మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
దిల్లీ: ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ నెల 16న వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం స్వాతి మాలీవాల్కు ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వెల్లడైంది. ఎడమకాలుపై, కుడి కన్ను కింద గాయం ఉందని వైద్య నివేదిక పేర్కొంది. ఆ తర్వాత దాదాపు 3 గంటలు వైద్యపరీక్షలు నిర్వహించగా ముఖంపై గాయాలతో పాటు శరీరం లోపల కూడా గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. ఇది స్వాతి మాలీవాల్ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉంది.
సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
మాలీవాల్పై దాడి చేసిన ఆరోపణల కేసులో సీసీటీవీ ఫుటేజీని, సాక్ష్యాలను నిందితుడు బిభవ్ కుమార్ ధ్వంసం చేసి ఉండొచ్చని దిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ పార్లమెంటు సభ్యురాలిపై, సీఎం ఇంట్లో దాడి జరగడం చాలా తీవ్రమైన పరిణామమని దిల్లీ డిప్యూటీ కమిషనర్ అంజిత చెప్యాల అన్నారు. దర్యాప్తు సమయంలో నిందితుడు సహకరించలేదని, సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసులో నిందితుడికి తీస్ హజారీ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బిభవ్ కుమార్ తన ఐఫోన్ పాస్వర్డ్ను తెలపడానికి సైతం నిరాకరించారని పోలీసులు పేర్కొన్నారు. తన ఫోన్ హ్యాంగ్ అయినందున దానిని ముంబయిలో ఫార్మాట్ చేయించానని దాటవేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాబట్టి బిభవ్ను ముంబయి తీసుకెళ్లి మొబైల్ను అన్లాక్ చేయిస్తామన్నారు. సీఎం నివాసంలోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్ను స్వాధీనం చేసుకున్నామని, అందులోని ఫుటేజీలో కొంత భాగం ఖాళీగా ఉందని వారు పేర్కొన్నారు. నిందితుడు బయట ఉంటే తన హోదాను ఉపయోగించి సాక్షులను బెదిరించవచ్చు, సాక్ష్యాలను తారుమారు చేయవచ్చనే కారణంతో ఆయనను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరోవైపు ఆదివారం కూడా కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ డీవీఆర్ సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
కథలు అల్లుతున్న పోలీసులు: ఆప్
కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూంలో అసలు సీసీటీవీ కెమెరాను తానెప్పుడూ గమనించలేదని అలాంటి చోట ఎవరూ ఏర్పాటు చేసుకోరని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆదివారం విలేకరులతో పేర్కొన్నారు. అసలు సీసీటీవీయే లేనప్పుడు దాని ఫుటేజీని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నివాసానికి సంబంధించిన ఫుటేజీ అంతా పోలీసుల వద్దే ఉందని, అందులో వారు ఏదైనా విషయాన్ని గమనిస్తే దాన్ని మీడియాకు వెల్లడించాలని కోరారు. లోక్సభ ఎన్నికల ముందు ఆప్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు భాజపా తరఫున పోలీసులు కథలు అల్లుతున్నారని ఆరోపించారు.
కేజ్రీవాల్ మౌనం వీడాలి
భాజపా డిమాండ్
దిల్లీ: ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్ నాటకాలు ఆపి మౌనం వీడాలని భాజపా డిమాండ్ చేసింది. ‘‘సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఎందుకు మాయమైంది? ఆధారాలు నాశనం చేయడంలో నిందితుడు బిభవ్ కుమార్కు కేజ్రీవాల్ సహాయం చేశారా? సీఎం నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా విడుదల చేయకుండా క్లిప్పుల్లా ఎందుకు విడుదల చేశారు’’అని పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో నిలదీశారు. ఈ ప్రశ్నలన్నింటికీ కేజ్రీవాల్ సమాధానాలు ఇవ్వాలని సూచించారు. మరోపక్క భాజపా ప్రధాన కార్యాలయంలో ఈశాన్య దిల్లీ సిటింగ్ ఎంపీ, ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి మనోజ్ తివారీ మాట్లాడుతూ..నిందితుడు కుమార్ను రక్షించేందుకే కేజ్రీవాల్ ఆందోళన చేపట్టారని ఆరోపించారు. మాలీవాల్ కేసులో ఎందుకు ఆయన మాట్లాడటంలేదని నిలదీశారు. నిందితుడు బిభవ్ కుమార్ను ఎందుకు రక్షించాలనుకొంటున్నారు? మహిళపై చేయి చేసుకున్న వ్యక్తికి మద్దతుగా ఎందుకు నిలబడుతున్నారు. ఎంత దిగజారుడు ఆలోచన. దీన్ని చూసి దిల్లీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురవుతున్నారు’’ అని ప్రశ్నించారు.
నిందితుల రక్షణ కోసం పోరాటమా?
ఆప్ నిరసనపై మాలీవాల్ ఆక్షేపణ
దిల్లీ: ఆప్ ఆదివారం నిర్వహించిన నిరసనను ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్ విమర్శించారు. ఒకప్పుడు అవినీతి, అక్రమాలపై పోరాటం జరగ్గా.. ఇప్పుడు అది నిందితుల రక్షణ కోసం జరుగుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చాం. 12 ఏళ్ల తర్వాత ఈరోజు.. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసి, ఫోన్ను ఫార్మాట్ చేసిన నిందితుణ్ని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా?’’ అని మాలీవాల్ ప్రశ్నించారు. తనపై దాడి చేసినట్లుగా ఆమె ఆరోపిస్తున్న కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్కు మద్దతుగా ఆందోళన కార్యక్రమం జరుగుతోందని పరోక్షంగా ఆరోపించారు. బిభవ్ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!