విరాళాల్లో.. ధారాళం
ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. శుక్రవారంలోగా డేటాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా గురువారమే ఈసీ వెల్లడించింది.
భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు, వ్యక్తులు
మొత్తం విరాళాలు రూ.11,671 కోట్లు
రూ.1,368 కోట్లు పెట్టిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ
మేఘా ఇంజినీరింగ్ వాటా రూ.966 కోట్లు
ఒక్క నెలలోనే షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ విరాళం రూ.40 కోట్లు
ప్రధాన పార్టీలన్నింటికీ లబ్ధి
బాండ్ల వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఎన్నికల సంఘం
దిల్లీ: ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. శుక్రవారంలోగా డేటాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా గురువారమే ఈసీ వెల్లడించింది. ఈ డేటాను ఈసీ రెండు భాగాలుగా పేర్కొంది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్సైట్లో ఉంచింది. రూ.11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా వెల్లడైంది. ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను ఇందులో పొందుపరచలేదు. దానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ వెల్లడించింది. ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలను ఫ్యాక్ట్ ఫైండర్ మహమ్మద్ జుబేర్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భాజపాకు రూ.6,061 కోట్లు, తృణమూల్కు రూ.1,610 కోట్లు, కాంగ్రెస్కు 1,422 కోట్లు వచ్చాయి. బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిత్తల్ నుంచి బిలియనీర్ సునీల్ భారతీ మిత్తల్, అనిల్ అగర్వాల్, ఐటీసీ, మహీంద్ర అండ్ మహీంద్ర, కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, అంతగా పేరులేని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీలున్నాయి. మరోవైపు ఎన్నికల బాండ్లపై శుక్రవారం ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ముంబయికి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ రూ.410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత రూ.400 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. హల్దియా ఎనర్జీ సంస్థ రూ.377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. గాజియాబాద్ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూ.162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ తన సొంత డబ్బు రూ.35 కోట్లతో బాండ్లను కొన్నారు. దీంతోపాటు ఆయన కంపెనీలు మరో రూ.247 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి. ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విరాళం రూ.224 కోట్లు. వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్: రూ.220 కోట్లు. కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్: రూ.194 కోట్లు. మదన్లాల్ లిమిటెడ్: రూ.185 కోట్లు. డీఎల్ఎఫ్ గ్రూప్: రూ.170 కోట్లు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్: రూ.123 కోట్లు. బిర్లా కార్బన్ ఇండియా: రూ.105 కోట్లు. రుంగ్తా సన్స్: రూ.100 కోట్లు. కిరణ్ మజుందార్ షా, వరుణ్ గుప్తా, బీకే గోయెంకా, జైనేంద్ర షా, మోనికా వ్యక్తిగతంగా బాండ్లను కొన్నారు. బజాజ్ ఆటో రూ.18 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.20 కోట్లు, ఇండిగో సంస్థలు రూ.36 కోట్లు, స్పైస్జెట్ రూ.65 లక్షల బాండ్లను కొన్నాయి. ఇండిగో సంస్థకు చెందిన రాహల్ భాటియా రూ.20 కోట్ల బాండ్లను కొన్నారు. రూ.10లక్షల విలువైన బాండ్లను 4,620 మంది, రూ.లక్ష విలువైన బాండ్లను 2,228 మంది కొనుగోలు చేశారు.
మేఘా ఇంజినీరింగ్ భారీ విరాళం
ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ రాజకీయ పార్టీలకు రూ.966 కోట్ల విరాళం ఇచ్చింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకూ ఆ సంస్థ కోటి రూపాయల విలువైన 966 బాండ్లను కొనుగోలు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడైంది. షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే రూ.కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది.
ఎవరి వాటా ఎంత?
- డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్: రూ.80 కోట్లు
- నాట్కోఫార్మా: రూ.70 కోట్లు
- ఎన్సీసీ లిమిటెడ్: రూ.60 కోట్లు
- హెటిరో గ్రూప్: రూ.60 కోట్లు'
- నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్: రూ.55 కోట్లు
- దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్: రూ.55 కోట్లు
- అరబిందో ఫార్మా లిమిటెడ్: రూ.50 కోట్లు
- రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.45 కోట్లు
- గ్రీన్కో: రూ.35 కోట్లు
- అపర్ణా ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థ: రూ.30 కోట్లు
- ఎన్ఎస్ఎల్ ఎస్ఈజెడ్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.29 కోట్లు
- కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్: రూ.26.50 కోట్లు
- మైహోం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.25 కోట్లు
- రాజపుష్ప గ్రూప్: రూ.25 కోట్లు
- ఏపీఎల్ హెల్త్కేర్ లిమిటెడ్: రూ.10 కోట్లు
- నారా కన్స్ట్రక్షన్స్: రూ.10 కోట్లు
- భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్: రూ.10 కోట్లు
- సోమశిల సోలార్ పవర్ లిమిటెడ్: రూ.7 కోట్లు
- శ్రీచైతన్య స్టూడెంట్స్ మేనేజ్మెంట్: రూ.6 కోట్లు
- సుధాకర్ కంచర్ల: రూ.5 కోట్లు
- కేసీఆర్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ: రూ.5 కోట్లు
- ఐల్యాబ్స్ హైదరాబాద్ టెక్నాలజీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.5 కోట్లు.
వైకాపాకు రూ.337 కోట్లు: ఎన్నికల బాండ్ల రూపంలో ఏపీలో అందిన విరాళాల్లో వైకాపాదే అగ్రస్థానం. ఆ పార్టీకి ఇప్పటిదాకా రూ.337 కోట్లు అందాయి. తెదేపాకు రూ.219 కోట్లు వచ్చాయి. జనసేనకు రూ.21 కోట్లు వచ్చాయి.
తెలంగాణలో భారాసకు రూ.1,215 కోట్ల విరాళాలు అందాయి.
మహమ్మద్ జుబేర్ అందించిన వివరాల ప్రకారం పార్టీల వారీగా విరాళాలు..
బీజేడీ: రూ.776 కోట్లు. డీఎంకే: రూ.639 కోట్లు. శివసేన: రూ.158 కోట్లు. ఆర్జేడీ: రూ.73 కోట్లు. ఆప్: రూ.65 కోట్లు. జనతాదళ్(సెక్యులర్): రూ.44 కోట్లు. ఎన్సీపీ: రూ.31 కోట్లు. ఎస్పీ: రూ.14 కోట్లు. జేడీయూ: రూ.14 కోట్లు.
ఎన్నికల బాండ్లను పొందిన పార్టీలు
భాజపా, కాంగ్రెస్, భారాస, వైకాపా, ఏఐఏడీఎంకే, తెదేపా, శివసేన, డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, సమాజ్వాదీ పార్టీ, జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, బిజూ జనతాదళ్, గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా, జేఎంఎం, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, జనసేన.
ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీలు..
మేఘా ఇంజినీరింగ్, స్పైస్ జెట్, ఇండిగో, గ్రాసిం ఇండస్ట్రీస్, పిరమిల్ ఎంటర్ప్రైజెస్, టొరెంట్ పవర్, భారతీ ఎయిర్టెల్, డీఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, లక్ష్మీ మిత్తల్, ఎడెల్వీస్, పీవీఆర్, కెవెంటర్, సులా వైన్, వెల్స్పన్, సన్ ఫార్మా, వర్ధమాన్ టెక్స్టైల్స్, జిందాల్ గ్రూప్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, సియట్ టైర్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఐటీసీ, కేపీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్
శుక్రవారం మొదలైన చార్ధామ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. -
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
Mamata Banerjee: రాజ్భవన్ ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో గవర్నర్ చూపించిన వీడియో ఎడిటెడ్ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన వద్ద ఫుల్ వీడియోల పెన్డ్రైవ్ ఉందన్నారు. -
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు
మావోయిస్టుల కోటగా పేరున్న ఛత్తీస్గడ్లో భద్రతా దళాలు వ్యూహాత్మకంగా చొచ్చుకెళుతున్నాయి. దండకారణ్యాన్ని చీల్చుకొంటూ క్యాంపులు వేస్తున్నాయి. ఫలితంగా అడవుల నుంచి మావోలను వేగంగా ఏరివేస్తున్నాయి. -
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
లఖ్నవూకు చెందిన ఓ యూట్యూబర్ గన్ను చూపిస్తూ చేసిన రీల్ సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. -
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
International Space Station: చెన్నై గగనతలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది.