సీఏఏ అమలుకు సంకేతమా ఇది!
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) త్వరలో అమలు చేయబోతోందనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
వైరల్గా అమిత్ షా, రాజ్నాథ్ కార్ల నంబర్ప్లేట్లు
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) త్వరలో అమలు చేయబోతోందనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. వైరల్గా మారిన కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కార్ల నంబర్ప్లేట్లు ఈ అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరైన ఈ ఇద్దరు మంత్రుల కార్ల నంబరుప్లేట్లపై అంకెల మధ్యలో ‘సీఏఏ’ అని ఉండటంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని సత్వరం అమలుచేయనున్నట్లు సంకేతాలు ఇస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019లోనే రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని లోక్సభ ఎన్నికలకు ముందే అమలులోకి తెస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తూ సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే సీఏఏ అమలుచేస్తాం. ఇది ఎవరి పౌరసత్వాన్ని లాక్కోడానికి కాదు’’ అని అమిత్ షా అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాతో పోటీ పడటం నేర్చుకోవాలి
చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. -
యోగా చిచ్చర పిడుగు హర్షిక
కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. -
ఆసుపత్రికి తండ్రి భౌతికకాయం వితరణ.. నాన్న చివరి కోరికను నెరవేర్చిన కుమారులు
చనిపోయిన తరవాత తన శరీరాన్ని ఏదైనా వైద్యవిద్యా సంస్థకు దానం చేయాలన్న తండ్రి మాటను ఆ కుమారులు నెరవేర్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (3)
హవాలా కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. -
దర్శనమిచ్చిన బద్రీనాథుడు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. -
దిల్లీలో 20 ఆసుపత్రులకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటు కోసం ద్విచక్రవాహనంపై దంపతుల సాహస యాత్ర!
-
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
-
‘వివేకం’ సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు
-
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
-
రూ.4 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐ తలుపు తట్టిన ఏపీ సర్కార్
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి