Chhattisgarh: రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!
ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా, ఆప్ నుంచి పోటీచేసిన ఏడుగురు రాజవంశీయులు ఓటమి చెందడంతో తొలిసారిగా అసెంబ్లీలో వారికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
రాయ్పుర్: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో తొలిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈసారి అసెంబ్లీలో రాజవంశీయులకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా, ఆప్ నుంచి పోటీచేసిన ఏడుగురు రాజవంశీయులు ఓటమి చెందడమే ఇందుకు కారణం. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్దేవ్ కూడా ఉండటం గమనార్హం.
2000లో ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగా.. అప్పటి నుంచి ఈ ఐదు పర్యాయాలు రాజవంశీయుల ప్రాతినిధ్యం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఏడుగురు రాజవంశీయులు పోటీ చేశారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ తరఫున, ముగ్గురు భాజపా టికెట్పై, ఒకరు ఆప్ తరఫున బరిలో నిలిచారు. కానీ, పార్టీలకు అతీతంగా అనూహ్యంగా వీరందరూ ఓటమి చవిచూశారు.
సీఎం రేసులో ఉండి..
సర్గుజా రాజకుటుంబానికి చెందిన టి.ఎస్.సింగ్దేవ్ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి. కాంగ్రెస్ తరఫున అంబికాపుర్ నుంచి పోటీ చేశారు. గత మూడు దఫాలూ ఇక్కడ సింగ్దేవ్దే విజయం. 2018 ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రి రేసులోనూ కొనసాగారు. కానీ, తాజా ఫలితాల్లో 94 ఓట్ల తేడాతో భాజపా ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్ చేతిలో ఓడిపోయారు. ఉత్తర ఛత్తీస్గఢ్లోని జర్గుజా డివిజన్లో ఉన్న 14 నియోజకవర్గాల్లో వీరి కుటుంబ ప్రభావం ఉండేది. 2018 ఎన్నికల్లో ఈ స్థానాలన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. తాజా ఎన్నికల్లో వీటన్నింటినీ భాజపా తన ఖాతాలో వేసుకుంది.
Congress: ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్ ఫలితం అంతుపట్టడం లేదు!
సర్గుజా రాజకుటుంబ వారసుల్లో ఒకరైన అంబికాసింగ్ దేవ్ బైకుంఠపుర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ టికెట్పై మళ్లీ అక్కడి నుంచే బరిలో దిగిన ఆమె భాజపా నేత భైయాలాల్ రాజ్వాడే చేతిలో 25వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫుల్జాహర్లోని గోండ్ రాజకుటుంబానికి చెందిన మరోనేత దేవేంద్ర బహదూర్ సింగ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తన సిట్టింగ్ స్థానమైన బస్నా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అజిత్ జోగీ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన.. భాజపా నేత సంపత్ అగర్వాల్ చేతిలో 36వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
భాజపాలోనూ..
భాజపా నుంచి బరిలో దిగిన ముగ్గురు రాజవంశీయులు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. జష్పుర్ సంస్థానాన్ని పరిపాలించిన జూదేవ్ రాజకుటుంబానికి చెందిన సంయోగితా సింగ్ గత ఎన్నికల్లో చంద్రాపుర్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసి రెండోసారి కూడా ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రామ్కుమార్ యాదవ్ 15వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక భాజపా అగ్రనేత దిలీప్సింగ్ జూదేవ్ కుమారుడైన ప్రబల్ ప్రతాప్సింగ్ కూడా భాజపా అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిపాలయ్యారు.
అంబాగఢ్ చౌకీ సంస్థానాన్ని పాలించిన నాగవంశీ గోండ్ రాజకుటుంబ వారసుడు సంజీవ్ షా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి భాజపా టికెట్పై మొహ్లా-మాన్పుర్ నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో 31 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇక లొహారా రాజకుటుంబ వారసుడు ఖడ్గరాజ్ సింగ్ ఆప్ తరఫున కవర్ధా నియోజకవర్గం బరిలో నిలిచారు. కేవలం 6వేల పైచిలుకు ఓట్లను మాత్రమే సాధించి మూడోస్థానంలో నిలిచారు. ఇలా వివిధ పార్టీల నుంచి ఏడుగురు రాజవంశీయులు పోటీ చేసినప్పటికీ.. అందరూ ఓటమి చవిచూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
రైల్వేశాఖ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారుతోంది. -
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్