Rajouri encounter: రాజౌరీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదులు నక్కింది ఇక్కడే!
జమ్ముకశ్మీర్లోని రాజౌరీలో జరిగిన ఎన్కౌంటర్ సమయంలో ఉగ్రవాదులు దాక్కొన్న గుహల ఫొటోలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.
రాజౌరీ: జమ్ముకశ్మీర్లోని (Jammu Kashmir) రాజౌరీ (Rajouri) జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్ సమయంలో ఉగ్రవాదులు దాక్కున్న చిన్నపాటి గుహల ఫొటోలను ఇండియన్ ఆర్మీ (Indian Army) విడుదల చేసింది. వాటిల్లోనే నక్కిన ఉగ్రవాదులు అదును చూసి.. భద్రతాదళాలపై కాల్పులు జరిపారని తెలిపింది. ఎన్కౌంటర్ జరిగిన కాలాకోట్ అడవుల్లో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉంటాయని, వాటిని గుర్తించడం కష్టమని పేర్కొంది. ఉగ్రవాది అందులో దాక్కున్నట్లు దగ్గరికి వెళ్లేంత వరకూ తెలియదని, వాళ్లకు మాత్రం చుట్టుపక్కల ఉన్నవారిని గుర్తించేందుకు వీలుంటుందని ఆర్మీ అధికారులు జాతీయ మీడియాకు వివరించారు. ఆ ఫొటోను పరిశీలిస్తే.. రెండు భారీ బండరాళ్ల మధ్య ఓ చిన్న ఖాళీలో కేవలం ఒక్కరు మాత్రమే కూర్చునేందుకు వీలుండేలా ఉంది. ఆ గుహకు ముందు కూడా మరో చిన్నపాటి రాయి ఉంది. ఒకవేళ అటువైపుగా ఎవరైనా వచ్చినా.. ఆ రాయి చాటున దాక్కునేందుకు వీలుంది.
ఆగలేకపోయిన అమ్మ మనసు.. ఖైదీ బిడ్డకు మాతృత్వాన్ని పంచిన పోలీసమ్మ..!
ఇలాంటి ప్రదేశాల్లో దాక్కొని దాడి చేయడం వల్లనే ఇండియన్ ఆర్మీకి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. బుధ, గురువారం దాదాపు 36 గంటల పాటు సాగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. ఇద్దరు యువకెప్టెన్లు ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ ఎంవీ ప్రంజల్ కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన వారు కాగా.. కెప్టెన్ శుభం గుప్తా ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాకు చెందినవారు. హవల్దార్ అబ్దుల్ మాజిద్ స్వస్థలం జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా అజోటే. లాన్స్నాయక్ సంజయ్ బిష్త్.. ఉత్తరాఖండ్లోని హల్లి పడ్లీ నుంచి, పారాట్రూపర్ సచిన్ లార్.. యూపీలోని అలీగఢ్ నుంచి వచ్చి సైన్యంలో చేరారు.
బాజిమాల్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారం అందుకున్న సైనికాధికారులు, పోలీసులు ఈ ప్రాంతంలో ఆదివారం నుంచి వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. వాళ్ల కదలికలను పసిగట్టి.. ప్రజల్ని ఇళ్ల నుంచి బయటకు రావద్దని బుధవారం హెచ్చరించి, ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వాళ్లు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదిని లష్కరే తోయిబా అగ్ర కమాండర్ క్వారీగా గుర్తించారు. క్వారీ గత ఏడాదిగా రాజౌరీ- పూంచ్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనీ, డాంగ్రీ, కాండీ దాడులకు అతడే సూత్రధారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM