన్కు, ఈ నెల 13 నాటి ఘటనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
మనోరంజన్ నివాస గది సీజ్
పార్లమెంటులో కలకలం కేసులో రెండో నిందితుడైన మనోరంజన్ నివాస గదిని పోలీసులు సీజ్ చేశారు. దిల్లీతో పాటు కాంబోడియా, బ్యాంకాక్ తదితర ప్రాంతాలకు తిరగడానికి అతడికి డబ్బు ఎక్కడినుంచి వస్తోందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అతడి బ్యాంక్ ఖాతాలు, ఫోన్ పే, గూగుల్ పే సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొదటి నిందితుడు సాగర్ శర్మ (యూపీ) మైసూరుకు వచ్చి మనోరంజన్ను కలిశాడు. వీరిద్దరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు అని నిఘా అధికారులు ఆరా తీస్తున్నారు. సన్నివేశాన్ని పునఃసృష్టించడానికి పార్లమెంటు అనుమతి పొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
నా కుమారుడు అమాయకుడు: ఝా తండ్రి
దర్భంగా: పార్లమెంటులో దాడికి పాల్పడ్డ ఘటనలో ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న తన కుమారుడు లలిత్ ఝా అమాయకుడని అతని తండ్రి దేవానంద్ ఝా అంటున్నారు. ‘ట్యూషన్లు చెబుతూ కుటుంబానికి ఆధారంగా లలిత్ ఉంటున్నాడు. ఛఠ్పూజకు మమ్మల్ని బిహార్లోని దర్భంగాకి పంపించి, వ్యక్తిగత పనిమీద దిల్లీ వెళ్తున్నట్లు చెప్పి ఈ నెల 10న రైల్లో బయల్దేరాడు. చివరగా మేం మాట్లాడింది అదే. మా ఇంట్లో టీవీ కూడా లేదు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం ఇతరుల ద్వారా తెలిసింది. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాం’ అని వివరించారు. పూర్వీకుల కాలం నాటి శిథిల గృహంలో దేవానంద్ నివాసం ఉంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
‘న్యూస్క్లిక్’(NewsClick) వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
Jaishankar: భారత ఎన్నికలపై విమర్శలు చేస్తున్న విదేశీ మీడియాకు జైశంకర్ చురకలంటించారు. 200 ఏళ్ల సామ్రాజ్యవాద పోకడను వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే
తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
మళ్లీ బెదిరింపు ఈ-మెయిళ్లు
దేశ రాజధాని దిల్లీలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిహాడ్ జైలుకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
దిల్లీ మద్యం కుంభకోణం నిందితుల జాబితాలో ‘ఆప్’!
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరును నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు మంగళవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంతా శర్మకు ఈడీ నివేదించింది. -
ఐటీవో సీఆర్ భవనంలో అగ్నిప్రమాదం
సెంట్రల్ దిల్లీలోని ఐటీవోలో ఆదాయపుపన్ను సెంట్రల్ రెవెన్యూ (సీఆర్) భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తూర్పు దిల్లీకి చెందిన 46 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. -
లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేశారా?
ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
రఫాలో భారత మాజీ సైన్యాధికారి మృతి
గాజాలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) తరఫున పనిచేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతి చెందారు. -
‘ఎన్నికల బాండ్లపై దర్యాప్తు’ పిటిషన్లను సత్వరమే విచారించండి
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చిన ‘ఎన్నికల బాండ్ల’పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను సత్వరమే విచారణకు చేపట్టాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల వేళ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గత 60 రోజుల్లో పాక్ సరిహద్దు వెంబడి 49 డ్రోన్లను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వెల్లడించింది. -
క్యాన్సర్ పునరావృతానికి అడ్డుకట్ట!
చికిత్స తర్వాత క్యాన్సర్ పునరావృతమవుతుంటుంది. దీన్ని అడ్డుకునే సామర్థ్యమున్న మూడు రకాల మందులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
విదేశీయులకు విద్యానంతరం రెండేళ్ల వీసా కొనసాగించాలి
విదేశీ విద్యార్థులకు తమ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యావకాశాలు కల్పించడం, అందుకోసం జారీచేసే గ్రాడ్యుయేట్ వీసాల వల్ల కలిగే లాభనష్టాల గురించి అధ్యయనం చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నియమించిన రివ్యూ కమిటీ కీలక సూచనలు చేసింది. -
ప్రభుత్వ లాంఛనాలతో సుశీల్ మోదీ అంత్యక్రియలు
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం పట్నాలో పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. -
రాగి గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు
రాజస్థాన్లోని నీమ్కా థానా జిల్లాలో రాగి గనుల్లో మంగళవారం ప్రమాదం సంభవించింది. సిబ్బందిని తరలించేందుకు ఉపయోగించే లిఫ్ట్ కుప్పకూలింది. -
ఎల్టీటీఈపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగింపు
శ్రీలంకకు చెందిన ఉగ్ర సంస్థ ఎల్టీటీఈపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరో ఐదేళ్లు పొడిగించింది. -
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
విట్ వ్యవస్థాపకుడు విశ్వనాథన్కు న్యూయార్క్ వర్సిటీ డాక్టరేట్
తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) వ్యవస్థాపకుడు, ఛాన్స్లర్ అయిన డాక్టర్ జి.విశ్వనాథన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ (ఎస్యూఎన్వై) నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. -
అంబేడ్కర్ పేరును కేజ్రీవాల్ వినియోగించకుండా అడ్డుకోవాలంటూ పిల్
జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను రాజకీయ నాయకులు ఎవరూ స్వప్రయోజనాలకు వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. -
ఐఎంఏ అధ్యక్షుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు ఆర్.వి.అశోకన్ చేసిన వ్యాఖ్యలపై ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం...ఆయన బేషరతుగా క్షమాపణలు చెబుతూ దాఖలు చేసిన అఫిడవిట్ను తిరస్కరిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. -
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
ప్రజ్వల్ వీడియోలు ఉన్న పెన్డ్రైవ్లను లీక్ చేయడం వెనక ‘భారీ తిమింగలం’ ఉందని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
-
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
-
భోజనానికి ముందు టీ, కాఫీ తాగుతున్నారా.. బీ అలర్ట్!
-
మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య