యూపీయే నాటి సవాళ్లు అధిగమించాం
యూపీయే సర్కారు వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించి, సుస్థిరమైన వృద్ధి ప్రస్థానం దిశలో దేశాన్ని నిలబెట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాం: నిర్మల
పార్లమెంటులో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కేంద్రం వెల్లడి
దిల్లీ: యూపీయే సర్కారు వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించి, సుస్థిరమైన వృద్ధి ప్రస్థానం దిశలో దేశాన్ని నిలబెట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2014కి ముందు, తర్వాత దేశ ఆర్థిక స్థితిగతులపై గురువారం లోక్సభలో 54 పేజీల శ్వేతపత్రాన్ని ఆమె ప్రవేశపెట్టారు. యూపీఏ పదేళ్ల పాలనతో పోలిస్తే.. తమ పదేళ్ల పాలనలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో అందులో వివరించారు. దీనిపై శుక్రవారం సభలో చర్చ జరపనున్నారు.
దీర్ఘకాల ప్రయోజనాలకు కీలక సంస్కరణలు
‘‘పదేళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అచేతన స్థితిలో ఉంచింది. ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఆర్థిక వృద్ధిని అడ్డుకునేందుకు సమస్యలను సృష్టించింది. 2014లో దేశ ఆర్థిక పరిస్థితి దుర్బలంగా ఉండేది. ఎటుచూసినా అవినీతే. ఆర్థిక క్రమశిక్షణ అనేదే లేదు. ఆర్థిక నిర్వహణ ఘోరం. అంతటా నిధులకు కటకటే. ఒకరకంగా అదో సంక్షోభ పరిస్థితి. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక దానికి భిన్నంగా, దీర్ఘకాల ప్రయోజనాల కోసం కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ వచ్చింది. ఎంతో ప్రయాసతో పాలనను గాడిలో పెట్టింది. ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే చర్యలు తీసుకునే బదులు అవరోధాలు సృష్టించడం వల్ల యూపీయే హయాంలో నల్లధనం పెరిగిపోయింది. ఘోరంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చివెళ్లారు. ఆర్థిక వ్యవస్థ విస్తృత ప్రయోజనాల కోసం, విధానపరమైన స్థిరత్వం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని మోదీ సర్కారు గుర్తించింది. బలమైన సౌధాన్ని కట్టేందుకు పటిష్ఠ ఆర్థిక పునాదుల్ని నిర్మించింది. ఒక్కసారి వెనుదిరిగి చూస్తే గత దశాబ్ద కాలంలో ఎన్నో సవాళ్లను దాటుకుని విజయ ప్రస్థానం సాగించామని సగర్వంగా, సవినయంగా చెప్పగలం. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను 2047 నాటికి తీర్చిదిద్దడానికి ఇది కర్తవ్య కాలం. చేయాల్సింది ఎంతో ఉంది’’ అని నిర్మల వివరించారు. శ్వేతపత్రంలోని అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భాజపా దేశవ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది.
ఏపీ, ఒడిశాలోని ఎస్సీ, ఎస్టీ జాబితాల్లో మార్పులకు ఆమోదం
దిల్లీ: ఆంధ్ర ప్రదేశ్, ఒడిశాలలోని ఎస్సీ, ఎస్టీల జాబితాల్లో మార్పులు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లులకు గురువారం లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను మంగళవారమే రాజ్యసభ ఆమోదించింది. ‘ద కాన్స్టిట్యూషన్ (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (సవరణ) బిల్లు-2024’ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఎస్టీల జాబితాలో మార్పులు జరగనున్నాయి. ‘ద కాన్స్టిట్యూషన్ (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (సవరణ) బిల్లు-2024 ద్వారా ఒడిశాలోని ఎస్సీ, ఎస్టీల జాబితాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బోండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరాంజీపేర్జా సామాజిక వర్గాలు ఎస్టీ జాబితాలో చేరనున్నాయి.
బడ్జెట్కు రాజ్యసభ ఆమోదం
దిల్లీ: తాత్కాలిక బడ్జెట్కు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. 2024-25కు సంబంధించిన బడ్జెట్ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులు, జమ్మూ కశ్మీర్ ఆర్థిక బిల్లులనూ సభ ఆమోదించింది. వాటిని లోక్సభకు పంపింది. బుధవారమే ఈ బిల్లులకు లోక్సభలో ఆమోద ముద్ర పడింది. దీంతో బడ్జెట్ ప్రక్రియ పూర్తయినట్లైంది. ఆర్థిక వృద్ధిలో భాగంగా తాత్కాలిక బడ్జెట్లో మూలధన వ్యయాన్ని భారీగా పెంచామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో బడ్జెట్పై చర్చకు ఆమె సమాధానమిచ్చారు. ప్రభుత్వ మౌలిక వసతుల కల్పన వృద్ధి జీడీపీ కంటే వేగంగా సాగుతోందని తెలిపారు.
డిస్కంల బకాయిలు రూ.50,000 కోట్లకు తగ్గాయని గురువారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. 2022 విద్యుత్తు నిబంధనల అమలుతో 1,39,947 కోట్లున్న బకాయిలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సిజేరియన్’ శిశువులకు రెండో తట్టు టీకా తప్పనిసరి
సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. -
కేజ్రీవాల్కు ఇచ్చినట్లే నాకూ బెయిలివ్వండి
లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
వీవీప్యాట్ స్లిప్పుల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్
లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీయం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిస్థాయిలో సరిపోల్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఏప్రిల్ 26నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
కేజ్రీవాల్ సహాయకుడు నాపై దాడి చేశారు
మద్యం కుంభకోణం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. -
త్రిపురకు వెళ్లి ఏనుగులను కాపాడిన అంబానీ ‘వన్ తారా’బృందం
గుజరాత్లోని జామ్నగర్కు చెందిన ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్ర సిబ్బంది జబ్బుపడిన ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకు ఏకంగా 3,500 కి.మీ. ప్రయాణించారు. -
ముంబయిలో గాలివాన బీభత్సం
కొన్నిరోజులుగా వేడి వాతావరణంతో సతమతమవుతోన్న ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. -
56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు
రాజస్థాన్లోని జైపుర్లో ఉన్న 56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం మెయిల్ రూపంలో ఈ సందేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. -
మోదీ మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
దర్యాప్తునకు పనికొచ్చే సమాచారం అందించని కెనడా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ (45) హత్య కేసు దర్యాప్తునకు తోడ్పడే నిర్దిష్ట సమాచారమేదీ కెనడా నుంచి భారత దర్యాప్తు సంస్థలకు అందలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం తెలిపారు. -
భారత్-ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణ ‘ఎక్సర్సైజ్ శక్తి’ ప్రారంభం
భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ‘ఎక్సర్సైజ్ శక్తి’ సంయుక్త సైనిక శిక్షణ సోమవారం మేఘాలయలోని ఉమ్రోయ్లో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైందని రక్షణ శాఖ తెలిపింది. -
ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహియానగర్లోని స్థానిక నర్సింగ్ హోంలో చేరారు. -
సంక్షిప్త వార్తలు
దిల్లీలోని ఒక పెట్రోల్ పంపు వద్ద దాడికి పాల్పడిన ఘటనలో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్, అతని కుమారుడు అనాస్ అహ్మద్పై సోమవారం బెయిల్కు వీల్లేని వారెంట్ జారీ అయినట్లు పోలీసులు తెలిపారు. -
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
Rahul gandhi: రాహుల్తో చర్చించేందుకు భాజపా సిద్ధమైంది. ఓ యువ నాయకుడికి అవకాశం ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం