అమెరికాలో హ్యారీ-మేఘన్.. ఆదాయం ఎలా?
అమెరికన్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే టీవీషోకు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ.. మేఘన్ మార్కెల్ దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్ రాజకుటుంబంలో ఉన్న వివాదాలను బయటపెట్టింది. బకింగ్హామ్ ప్యాలెస్లో మేఘన్కు ఎన్నో ఇబ్బందులు
ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే టీవీషోకు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ.. మేఘన్ మార్కెల్ దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్ రాజకుటుంబంలో ఉన్న వివాదాలను బయటపెట్టింది. బకింగ్హామ్ ప్యాలెస్లో మేఘన్కు ఎన్నో ఇబ్బందులు ఏర్పడటం.. కుటుంబంలో జరుగుతున్న కొన్ని విషయాలు హ్యారీకి కూడా నచ్చకపోవడంతో ఇద్దరు కలిసి ప్యాలెస్తోపాటు, రాజకుటుంబాన్ని వీడి బయటకు వచ్చేశారు. మేఘన్ స్వస్థలం యూఎస్లోని కాలిఫోర్నియాకి వచ్చి స్థిరపడ్డారు. హ్యారీ తీసుకున్న నిర్ణయంతో ఆగ్రహించిన బ్రిటన్ రాజకుటుంబం అతడి ఖర్చులకు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేసింది. దీంతో తన తల్లి ప్రిన్సెస్ డయానా నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బుతోనే తన ఆర్థిక అవసరాలు తీరుతున్నాయని హ్యారీ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే, డయానా నుంచి హ్యారీకి ఎంతమొత్తంలో నగదు అందింది? అమెరికాలోని కాలిఫోర్నియాలాంటి ప్రధాన రాష్ట్రంలో హ్యారీ కుటుంబం జీవించడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి? వంటి ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. పలు అంతర్జాతీయ పత్రికలు వాటిపై ఆరా తీసి.. సమాధానం కనిపెట్టాయి. అదేంటంటే..
అంతర్జాతీయ మీడియా అంచనా ప్రకారం.. ప్రిన్స్ హ్యారీకి తన తల్లి నుంచి వారసత్వంగా 10 మిలియన్ పౌండ్లు వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ప్రిన్స్ హ్యారీ పేరు మీద డయానా 8.9మిలియన్ పౌండ్లు మాత్రమే దాచిపెట్టారట. దానిపై వచ్చిన వడ్డీ.. ఇతర ఆదాయం కలిపి మొత్తం 10 మిలియన్ పౌండ్లు అయినట్లు మీడియా పేర్కొంది. ఆమె పెద్దకుమారుడు.. హ్యారీ సోదరుడు విలియమ్కు కూడా డయానా 9 మిలియన్ పౌండ్లు వదిలివెళ్లారట.
డయానా వివాహం.. విడాకులు.. భరణం
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్తో డయానాకు 1981లో వివాహమైంది. బ్రిటన్లో ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆమె.. చార్లెస్తో వివాహంతో బ్రిటన్ రాజకుటుంబంలో సభ్యురాలిగా మారారు. వారి వివాహబంధానికి గుర్తుగా ప్రిన్స్ విలియమ్స్.. ప్రిన్స్ హ్యారీలు జన్మించారు. కానీ, డయానా దంపతుల దాంపత్య జీవితం అంత సఖ్యంగా ఉండేది కాదు. పలు అంశాల్లో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 1996లో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డయానాకు భరణం కింద 17 మిలియన్ పౌండ్లు, జీవన భృతి కింద ఏటా 4లక్షల పౌండ్లు అందేలా ఒప్పందం కుదిరింది. కానీ, విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది అంటే 1997లో కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకుముందే భరణం కింద వచ్చిన డబ్బును డయానా తన ఇద్దరు పిల్లల పేరుమీద దాచిపెట్టారు. వారిద్దరికి పాతికేళ్లు వచ్చాక ఆ డబ్బుకు సంబంధించిన వడ్డీ వచ్చేలా.. 30 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం నగదు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అలా 36ఏళ్ల హ్యారీకి తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బే అమెరికాలో స్థిరపడటానికి ఉపయోగపడింది.
మేఘన్ వృత్తి.. ఒప్పందాలు
ప్రిన్స్ హ్యారీతో వివాహానికి ముందు మేఘన్ అనేక టీవీ సిరీస్లు.. పలు సినిమాల్లో నటించింది. సూట్స్ అనే సిరీస్లో మేఘన్ ఒక ఎపిసోడ్కు 50వేల డాలర్లు పారితోషికంగా తీసుకుందట. అలాగే, పలు బ్రాండ్స్కు ప్రచారకర్తగా, స్పాన్సర్షిప్ కింద ఏటా 80వేల డాలర్లు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ దాదాపు 2 మిలియన్ డాలర్లు ఉంటుందట. ఇద్దరి డబ్బులతో కాలిఫోర్నియాలో 14.65 మిలియన్ డాలర్లు పెట్టి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. అంతేకాదు, ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్, స్పూటిఫైలతో హ్యారీ, మేఘన్ మిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కుటుంబ పోషణ కోసమే ఈ ఒప్పందాలు చేసుకున్నామని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హ్యారీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
తమ సర్వీసుల నిలిపివేసే యోచన వాట్సప్, దాని మాతృసంస్థ మెటాకు లేదని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 5కోట్లకు పైనే: కేంద్రం
దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. -
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!