Tobacco: పొగాకు కంపెనీపై ఐటీ దాడులు.. కళ్లు చెదిరే విషయాలు వెలుగులోకి

పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో పొగాకు కంపెనీ బంశీధర్‌ గ్రూపుపై ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన దాడుల్లో కళ్లు చెదిరే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Updated : 02 Mar 2024 07:17 IST

 

దిల్లీ: పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో పొగాకు కంపెనీ బంశీధర్‌ గ్రూపుపై ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన దాడుల్లో కళ్లు చెదిరే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. దిల్లీలోని వసంత్‌ విహార్‌లో ఉన్న గ్రూప్‌ వారసుడు శివమ్‌ మిశ్ర ఇంటిని అధికారులు శోధించారు. ఆ ఇంట్లో రూ.50 కోట్ల విలువైన లంబోర్గిని, మెక్‌లారెన్‌, రోల్స్‌రాయిస్‌ ఫాంటమ్‌, పోర్షె వంటి సంస్థలకు చెందిన పలు లగ్జరీ కార్లను గుర్తించారు. రూ.4.5 కోట్ల నగదు, ఇతర దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రధాన నిందితుడిగా గ్రూప్‌ అధినేత కె.కె.మిశ్ర పేరు వినిపిస్తోంది. సంస్థ టర్నోవరును రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లుగా ప్రకటించగా.. వాస్తవానికి ఆ మొత్తం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పాన్‌మసాలా సంస్థలకు పొగాకు సరఫరా చేసే దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఈ బంశీధర్‌ గ్రూప్‌ ఒకటి. సోదాల్లో 15 నుంచి 20 బృందాలు పాల్గొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని