Anju: ఆ అంజూ భారత్‌కు తిరిగి వచ్చింది..!

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్‌ వెళ్లి, అక్కడే అతడిని పెళ్లి చేసుకున్న అంజూ(Anju) అనే మహిళ.. తిరిగి భారత్‌ వచ్చినట్లు సమాచారం. 

Published : 29 Nov 2023 18:36 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని గ్వాలియర్‌కు చెందిన అంజూ(Anju) అనే మహిళ.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్‌ వెళ్లి, అతడిని పెళ్లాడింది. ఆ వ్యవహారానికి సంబంధించిన వార్తలు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె తిరిగి భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. వాఘా సరిహద్దు ద్వారా ఆమె ఇక్కడకు వచ్చినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

అంజూకు ఫేస్‌బుక్‌లో పాక్‌కు చెందిన నస్రుల్లా అనే యువకుడితో 2019లో పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తాను పాక్‌కు వెళ్లలేదని చెప్పిన ఆమె.. ఆ తర్వాత అనూహ్యంగా అతడిని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొద్దిరోజుల తర్వాత నస్రుల్లా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. అంజూ తిరిగి భారత్‌కు వస్తుందని చెప్పారు. ఆమె మానసిక వేదనతో సతమతమవుతోందని, తన ఇద్దరు పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు అతడు వెల్లడించాడు.

భార్యాభర్తల గొడవతో.. విమానం దారి మళ్లింది..!

ఇదిలా ఉండగా.. అంజూకు ఇదివరకే వివాహమై, 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. పాక్‌లో వివాహం తర్వాత అంజూ పేరు ఫాతిమాగా మారింది. ఆ జంటకు అక్కడ ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యజమాని మొహసీన్‌ ఖాన్‌ అబ్బాసీ కొంత భూమి, నగదును బహుమతిగా ఇచ్చాడు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు. అయితే ఆమె చేసిన నిర్వాకంతో భారత్‌లోని ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని