సంక్షిప్త వార్తలు
చాలా మంది ప్రణాళికలు వేసుకొని కూడా పనిని మొదలుపెట్టకపోవడానికి ముఖ్య కారణం ఫలితాలపై అనిశ్చితి, భయం.
వాయిదా వేసేకొద్దీ సమయం వృథా
- నికోలస్ కోల్, డిజిటల్ రైటర్
చాలా మంది ప్రణాళికలు వేసుకొని కూడా పనిని మొదలుపెట్టకపోవడానికి ముఖ్య కారణం ఫలితాలపై అనిశ్చితి, భయం. ఇందులో నేను విఫలం అవుతానేమో.. దీనికి వెచ్చించిన సమయమంతా వృథా అవుతుందేమో అని భావిస్తుంటారు. వాస్తవానికి పనిని మొదలుపెట్టకుండా ఖాళీగా ఉండటం వల్లనే సమయం వృథా అవుతుంటుంది. దానివల్ల మీకు తక్కువ సమయమే మిగిలి భయాందోళనలు మరింత పెరుగుతాయి. అందుకే ఫలితాల గురించి ఆలోచించకుండా ఆచరణలోకి దిగండి.
ఆనందంగా ఉంటున్నారా? అలా కనిపిస్తున్నారా?
- అంకుర్ వారికూ, కంటెంట్ క్రియేటర్
మీరు ఆనందంగా ఉండాలను కుంటున్నారా? ఆనందంగా కనిపించాలనుకుంటున్నారా? ఈ రెండింటికి దారులు భిన్నం. మీ మనస్తత్వానికి, అభిరుచులకు అనుగుణంగా జీవిస్తే ఆనందంగా ఉంటారు. ఆనందంగా కనిపించాలని ప్రయత్నిస్తున్నారంటే మాత్రం సమాజం ఒత్తిళ్లకు లొంగి మీది కాని జీవితాన్ని కొనసాగిస్తున్నారని అర్థం. అలాగే మీకు ఉత్సాహం కలిగించని వేరెవరో నిర్దేశించిన లక్ష్యాలను అందుకున్నా మీకు విజయం సాధించిన ఆనందం కలగదు.
నెట్వర్కింగ్కు అర్థం ఇదీ..
- డేవిడ్ లవ్జాయ్, మార్కెటింగ్ నిపుణులు
ఈ రోజుల్లో వృత్తిపరంగానూ, వ్యక్తిగత జీవితంలోనూ ఉన్నత స్థాయికి చేరాలంటే ప్రతిభ, కష్టపడే స్వభావంతోపాటు నెట్వర్కింగ్ కీలకంగా మారింది. మన పరిధిని విస్తృతం చేసుకోవాలంటే అది తప్పనిసరి. అయితే నెట్వర్కింగ్ అంటే బిజినెస్ కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం కాదు. సత్సంబంధాల విత్తనాలను నాటడం. కాలంతోపాటు అవి వృక్షాలుగా మారి మనకు ఫలాలనిస్తాయి.
ఎటువైపు ఆకర్షితులవుతున్నారు?
- వాలా అఫ్సర్, కాలమిస్టు
ఇటువైపు వద్దు: డబ్బు, హోదా, ఆహార్యం, అనుభవం, అనుకరణ, విశేషణాలు.
ఇటువైపు వెళ్లండి: దయ, కరుణ, నమ్మకం, నిస్వార్థం, వినయం, విధేయత, స్వీయ అవగాహన- ధైర్యం, నిజాయతీ, పరోపకారం
సోరెన్ బెయిలు పిటిషన్పై ఈడీ స్పందనకు హైకోర్టు ఆదేశం
రాంచీ: బెయిలు కోసం ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చేసుకున్న దరఖాస్తుపై స్పందన తెలియజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఝార్ఖండ్ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 10న చేపడతామని తెలిపింది. ఒక భూ కుంభకోణం కేసులో అక్రమ ధనాన్ని సక్రమమైనదిగా చలామణి చేశారంటూ సోరెన్ను ఈడీ జనవరి 31న అరెస్టు చేసింది. దాంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేసుపై త్వరగా విచారణ జరపాలని సోరెన్ సోమవారంనాడు హైకోర్టుకు పిటిషన్ పెట్టారు. బర్గైన్ సర్కిల్లో 8.5 ఎకరాల భూమి కబ్జా అయిందని ఆరోపిస్తున్నారనీ, దస్తావేజులలో తనపేరు ఎక్కడా లేదని తెలిపారు. నగదు అక్రమ చలామణి నిరోధ చట్టం (పీఎంఎల్యే) కింద కూడా తనపై నేరాభియోగం దాఖలు చేయలేదని వివరించారు. కొందరు నోటిమాటగా చెప్పిన అంశాలను ఈడీ పరిగణనలోకి తీసుకుందని చెప్పారు.
సందేశ్ఖాలీ ఘటన నిందితులపై హత్యానేర అభియోగాలు మోపిన సీబీఐ
దిల్లీ: పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై జనవరి 5న మూకుమ్మడి దాడికి పాల్పడినందుకు తృణమూల్ బహిష్కృతనేత షాజహాన్ షేక్, అతని సోదరుడు ఆలంగీర్, మరో ఐదుగురిపై.. సీబీఐ అభియోగాలు మోపింది. వారంతా నేరపూరిత కుట్రకు, హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బశీర్హాట్లోని ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం తొలి అభియోగపత్రం దాఖలు చేసింది. బెంగాల్లో రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో షేక్ నివాసంలో సోదాలకు ఈడీ బృందం వెళ్లినప్పుడు దాదాపు వెయ్యిమంది మూక వారిపై దాడికి తెగబడిన విషయం తెలిసిందే.
విందులో ఆహారం విషతుల్యమై రాజస్థాన్లో నలుగురి మృతి
ఉదయ్పుర్: రాజస్థాన్లోని ఉదయ్పుర్ జిల్లాలో ఆహారం విషతుల్యంగా మారి నలుగురు మృతిచెందగా, మరో 30 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి సావన్ క్యారా గ్రామంలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో దాదాపు 80 మంది పాల్గొన్నారు. రాత్రి భోజనం చేసిన వెంటనే పలువురు కడుపు నొప్పిగా ఉందని వాంతులు చేసుకోవడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. బాధితుల్లో 12 మందిని మెరుగైన చికిత్స కోసం గుజరాత్కు తరలించారు.
బిభవ్ కుమార్కు మరో 3 రోజుల కస్టడీ
దిల్లీ: ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ను మరో మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచేందుకు దిల్లీ కోర్టు మంగళవారం అనుమతించింది. ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దాడి ఆరోపణ కేసులో బిభవ్ కుమార్ను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని, అయిదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని దిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గౌరవ్ గోయల్ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అనుమతించారు.
పాపువా న్యూగినీకి భారత్ రూ.8.31 కోట్ల సాయం
దిల్లీ: పాపువా న్యూగినీకి భారత్ రూ.8.31 కోట్ల ఆర్థికసాయం ప్రకటించింది. శుక్రవారం కొండచరియలు విరిగిపడి ఆ దేశంలోని ఎంగా ప్రావిన్స్లో రెండు వేలకు పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయి. సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఆ దేశం అంతర్జాతీయ సాయాన్ని కోరుతూ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది. న్యూగినీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంగళవారం విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
తమ సర్వీసుల నిలిపివేసే యోచన వాట్సప్, దాని మాతృసంస్థ మెటాకు లేదని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 5కోట్లకు పైనే: కేంద్రం
దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. -
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్