దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది.
దిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులోకి తీసుకున్న ఈడీ
రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన గంటల్లోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ
ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు
దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు
సుప్రీంను ఆశ్రయించిన ఆప్ అగ్రనేత.. నేడు విచారణ!
దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. అంతకుముందు అక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకున్నప్పుడు ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు.
ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ దిల్లీ పోలీసులు మూసివేశారు. కీలక పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేయగా...అరెస్టయినప్పటికీ ఆయనే సీఎంగా కొనసాగుతారని ఆప్ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ప్రకటించారు. అవసరమైతే జైలునుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని అన్నారు.
దిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు 16 మందిని ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసు అభియోగ పత్రాల్లో పలుమార్లు కేజ్రీవాల్ పేరును ప్రస్తావించింది. విచారణకు హాజరుకావాలని ఈడీ 9సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ నిరాకరించిన కేజ్రీవాల్...అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను జస్టిస్ సురేశ్కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీని వివరణ కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఈడీ అధికారుల బృందం సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లడం, సోదాలు చేయడం, ప్రశ్నించి ఆయనను అదుపులోకి తీసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇదే కేసులో... గత వారం భారాస నేత కవితను ఈడీ అరెస్టు చేసింది. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. గురువారం నాటి సోదాల్లో కేజ్రీవాల్ నివాసంలో కేసుకు సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని, రూ.70వేలు ఇంట్లో ఉండగా ఆ మొత్తాన్ని ఈడీ అధికారులు తమకు అప్పగించారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కేజ్రీవాల్ సెల్ఫోన్ను దర్యాప్తు అధికారులు తీసేసుకున్నారన్నారు. అరెస్టును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా భాజపా కార్యాలయాల ఎదుట నిరసనలకు ఆప్ పిలుపునిచ్చింది.
సుప్రీంకోర్టులో పిటిషన్
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసిన వెంటనే కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తుండగానే ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో న్యాయవాదులు గురువారం రాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లి వెంటనే విచారణ జరపటం కోసం విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సమ్మతించలేదని తెలిసింది. వారి పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న ఈడీ
అదుపులోకి తీసుకున్న తర్వాత కేజ్రీవాల్ను ఈడీ అధికారులు సెంట్రల్ దిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆప్ నేతను శుక్రవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని, కస్టడీకి అప్పగించాలని కోరుతామని ఈడీ అధికారులు తెలిపారు.
ఇది రాజకీయ కుట్రే: ఆప్
లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద రాజకీయ కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా ఆరోపించారు. పంజాబ్ సీఎం మాన్, కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, సమాజ్వాదీ, ఆర్జేడీ పార్టీలు ఖండించాయి. ఎన్నికల సమయంలో అరెస్టులు రాజకీయాల స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్పవార్ విమర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ తప్పుకోవాలని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. ‘భయపడిన ఓ నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటున్నాడు. మీడియా సహా అన్ని సంస్థలను బంధించి, పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, కంపెనీల నుంచి డబ్బు వసూలు చేస్తూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాను స్తంభింపజేస్తూ ప్రవర్తిస్తున్నారు. దీనికి ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
లఖ్నవూకు చెందిన ఓ యూట్యూబర్ గన్ను చూపిస్తూ చేసిన రీల్ సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. -
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
International Space Station: చెన్నై గగనతలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM