రాజస్థాన్ ఎన్నికల వేళ.. ప్రైవేటు లాకర్లలో బయటపడుతున్న నోట్ల కట్టలు..!
రాజస్థాన్లో కొద్దిరోజుల క్రితం భాజపా ఎంపీ చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన ఆరోపణలకు తగ్గట్టే ప్రైవేటు లాకర్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి.
జైపుర్: రాజస్థాన్ రాజధాని జైపుర్ (Jaipur)లో ఉన్న ఓ భవనంలోని ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనంతో పాటు 50 కిలోల బంగారం దాచి ఉంచినట్లు భాజపా నేత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైపుర్లోని గణపతి ప్లాజా (Ganpati Plaza)లో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. ఆ ప్లాజాలోని ప్రైవేటు లాకర్ల నుంచి లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల వేళ కొద్దిరోజుల క్రితం భాజపా రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ కుంభకోణానికి చెందిన వందల కోట్ల అక్రమ సంపాదనను గణపతి ప్లాజాలో దాచినట్లు ఆరోపించారు. పోలీసులు వచ్చి వాటిని తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఆ లాకర్లు ఎవరికి చెందినవనే వివరాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17న దర్యాప్తు సంస్థ మూడు లాకర్లు తెరిచి రూ.30 లక్షలు స్వాధీనం చేసుకుంది. అక్టోబర్ 21న రూ.2.46 కోట్లను గుర్తించింది. ఇప్పటివరకు రూ.7 కోట్లు, 12 కేజీల బంగారాన్ని లాకర్ల నుంచి స్వాధీనం చేసుకుంది. అక్కడ మొత్తం 1,100 లాకర్లు ఉన్నాయి. తాజాగా మరికొన్ని లాకర్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఒక లాకర్ నుంచి లెక్కల్లో చూపని రూ.7.5 లక్షలను సీజ్ చేశారు. ఇంకా కౌంటింగ్ జరుగుతోందని మీడియా కథనాలు వెల్లడించాయి.
చెత్తకుప్పలో లభ్యమైన ఆ రూ.25 కోట్లు నకిలీవేనట!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పేపర్ లీకేజీ కుంభకోణం విషయంలో భాజపా రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. మరోపక్క పలు కేసుల్లో రాష్ట్రంలోని కీలక నేతలకు ఈడీ సమన్లు ఇస్తోంది. వారికి సంబంధించిన ప్రాంతాల్లో వరుసగా తనిఖీలు చేపడుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. రాజస్థాన్లో నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయపన్ను విభాగం జరిపిన సోదాల్లో(Tax raids) లెక్కలోకి రాని కోట్లాది రూపాయల సొత్తు బయటపడింది. -
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. -
సీబీఐకి కొత్తగా ఇద్దరు అదనపు డైరెక్టర్ల నియామకం
సీబీఐకి ఇద్దరు అదనపు డైరెక్టర్లను కేంద్రం నియమించింది. -
ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఈడీ అరెస్టు చేయొద్దు: సుప్రీం కీలక తీర్పు
ED arrests: మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణ చేపడితే ఆ కేసులో నిందితులను ఈడీ అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై జరిగిన దాడి గురించి మీడియా ప్రశ్నించగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల మహిళలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ వారికి ఆప్ నేత ఎదురుప్రశ్న వేశారు. -
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై బయట ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టులో ఈడీ లేవనెత్తింది. దానిపై కోర్టు స్పందించింది. -
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
పౌరసత్వ సవరణ చట్టం-2019పై అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. -
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
Mumbai hoarding collapse: ముంబయిలో హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో.. 48 గంటల తర్వాత కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (6)
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం మంజూరు షురూ
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి తొలి విడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM