అమెరికాలో హ్యారీ-మేఘన్.. ఆదాయం ఎలా?
అమెరికన్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే టీవీషోకు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ.. మేఘన్ మార్కెల్ దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్ రాజకుటుంబంలో ఉన్న వివాదాలను బయటపెట్టింది. బకింగ్హామ్ ప్యాలెస్లో మేఘన్కు ఎన్నో ఇబ్బందులు
ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే టీవీషోకు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ.. మేఘన్ మార్కెల్ దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్ రాజకుటుంబంలో ఉన్న వివాదాలను బయటపెట్టింది. బకింగ్హామ్ ప్యాలెస్లో మేఘన్కు ఎన్నో ఇబ్బందులు ఏర్పడటం.. కుటుంబంలో జరుగుతున్న కొన్ని విషయాలు హ్యారీకి కూడా నచ్చకపోవడంతో ఇద్దరు కలిసి ప్యాలెస్తోపాటు, రాజకుటుంబాన్ని వీడి బయటకు వచ్చేశారు. మేఘన్ స్వస్థలం యూఎస్లోని కాలిఫోర్నియాకి వచ్చి స్థిరపడ్డారు. హ్యారీ తీసుకున్న నిర్ణయంతో ఆగ్రహించిన బ్రిటన్ రాజకుటుంబం అతడి ఖర్చులకు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేసింది. దీంతో తన తల్లి ప్రిన్సెస్ డయానా నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బుతోనే తన ఆర్థిక అవసరాలు తీరుతున్నాయని హ్యారీ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే, డయానా నుంచి హ్యారీకి ఎంతమొత్తంలో నగదు అందింది? అమెరికాలోని కాలిఫోర్నియాలాంటి ప్రధాన రాష్ట్రంలో హ్యారీ కుటుంబం జీవించడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి? వంటి ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. పలు అంతర్జాతీయ పత్రికలు వాటిపై ఆరా తీసి.. సమాధానం కనిపెట్టాయి. అదేంటంటే..
అంతర్జాతీయ మీడియా అంచనా ప్రకారం.. ప్రిన్స్ హ్యారీకి తన తల్లి నుంచి వారసత్వంగా 10 మిలియన్ పౌండ్లు వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ప్రిన్స్ హ్యారీ పేరు మీద డయానా 8.9మిలియన్ పౌండ్లు మాత్రమే దాచిపెట్టారట. దానిపై వచ్చిన వడ్డీ.. ఇతర ఆదాయం కలిపి మొత్తం 10 మిలియన్ పౌండ్లు అయినట్లు మీడియా పేర్కొంది. ఆమె పెద్దకుమారుడు.. హ్యారీ సోదరుడు విలియమ్కు కూడా డయానా 9 మిలియన్ పౌండ్లు వదిలివెళ్లారట.
డయానా వివాహం.. విడాకులు.. భరణం
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్తో డయానాకు 1981లో వివాహమైంది. బ్రిటన్లో ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆమె.. చార్లెస్తో వివాహంతో బ్రిటన్ రాజకుటుంబంలో సభ్యురాలిగా మారారు. వారి వివాహబంధానికి గుర్తుగా ప్రిన్స్ విలియమ్స్.. ప్రిన్స్ హ్యారీలు జన్మించారు. కానీ, డయానా దంపతుల దాంపత్య జీవితం అంత సఖ్యంగా ఉండేది కాదు. పలు అంశాల్లో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 1996లో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డయానాకు భరణం కింద 17 మిలియన్ పౌండ్లు, జీవన భృతి కింద ఏటా 4లక్షల పౌండ్లు అందేలా ఒప్పందం కుదిరింది. కానీ, విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది అంటే 1997లో కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకుముందే భరణం కింద వచ్చిన డబ్బును డయానా తన ఇద్దరు పిల్లల పేరుమీద దాచిపెట్టారు. వారిద్దరికి పాతికేళ్లు వచ్చాక ఆ డబ్బుకు సంబంధించిన వడ్డీ వచ్చేలా.. 30 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం నగదు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అలా 36ఏళ్ల హ్యారీకి తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బే అమెరికాలో స్థిరపడటానికి ఉపయోగపడింది.
మేఘన్ వృత్తి.. ఒప్పందాలు
ప్రిన్స్ హ్యారీతో వివాహానికి ముందు మేఘన్ అనేక టీవీ సిరీస్లు.. పలు సినిమాల్లో నటించింది. సూట్స్ అనే సిరీస్లో మేఘన్ ఒక ఎపిసోడ్కు 50వేల డాలర్లు పారితోషికంగా తీసుకుందట. అలాగే, పలు బ్రాండ్స్కు ప్రచారకర్తగా, స్పాన్సర్షిప్ కింద ఏటా 80వేల డాలర్లు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ దాదాపు 2 మిలియన్ డాలర్లు ఉంటుందట. ఇద్దరి డబ్బులతో కాలిఫోర్నియాలో 14.65 మిలియన్ డాలర్లు పెట్టి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. అంతేకాదు, ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్, స్పూటిఫైలతో హ్యారీ, మేఘన్ మిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కుటుంబ పోషణ కోసమే ఈ ఒప్పందాలు చేసుకున్నామని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హ్యారీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు