మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 2 కోట్లు
ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ మంగళవారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఛానల్ సబ్స్క్రైబర్ల (వీక్షకుల) సంఖ్య రెండు కోట్లు దాటింది. ప్రపంచంలో మరే ఇతర నేతకూ ఇలాంటి ఘనత లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రపంచ నేతలందరిలో అగ్రస్థానం
దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ మంగళవారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఛానల్ సబ్స్క్రైబర్ల (వీక్షకుల) సంఖ్య రెండు కోట్లు దాటింది. ప్రపంచంలో మరే ఇతర నేతకూ ఇలాంటి ఘనత లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఈ ఛానల్ను మోదీ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటూ వస్తున్నారు. ఛానల్లో మోదీ పోస్ట్ చేసిన వీడియోలకు వీక్షణలు (వ్యూస్) 450 కోట్ల పైమాటే. ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో రెండోస్థానంలో ఉన్నారు. ఆయనకు 64 లక్షల మంది వీక్షకులు ఉన్నారు. మోదీతో పోలిస్తే ఇది మూడోవంతు కంటే తక్కువే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పోస్ట్ చేసిన వీడియోలకు వ్యూస్ 22.4 కోట్లు. ఆ విషయంలో మోదీ తర్వాత స్థానం ఆయనదే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు 7.89 లక్షల మంది, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్కు 3.16 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రధాని మోదీతో ముడిపడిన యూట్యూబ్ ఛానల్- ‘యోగా విత్ మోదీ’కి 73,000 మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఛానల్కు 35 లక్షల మంది చందాదారులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా ఇప్పటి వరకు పనికొచ్చే ఆధారాలు, సమాచారం ఏదీ ఇవ్వలేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. -
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
దిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆయన పార్టీ ఆప్ మహిళా నేత స్వాతీమాలీవాల్పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. -
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
PM Modi: బిహార్లోని గురుద్వారలో ప్రధాని మోదీ సేవ చేశారు. భక్తులకు లంగర్ వడ్డించారు. -
చైనాతో పోటీ పడటం నేర్చుకోవాలి
చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. -
యోగా చిచ్చర పిడుగు హర్షిక
కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. -
ఆసుపత్రికి తండ్రి భౌతికకాయం వితరణ.. నాన్న చివరి కోరికను నెరవేర్చిన కుమారులు
చనిపోయిన తరవాత తన శరీరాన్ని ఏదైనా వైద్యవిద్యా సంస్థకు దానం చేయాలన్న తండ్రి మాటను ఆ కుమారులు నెరవేర్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (3)
హవాలా కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. -
దర్శనమిచ్చిన బద్రీనాథుడు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. -
దిల్లీలో 20 ఆసుపత్రులకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.