రక్త నమూనాలు మార్చేందుకు రూ.3 లక్షల లంచం

పుణెలో జరిగిన కారు ప్రమాదంలో మరో విషయం బయటపడింది. రూ.3 లక్షలకు కక్కుర్తిపడి వైద్యులే నిందితుడి రక్తం నమూనాలు మార్చేశారని పోలీసులు గుర్తించారు.

Published : 29 May 2024 05:05 IST

పుణె: పుణెలో జరిగిన కారు ప్రమాదంలో మరో విషయం బయటపడింది. రూ.3 లక్షలకు కక్కుర్తిపడి వైద్యులే నిందితుడి రక్తం నమూనాలు మార్చేశారని పోలీసులు గుర్తించారు. ఈ మొత్తాన్ని తెచ్చిన ఆస్పత్రి ప్యూన్‌ను అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన రోజు డాక్టర్‌ తావ్‌రే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి రక్తనమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్‌ కుదిరింది. నిందితుడైన బాలుడి రక్త నమూనాలకు బదులు వేరే డాక్టర్‌ నమూనాలను ఆ స్థానంలో పెడతామని తావ్‌డే వెల్లడించాడు. వైద్య పరీక్షల్లో ఆల్కహాల్‌ ఆనవాళ్లు బయటపడకూడదనే ఇలా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని