LS Polls 6th Phase: ఓటేసిన రాష్ట్రపతి.. జైశంకర్ది ‘తొలి ఓటు’.. ఆరో విడతలో ప్రముఖుల ఓటింగ్
LS Polls 6th Phase: ఆరో విడత లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ (LS Polls 6th Phase Polling) శనివారం కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. తొలి గంటల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
- దేశ రాజధాని దిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu ) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ క్యూలైన్లో నిల్చుని ఓటు వేశారు.
- కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఈయనే కావడంతో అధికారులు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఆయన ఎక్స్లో పంచుకుంటూ తన సర్టిఫికెట్ చూపించారు.
- కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్ వాద్రా క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి గంటల్లో ఓటేశారు.
- తూర్పు దిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, భాజపా లోక్సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్, ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబం, దిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ, మాజీ సీఈసీ సుశీల్ చంద్ర తదితరులు తొలి గంటల్లో ఓటేశారు.
లోక్సభ ఎన్నికల (Lok sabha Elections) ఆరో విడతలో భాగంగా దిల్లీ (Delhi)లోని మొత్తం 7 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 4, కాంగ్రెస్ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. భాజపా అభ్యర్థులకు వారు గట్టి సవాలు విసురుతున్నారు. మరోవైపు- ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా శనివారం పోలింగ్ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేరఠ్లో అతిపెద్ద భూగర్భ రైల్వేస్టేషన్
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వేస్టేషను నిర్మాణం శరవేగంగా సాగుతోంది. -
సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి
నీట్లో జరిగిన అవకతవకల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే అధికార్ల బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండు చేశారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో జేఈఈ మెయిన్స్కు సన్నద్ధమవుతోన్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బిహార్కు చెందిన ఆయుష్.. ఓ హాస్టల్లో నివాసముంటున్నాడు. -
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా!
దేశ రాజధాని దిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునాకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. -
దిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్
నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిల్లీ నుంచి భోపాల్కు రైల్లో ప్రయాణించారు. -
ఆంగ్లంలోకి ‘హనుమాన్ చాలీసా’
ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ హిందువుల ఆధ్యాత్మిక ధ్యానశ్లోకమైన ‘హనుమాన్ చాలీసా’ను ఆంగ్లంలోకి అనువదించారు. దశాబ్దం కాలంలో ఆయన అనువాదం చేసిన మొదటి రచన ఇదే కావడం విశేషం. -
భారత రాజ్యాంగ పుస్తకం చిరు ప్రతులపై పెరిగిన ఆసక్తి
దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల పొడవు, తొమ్మిది సెంటీమీటర్ల వెడల్పుతో లెదర్ బైండింగు చేసిన రాజ్యాంగ ప్రతులకు ఇప్పుడు డిమాండు పెరిగింది. -
ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠినచర్యలు: కేంద్రం
కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ.. నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. -
జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిల్లీలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. -
చీనాబ్ వంతెనపై రైలింజను పరుగు
జమ్మూకశ్మీర్లోని ప్రపంచంలో అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెనపై ఆదివారం రైలింజను ట్రయల్రన్ను విజయవంతంగా నిర్వహించారు. -
విగ్రహాలను తొలగించలేదు.. తరలించాం
పార్లమెంటు సముదాయంలో ఏర్పాటుచేసిన ప్రముఖుల విగ్రహాలలో దేనినీ తొలగించలేదని, వాటన్నింటినీ ఇదే ప్రాంగణంలో కొత్త ప్రదేశానికి మార్చామని 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. -
హింస, విధ్వంసం పాఠ్యపుస్తకాల్లో ఎందుకు
పాఠ్యాంశాల్లో కాషాయీకరణ చోటుచేసుకుంటోందన్న ఆరోపణలను ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ తిరస్కరించారు. -
సంక్షిప్త వార్తలు
ముంబయిలో వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను కలవడానికి వచ్చిన మా నాన్న నేను బాధతో ఉన్న విషయాన్ని గ్రహించి కొన్నాళ్లు విరామం తీసుకొని తనతో పాటు ఊరికి రమ్మని చెప్పారు. -
ఈవీఎంలపై మస్క్ చీకట్లు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మరోసారి రాద్ధాంతం మొదలైంది. వీటి విశ్వసనీయతపై సాంకేతిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేయగా కాంగ్రెస్ నేతలు ఆయనతో గొంతు కలిపారు. -
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సిలబస్ మార్పుపై డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ స్పందించారు. విద్యార్థులకు అల్లర్ల గురించి బోధించడం తమ ఉద్దేశం కాదన్నారు. -
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
భారత్లోని ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివని, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి ఉండదని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఇంటి బయట కూల్చివేతలు.. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్పై బదిలీ వేటు
-
‘కర్మ’ఫలం ఇది.. వైకాపాను ఉద్దేశించి పోస్టు చేసిన సీమెన్స్ మాజీ ఎండీ!
-
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
-
‘ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స, సజ్జల’
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
-
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది