దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది.
దక్షిణాది విద్యాసంస్థల నుంచి అధికం
అగ్రస్థానంలో తమిళనాడు, ఆరో స్థానంలో తెలంగాణ
నాస్కామ్ ‘పేటెంట్స్ ట్రెండ్స్ ఇండియా’ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. గత ఐదేళ్లలో పేటెంట్స్ ఫైలింగ్లో వార్షిక పెరుగుదల రేటు 24.6 శాతంగా నమోదవుతోందని, గత నాలుగేళ్లలో లభించిన పేటెంట్ల సంఖ్య రెండింతలైందని తెలిపింది. దేశవ్యాప్తంగా దిల్లీ, కోల్కతా, ముంబయి, చెన్నైలోని పేటెంట్ ఫైలింగ్ కార్యాలయాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, నూతన టెక్నాలజీలకు సంబంధించిన నిపుణులను నియమించాల్సిన అవసరముందని తెలిపింది. నాస్కామ్ సంస్థ ‘పేటెంట్స్ ట్రెండ్స్ ఇండియా’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు పేర్కొంది. పేటెంట్స్ దాఖలులో ఎన్నారైల వాటా కంటే.. స్థానికుల వాటా పెరుగుతోంది. 2019లో స్థానికుల వాటా 33.6 శాతం నుంచి 2023 నాటికి 52.3 శాతానికి పెరగ్గా, ఎన్నారైల వాటా 66.4 శాతం నుంచి 47.7 శాతానికి తగ్గిందని వివరించింది. ఆవిష్కర్తలు మెరుగైన, పరిపూర్ణమైన ఆలోచన వచ్చిన వెంటనే పేటెంట్కు దరఖాస్తు చేయాలని.. మార్కెట్లోకి వెళ్లేంత వరకు ఆగాల్సిన పనిలేదని నివేదిక సూచించింది.
అక్కడి సదుపాయాలతో ప్రోత్సాహం
దేశవ్యాప్తంగా పేటెంట్స్ ఫైలింగ్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణ ఆరో స్థానం, ఏపీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. తమిళనాడు 9.3 శాతం, మహారాష్ట్ర 6.8 శాతంతో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అగ్రభాగాన ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ విధానాలు, రిజిస్ట్రేషన్లకు రాయితీలు, సలహా కేంద్రాలు, పరిశోధన-అభివృద్ధి, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సౌకర్యాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో పీహెచ్డీ చదువుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన 2 శాతం మంది సైంటిస్టుల్లో 200 మంది తమిళనాడు నుంచి ఉండటం విశేషం. ఐఐటీ మద్రాస్, స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమాలు డిగ్రీ, పీజీ విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తున్నాయి.
డీప్ టెక్నాలజీలో హైదరాబాద్ సంస్థ టాప్
దేశంలోని విద్యాసంస్థల నుంచి దాఖలవుతున్న పేటెంట్స్ ఏడాది వ్యవధిలోనే 11 నుంచి 23 శాతానికి చేరాయి. 2022లో 7,400 దరఖాస్తులుండగా.. 2023 నాటికి 19,200కి చేరాయి. బెంగళూరు ఐఐఎస్సీ ఇప్పటివరకు వెయ్యి పైచిలుకు దరఖాస్తులు చేయగా.. 600కి పైగా పేటెంట్లు లభించాయి. ఇందులో మహిళా ఆవిష్కర్తలకు సంబంధించినవి 150కి పైగా ఉన్నాయి. ఐఐటీ మద్రాస్ నుంచి 2700కు పైగా దాఖలైతే.. 1300కి పైగా అనుమతులు లభించాయి. డీప్ టెక్నాలజీ స్టార్టప్ పేటెంట్లలో హైదరాబాద్ ఐఐటీకి చెందిన విసిగ్ నెట్వర్క్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ హైదరాబాద్ ఐఐటీ బిజినెస్ ఇంక్యుబేషన్ కేంద్రం నుంచి వైర్లెస్ టెక్నాలజీ సంస్థగా ఆవిర్భవించింది. 5జీ నెట్వర్క్లో పనిచేస్తోంది. 5జీ టెక్నాలజీపై విసిగ్ సంస్థకు 160 పేటెంట్లు ఉన్నాయి.
ఏఐ, ఐవోటీ టెక్నాలజీలు అధికం
డీప్ టెక్నాలజీ స్టార్టప్లలో అమెరికా తరువాత భారత్లోనే ఎక్కువగా పేటెంట్లు దాఖలవుతున్నాయి. దేశంలోని దిల్లీ, ముంబయి, కోల్కతా కార్యాలయాలతో పోల్చితే చెన్నై పేటెంట్ కార్యాలయానికి దేశంలోని 70 శాతం డీప్టెక్ స్టార్టప్ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. హెల్త్కేర్, ఆటోమేషన్ - సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఈ-కామర్స్, కస్టమర్ సర్వీస్ ఆటోమేషన్ రంగాలు అగ్రస్థానంలో ఉన్నాయి. టెక్నాలజీల పరంగా కృత్రిమమేధ (ఏఐ) అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, న్యూరో టెక్నాలజీ, నానో టెక్నాలజీ రంగాలు ఉన్నాయి.
మౌలిక సదుపాయాలు ఇలా..
- దేశంలో పేటెంట్ తుది నిర్ణయానికి ఎక్కువ సమయం పడుతోంది. జపాన్లో 15 నెలలు, చైనాలో 16.5 నెలలు, అమెరికాలో 23.1 నెలలు, యూకేలో 32 నెలల సమయం తీసుకుంటే భారత్లో ఈ సమయం 51 నెలలలు ఉండటం గమనార్హం.
- అమెరికాలో పేటెంట్ ఎగ్జామినర్లు 8234 మంది ఉంటే.. జపాన్లో 1662 మంది, భారత్లో 597 మంది ఉన్నారు. యూకేలో ఒక్కో ఎగ్జామినర్కు 57 దరఖాస్తులు ఉంటే.. భారత్లో 129 ఉన్నాయి.
- ఎగ్జామినర్ల సగటు అనుభవం అమెరికాలో 13.7 ఏళ్లు, యూకేలో 13.6, భారత్లో 5.9 ఏళ్లు ఉంది. భారత్లో ప్రతి ఎగ్జామినర్ వద్ద 418 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
- ఈ సమస్యలు పరిష్కరించాలి...
- ఇండియన్ పేటెంట్ సెర్చ్ పోర్టల్ (ఇన్పాస్) అంతర్జాతీయ ప్రమాణాల మేరకు, అందరికీ స్నేహపూర్వకంగా ఉండాలి. అప్పటికే దాఖలైన పేటెంట్లు, ఆవిష్కరణల సమగ్ర వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలి.
- పేటెంట్ దాఖలు ప్రక్రియ మరింత సులభతరం చేయాలి. కార్యాలయాల్లో డొమైన్, సాంకేతిక నిపుణులను నియమించాలి. సందేహాలు నివృత్తి చేసేందుకు అవసరమైన సహాయం, చాట్బాట్, కస్టమర్ కేర్ సౌకర్యాలు కల్పించాలి.
- పేటెంట్ దాఖలుకు అవసరమైన అర్హతలు, వివరాలన్నీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయాలి. కొత్త టెక్నాలజీలపై నిపుణుల సంఖ్య పెంచాలి. దరఖాస్తులు వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి.
- అంతర్జాతీయ పేటెంట్ ఫైల్కు సంబంధించి సదుపాయాలు కల్పించాలి. దరఖాస్తులు సకాలంలో పరిష్కరించేలా అవసరమైన న్యాయ సహాయం కల్పించాలి.
- పరిశ్రమలు, విద్యాలయాల మధ్య టెక్నాలజీ బదిలీలకు సంబంధించి కేంద్రీకృత వ్యవస్థ ఉండాలి. తద్వారా పరిశ్రమ, విద్యాలయాలు సంఘటితమై ఉత్పత్తులను ముందుకు తీసుకెళ్లవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
International Space Station: చెన్నై గగనతలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు