Jairam Ramesh: మోదీ ప్రమాణ స్వీకారానికి మాకు ఆహ్వానం రాలేదు: జైరాం రమేశ్‌

Jairam Ramesh: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం కోసం ఇండియా కూటమి నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు.

Published : 08 Jun 2024 19:23 IST

దిల్లీ: భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు సామాన్యుల నుంచి అతిరథ మహారథులు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ నేతలకు ఇంకా ఆహ్వానం అందలేని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘అంతర్జాతీయ నాయకులను మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మా నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదు. ఇండియా కూటమి నేతలకు ఆహ్వానం అందాక ఆ విషయం గురించి ఆలోచిస్తాం’’ అని ఆయన సమాధానమిచ్చారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌లతో పాటు తదితర విదేశీ ప్రముఖులను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇప్పటికే షేక్‌ హసీనా దిల్లీ చేరుకున్నారు. 

నీతీశ్‌కు ప్రధానిగా ఇండియా కూటమి ఆఫర్‌..!

ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈనేపథ్యంలో దిల్లీవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులతోపాటు కీలక ప్రాంతాల్లో ఎన్‌ఎస్‌జీ బలగాలు పహారా కాస్తున్నాయి. దిల్లీని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. మరికొన్ని రోజుల పాటు దిల్లీ, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిషేధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని