India-China: అరుణాచల్ మాదే.. మీ పిచ్చివాదన వాస్తవాలను మార్చదు: చైనాకు భారత్ చురక
India-China: ప్రధాని మోదీ ‘అరుణాచల్’ పర్యటనపై నోరు పారేసుకున్న చైనాకు భారత్ గట్టిగా బదులిచ్చింది. ‘మీ అక్కసు వాస్తవాలను మార్చలేదంటూ’ డ్రాగన్కు చురకలంటించింది.
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవల అరుణాచల్ప్రదేశ్ (Arunachal Pradesh)లో పర్యటించడంపై చైనా (China) తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘జాంగ్నన్’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్ విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ నోరుపారేసుకున్నారు. ఈ విషయమై న్యూదిల్లీతో దౌత్యపరంగా నిరసనను తెలియజేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ (MEA) దీటుగా బదులిచ్చింది.
‘‘ప్రధాని మోదీ అరుణాచల్ పర్యటనను ఉద్దేశిస్తూ చైనా చేసిన వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్లోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే అరుణాచల్ ప్రదేశ్లోనూ మా నేతలు పర్యటనలు చేపడుతారు. ఈ పర్యటనలను వ్యతిరేకించడం, భారత అభివృద్ధి ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేయడం సహేతుకం కాదు. ఇది వాస్తవాలను ఏమాత్రం మార్చదు. అరుణాచల్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. ఈ విషయాన్ని చైనాకు ఇప్పటికే చాలాసార్లు స్పష్టంగా చెప్పాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
భారత్ ‘అగ్ని’ పరీక్ష వేళ.. బంగాళాఖాతంలోనే డ్రాగన్ నిఘా నౌక..!
అరుణాచల్లో ఇటీవల ప్రధాని మోదీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. చైనా- భారత్ సరిహద్దులోని తవాంగ్కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ఆయన ప్రారంభించారు. అయితే, ఈ రాష్ట్రాన్ని చైనా ‘జాంగ్నన్ (దక్షిణ టిబెట్)’గా పేర్కొంటోంది. ఈ క్రమంలోనే మోదీ పర్యటనపై అక్కసు వెళ్లగక్కింది. అది తమ భూభాగమంటూ మళ్లీ పాత పాటే పాడింది.
‘‘జాంగ్నన్ ప్రాంతం చైనాలో భాగం. చట్టవిరుద్ధంగా ఏర్పాటుచేసిన అరుణాచల్ను మేం ఎన్నడూ గుర్తించలేదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇరుదేశాల సరిహద్దు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. జాంగ్నన్ను అభివృద్ధి చేసే హక్కు ఆ దేశానికి లేదు. చైనా- భారత్ సరిహద్దులోని తూర్పు ప్రాంతంలో ఆ దేశ ప్రభుత్వాధినేత పర్యటనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. ఈ విషయమై మా నిరసనను తెలియజేశాం’’ అని డ్రాగన్ పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..