Chhattisgarh: రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!
ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా, ఆప్ నుంచి పోటీచేసిన ఏడుగురు రాజవంశీయులు ఓటమి చెందడంతో తొలిసారిగా అసెంబ్లీలో వారికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
రాయ్పుర్: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో తొలిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈసారి అసెంబ్లీలో రాజవంశీయులకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా, ఆప్ నుంచి పోటీచేసిన ఏడుగురు రాజవంశీయులు ఓటమి చెందడమే ఇందుకు కారణం. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్దేవ్ కూడా ఉండటం గమనార్హం.
2000లో ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగా.. అప్పటి నుంచి ఈ ఐదు పర్యాయాలు రాజవంశీయుల ప్రాతినిధ్యం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఏడుగురు రాజవంశీయులు పోటీ చేశారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ తరఫున, ముగ్గురు భాజపా టికెట్పై, ఒకరు ఆప్ తరఫున బరిలో నిలిచారు. కానీ, పార్టీలకు అతీతంగా అనూహ్యంగా వీరందరూ ఓటమి చవిచూశారు.
సీఎం రేసులో ఉండి..
సర్గుజా రాజకుటుంబానికి చెందిన టి.ఎస్.సింగ్దేవ్ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి. కాంగ్రెస్ తరఫున అంబికాపుర్ నుంచి పోటీ చేశారు. గత మూడు దఫాలూ ఇక్కడ సింగ్దేవ్దే విజయం. 2018 ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రి రేసులోనూ కొనసాగారు. కానీ, తాజా ఫలితాల్లో 94 ఓట్ల తేడాతో భాజపా ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్ చేతిలో ఓడిపోయారు. ఉత్తర ఛత్తీస్గఢ్లోని జర్గుజా డివిజన్లో ఉన్న 14 నియోజకవర్గాల్లో వీరి కుటుంబ ప్రభావం ఉండేది. 2018 ఎన్నికల్లో ఈ స్థానాలన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. తాజా ఎన్నికల్లో వీటన్నింటినీ భాజపా తన ఖాతాలో వేసుకుంది.
Congress: ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్ ఫలితం అంతుపట్టడం లేదు!
సర్గుజా రాజకుటుంబ వారసుల్లో ఒకరైన అంబికాసింగ్ దేవ్ బైకుంఠపుర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ టికెట్పై మళ్లీ అక్కడి నుంచే బరిలో దిగిన ఆమె భాజపా నేత భైయాలాల్ రాజ్వాడే చేతిలో 25వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫుల్జాహర్లోని గోండ్ రాజకుటుంబానికి చెందిన మరోనేత దేవేంద్ర బహదూర్ సింగ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తన సిట్టింగ్ స్థానమైన బస్నా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అజిత్ జోగీ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన.. భాజపా నేత సంపత్ అగర్వాల్ చేతిలో 36వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
భాజపాలోనూ..
భాజపా నుంచి బరిలో దిగిన ముగ్గురు రాజవంశీయులు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. జష్పుర్ సంస్థానాన్ని పరిపాలించిన జూదేవ్ రాజకుటుంబానికి చెందిన సంయోగితా సింగ్ గత ఎన్నికల్లో చంద్రాపుర్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసి రెండోసారి కూడా ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రామ్కుమార్ యాదవ్ 15వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక భాజపా అగ్రనేత దిలీప్సింగ్ జూదేవ్ కుమారుడైన ప్రబల్ ప్రతాప్సింగ్ కూడా భాజపా అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిపాలయ్యారు.
అంబాగఢ్ చౌకీ సంస్థానాన్ని పాలించిన నాగవంశీ గోండ్ రాజకుటుంబ వారసుడు సంజీవ్ షా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి భాజపా టికెట్పై మొహ్లా-మాన్పుర్ నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో 31 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇక లొహారా రాజకుటుంబ వారసుడు ఖడ్గరాజ్ సింగ్ ఆప్ తరఫున కవర్ధా నియోజకవర్గం బరిలో నిలిచారు. కేవలం 6వేల పైచిలుకు ఓట్లను మాత్రమే సాధించి మూడోస్థానంలో నిలిచారు. ఇలా వివిధ పార్టీల నుంచి ఏడుగురు రాజవంశీయులు పోటీ చేసినప్పటికీ.. అందరూ ఓటమి చవిచూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.