Siddaramaiah: నకిలీ సమాచారం కట్టడికి కొత్త చట్టం తెస్తాం: సీఎం సిద్ధరామయ్య

Eenadu icon
By National News Team Published : 21 Oct 2025 00:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మంగళూరు: నకిలీ సమాచారం(Misinformation)వ్యాప్తిని కట్టడి చేసేందుకు నూతన చట్టాన్ని తీసుకొస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) ప్రకటించారు. ఏ జిల్లా అయినా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే.. మత సామరస్యమే ముఖ్యమన్నారు.  సోమవారం మంగళూరు సమీపంలోని పుత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘తప్పుడు సమాచారం వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మేం ఓ చట్టాన్ని తీసుకొస్తున్నాం. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై, ప్రజలకు నకిలీ సమాచారం అందించడం ద్వారా  మత సామరస్యాన్ని దెబ్బతీసేవారిపై కేసులు నమోదు చేస్తాం’’ అని హెచ్చరించారు. 

ఈ మేరకు నూతన చట్టం రూపొందించాలని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ను సీఎం ఆదేశించారు. ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే, పాటిల్‌ ఈ చట్టం రూపొందించేందుకు కృషిచేస్తారన్నారు.  మత సామరస్య ఆవశ్యకతను సిద్ధరామయ్య నొక్కి చెప్పారు.  దక్షిణ కన్నడ ప్రజలు మత సామరస్యాన్ని కాపాడుకోవడంపై దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. మత సామరస్యాన్ని ఎవరు దెబ్బతీస్తున్నారో తాను చెప్పబోనన్న సీఎం.. అలా ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని