Agni-5: భారత్ ‘అగ్ని’ పరీక్ష వేళ.. బంగాళాఖాతంలోనే డ్రాగన్ నిఘా నౌక..!
మన అగ్ని క్షిపణి చైనాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. భారత్ దీనిని పరీక్షిస్తోందనగానే.. డ్రాగన్ నిఘా నౌకలు హిందూ మహాసముద్రంలోకి వచ్చేస్తాయి. తాజాగా ఇదే జరిగింది..
ఇంటర్నెట్డెస్క్: శత్రురాడార్లు.. గగనతల రక్షణ వ్యవస్థలకు దుర్భేద్యమైన ‘మిషన్ దివ్యాస్త్ర’ పరీక్షను చైనా (China) అత్యంత జాగ్రత్తగా పరిశీలించింది. దీనిలో భారత్ ఒక క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే ఎంఐఆర్వీ (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్) టెక్నాలజీని తొలిసారి సోమవారం పరీక్షించిన విషయం తెలిసిందే. దీనికి కొన్ని వారాల ముందే బీజింగ్ నుంచి బంగాళాఖాతం దిశగా చైనా పరిశోధక నౌక బయల్దేరింది. ఇప్పటికే మరో నిఘా ఓడ భారత్కు పశ్చిమాన మాల్దీవుల్లో తిష్ఠ వేసిన విషయం తెలిసిందే.
చైనా గూఢచర్యం ఇలా..
ఫిబ్రవరి 23వ తేదీన క్వాంగ్డావ్ నుంచి ‘షియాంగ్ యంగ్ హాంగ్ 01’ నౌక బయల్దేరింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ లెక్కల ప్రకారం 4,425 టన్నుల బరువున్న ఈ ఓడ ఆదివారం బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో వెల్లడించారు. ప్రస్తుతం అది భారత్ అణుశక్తి చోదిత సబ్మెరైన్ స్థావరమైన విశాఖ తీరం నుంచి 480 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నోటామ్ వేళకు సరిగ్గా..
సాధారణంగా క్షిపణి పరీక్షలకు ముందు హెచ్చరిక సూచీ అయిన ‘నోటిస్ టు ఎయిర్మిషన్’(నోటామ్)ను భారత్ మార్చి 7వ తేదీన జారీ చేసింది. దీంతో బంగాళాఖాతంలో 3,550 కిమీ రేంజిలో నౌకలు, విమానాల కార్యకలాపాలను నియంత్రించినట్లైంది. ఈ తేదీల్లోనే డ్రాగన్కు చెందిన ‘షియాంగ్ యంగ్ హాంగ్ 01’ బంగాళాఖాతంలోకి వచ్చింది. దీనిలో అగ్ని-5 పరీక్షను పూర్తిగా గమనించి రేంజి, సామర్థ్యాన్ని అంచనావేసుకొనే టెక్నాలజీ ఉందనే అంచనాలున్నాయి. కానీ, చైనా మాత్రం ఇది కేవలం పరిశోధక నౌకే అని బుకాయిస్తోంది. భారత్ సహా పశ్చిమ దేశాలు మాత్రం ఈ ఓడలు ప్రత్యర్థి నౌకాదళ, సబ్మెరైన్ కదలికలను గుర్తించగలవని చెబుతున్నాయి.
కొంత మంది చైనా నిపుణులు అగ్ని-5 రేంజి 5,000 కిలోమీటర్ల కంటే అధికమని బలంగా నమ్ముతున్నారు. 2012లో పీఎల్ఏ అకాడమీ ఆఫ్ మిలటరీ సైన్సెస్ నిపుణుడు డువెన్లాంగ్ ఈ క్షిపణి రేంజి దాదాపు 8,000 కిలో మీటర్ల వరకు ఉంటుందని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు.
2022లో కూడా సరిగ్గా ఇలానే..
భారత్ అగ్ని శ్రేణి క్షిపణి పరీక్ష తలపెట్టినప్పుడల్లా చైనా నౌకలు హిందూ మహాసముద్రంలోకి చొరబడటం ఇదే తొలిసారి కాదు. 2022 నవంబర్లో కూడా ఆ దేశానికి చెందిన యువాన్ వాంగ్ శ్రేణి నౌక హిందూ మహాసముద్రంలోకి వచ్చింది. వాస్తవానికి భారత్ అదే సమయంలో అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని-5 పరీక్షకు ప్రణాళిక సిద్ధం చేసింది. చైనా నిఘాను గమనించి నాడు నోటామ్ను రద్దు చేయాల్సి వచ్చింది. డిసెంబర్లో మరోసారి పరీక్షకు ఏర్పాట్లు చేయగా.. చైనా నౌక ఆ ప్రాంతంలో మళ్లీ ప్రత్యక్షమైంది.
పరిశోధనల పేరిట చైనా పదేపదే హిందూ మహా సముద్రంలోకి తన ఓడలను పంపిస్తోంది. 2014లో చైనా అణు జలాంతర్గామిని లంక పోర్టుల్లో డాక్ చేసింది. ఆ సమయంలో భారత్, శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2022లో చైనా ఇలాంటి ప్రయత్నమే చేసింది. తన బాలిస్టిక్ క్షిపణి, శాటిలైట్ ట్రాకింగ్ ఓడ యువాన్ వాంగ్-5ను శ్రీలంకలోని హంబన్తోట పోర్టులో వారంపాటు నిలిపింది. 750 కిలోమీటర్ల పరిధి వరకు ఇది నిఘా పెట్టగలుగుతుందని అంచనా. శక్తిమంతమైన చైనా పరిశోధక నౌకలు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రదేశాలపై కన్నేయగలవు. నాడు కూడా భారత్ అభ్యంతరం తెలిపింది.
2024 జనవరిలో అమెరికాకు చెందిన థింక్ట్యాంక్ సీఎస్ఎస్ నివేదిక ప్రకారం చైనా వద్ద 64 వరకు పరిశోధక, సర్వే నౌకలున్నాయి. వీటిల్లో 80శాతం కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
India-China: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. -
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. -
ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ చూపించారు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను ఆయన సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. -
ఆయనకు 84.. ఆమెకు 66
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే (84)కు ఆయన కుమారులు, కుమార్తెలు 66 ఏళ్ల వృద్ధురాలితో ఘనంగా రెండోపెళ్లి జరిపించారు. -
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. -
4 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుష్షు
నాలుగు నిమిషాల్లోనే ఒక మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు.. వారి సాధారణ ఆయుష్షు కన్నా ఐదేళ్లు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. -
వారణాసి గంగా హారతిలో అమిత్ షా, యోగి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. -
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. -
ఓ ఆదివాసీ ప్రశ్నకు వ్యంగ్యంగా బదులిచ్చానంతే
రత్లాం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. -
నింగిలో రంగురంగుల అరోరాలు
చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది.
తాజా వార్తలు (Latest News)
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఓటర్లకు పంచేందుకు తరలింపు.. ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత