PM Modi: ‘ఆర్టికల్‌ 370’పై కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టిస్తోంది: ప్రధాని మోదీ

అభివృద్ధిలో జమ్మూ-కశ్మీర్‌ సరికొత్త శిఖరాలను తాకుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 07 Mar 2024 19:09 IST

శ్రీనగర్: ఆర్టికల్‌ 370 (Article 370) రద్దు అనంతరం జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir) స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధిలో ఈ ప్రాంతం సరికొత్త శిఖరాలను తాకుతోందని చెప్పారు. ‘ఆర్టికల్‌ 370’ రద్దు అనంతరం తొలిసారి కశ్మీర్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. బక్షీ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ‘ఆర్టికల్‌ 370’పై ఒక్క జమ్మూ-కశ్మీర్‌నే కాదు, యావత్‌ దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ చాలా కాలంగా తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. తొలిసారి కశ్మీర్‌లో ల్యాండ్‌ అయిన మోదీ

అంతకుముందు స్థానికంగా రూ.6400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని దేశానికి కిరీటంగా అభివర్ణిస్తూ.. రైతుల సాధికారత, పర్యటక అవకాశాలు వికసిత జమ్మూ-కశ్మీర్ నిర్మాణానికి బాటలు వేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులకు ముందస్తుగా మహాశివరాత్రి, రంజాన్‌ మాసం శుభాకాంక్షలు తెలిపారు. మోదీ పర్యటనను పురస్కరించుకుని కశ్మీర్‌ లోయలో ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించారు. స్థానికంగా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని