DA hike: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 4% డీఏ పెంపు
కేంద్ర ఉద్యోగులకు 4శాతం కరవు భత్యం 4శాతం పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 1, 2024 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు వచ్చేసింది. వారి కరవు భత్యం (DA) 4% పెరిగింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 46శాతం డీఏ 50శాతానికి చేరుకున్నట్లయ్యింది. జనవరి 1, 2024 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయంతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
డీఏ/డీఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.12,869 కోట్ల అదనపు భారం పడనున్నట్లు అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దీని ప్రభావం రూ.15,014 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది.
- భారత్లో కృత్రిమ మేధ (AI) అభివృద్ధి, పరిశోధనల కోసం సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా.. రూ.10 వేల కోట్లతో ‘ఏఐ మిషన్’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా ‘ఏఐ’పై యువతకు శిక్షణ, ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకోనున్నారు.
- గోవా శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పచ్చజెండా ఊపింది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం ఎస్టీలకు రిజర్వేషన్ సీట్లు లేవు. జనాభా ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
- ఈశాన్య భారతం కోసం రూ.10,037 కోట్లతో కొత్త పారిశ్రామిక అభివృద్ధి పథకం ‘ఉన్నతి (UNNATI)’కి కేబినెట్ ఆమోదం లభించింది. సంబంధిత రాష్ట్రాల్లో పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ఈ పథకాన్ని రూపొందించారు.
- 2024-25 సీజన్లో ముడి జనపనారకు కనీస మద్దతు ధరను క్వింటాల్కు రూ.285 పెంచారు. దీంతో మొత్తం ధర రూ.5,335కి చేరింది. ఈ నిర్ణయంతో తూర్పు రాష్ట్రాలు.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
- భారత సైన్యం, ఇండియన్ కోస్ట్ గార్డ్ అవసరాల కోసం 34 కొత్త ‘ఏఎల్హెచ్ ధ్రువ్’ హెలికాప్టర్ల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆర్మీకి 25, ఇండియన్ కోస్ట్ గార్డ్కు తొమ్మిది చొప్పున హెలికాప్టర్లను సమకూర్చనున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీటిని తయారుచేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు