S Jaishankar: ఎన్నికలముందు ‘కచ్చతీవు’ రగడ.. జై శంకర్ ఏమన్నారంటే..?
కచ్చతీవు అంశంపై కేంద్రం, తమిళనాడు మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుందని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) అన్నారు.
దిల్లీ: ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ‘కచ్చతీవు’ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై తాజాగా విదేశాంగమంత్రి జై శంకర్(S Jaishankar) స్పందించారు. ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదన్నారు.
‘‘ఇది ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదు. దీనిపై పార్లమెంట్లో, అలాగే కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎంకు 21 సార్లు సమాధానమిచ్చాను. నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనత ప్రదర్శించారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దృష్టిలో ఇది చిన్న ద్వీపం. దీనికి ప్రాముఖ్యతే లేదని భావించి.. వదిలించుకోవాలనుకున్నారు. ఇందిరాగాంధీ కూడా ఇదే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నారు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
అలాగే కాంగ్రెస్, డీఎంకే పార్టీలపై విమర్శలు గుప్పించారు. ‘‘ఆ ద్వీపాన్ని అప్పగించేటప్పుడు తమను సంప్రదించలేదని డీఎంకే చెప్పింది. వాస్తవమేంటంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉంది. దీనిని ఎవరు చేశారనేదే కాకుండా.. ఎవరు దాచారనేదీ ఇప్పుడే మాకు తెలిసింది. దీనిపై ఒక పరిష్కారం కనుగొనాల్సి ఉంది. శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి’’ అని వెల్లడించారు. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించారు.
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పుడు కచ్చతీవు మన దగ్గరే ఉంది. శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతా పరంగా కీలకమైంది. కానీ కాంగ్రెస్ నాలుగైదు దశాబ్దాల కిందట ఆ ద్వీపం ఎందుకూ పనికిరాదంటూ శ్రీలంకకు ఇచ్చేసింది. ఆ మూల్యం ఇప్పటికీ చెల్లించుకుంటున్నాం. తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్లినపుడు లంక అధికారులు అరెస్టు చేస్తున్నారు. బోట్లను జప్తు చేస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తుకట్టిన డీఎంకే లాంటి పార్టీలు కూడా ఈ అంశంపై నోరెత్తడం లేదు’’ అని మోదీ పేర్కొన్నారు.
ఇదే అంశంపై తాజాగా ప్రధాని మోదీ ఎక్స్( ట్విటర్) వేదికగా స్పందించారు. ‘‘కాంగ్రెస్, డీఎంకే.. కుటుంబ పార్టీలు. ఆ నేతలు వారి వారసుల ఎదుగుదల గురించి మాత్రమే పట్టించుకున్నారు. కచ్చతీవుపై వారి నిర్లక్ష్యంతో పేద మత్స్యకారుల కుటుంబాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లింది. కొత్తగా వెలుగులోకి వస్తోన్న విషయాలు డీఎంకే ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయి’’ అని ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్