Lok Sabha polls: ప్రత్యర్థులపై ‘ప్రైవేటు కన్ను’!
ప్రత్యర్థులు, సహచరుల కదలికలపై దృష్టి పెడుతోన్న రాజకీయ పార్టీలు.. ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీలను (Detective Agency) సంప్రదిస్తున్నాయి.
దిల్లీ: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, టికెట్లు కోరుతున్న ఆశావహులు.. వారి ప్రత్యర్థులు, సహచరుల కదలికలపై దృష్టి పెడుతున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఇతర పార్టీల వ్యూహాలను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రైవేటు వ్యక్తులనూ నియమించుకుంటున్నాయి. దీంతో ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీలకు (Detective Agency) భారీ గిరాకీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ ఫిరాయింపులు, క్యాంపులు మార్చడం వంటి వ్యవహారాల నేపథ్యంలో.. కీలక సమాచారాన్ని ప్రత్యర్థులకు అందించే అవకాశం ఉన్న వారిపై నిఘా (Private Eye) ఉంచే పనిని డిటెక్టివ్ ఏజెన్సీలకు రాజకీయ పార్టీలు అప్పగిస్తున్నాయట. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎవరు పార్టీలు మారే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించడం వీరి పని. అనుకూలమైన ఫలితాలు రాబట్టేందుకు ఎంత ఖర్చుచేసేందుకైనా రాజకీయ పార్టీలు వెనకాడటం లేదని నిఘా సంస్థలు చెప్పడం గమనార్హం.
అభ్యర్థుల చరిత్రపై..
ప్రత్యర్థుల అవినీతి, నేర చరిత్ర, కుంభకోణాలు, అక్రమ సంబంధాలు, వీడియో సంబంధిత సమాచారం, అనుసరించాల్సిన వ్యూహాలే ప్రధాన అంశాలుగా డిటెక్టివ్లను నియమించుకుంటున్నారు. ప్రత్యర్థులతో తమ సహాయకులు, సిబ్బంది కుమ్మక్కు అవుతున్నారా? అనే విషయాన్ని ముందుగానే పసిగట్టేందుకు రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. అభ్యర్థుల జాబితాలో పేర్లు లేకపోవడంతో నిరాశకు గురైన వారితోపాటు, సీటు పొందిన వారు తమ ప్రత్యర్థుల బలాలను తెలుసుకునేందుకు డిటెక్టివ్లను సంప్రదిస్తున్నారని దిల్లీ కేంద్రంగా పనిచేసే జీడీఎక్స్ డిటెక్టివ్స్ లిమిటెడ్ ఎండీ మహేశ్ చంద్ర శర్మ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నిఘా అనేది ఎంతోకాలంగా ఉందన్నారు.
LS polls: ఎన్నికల నియమావళి.. తొలి ‘కోడ్’ కూసింది అప్పుడే!
ఎన్నికల తేదీలు ప్రకటించడానికి కొన్ని నెలల ముందు నుంచే రాజకీయ పార్టీలు వీరిని నియమించుకున్నట్లు సిటీ ఇంటెలిజెన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కేవలం ప్రత్యర్థుల సమాచారమే కాకుండా అభ్యర్థుల బలాలు, ఎన్నికల్లో విజయం సాధిస్తే పదవుల నిర్వర్తించే సామర్థ్యాలపైనా నివేదికలు రూపొందించాలని కోరుతున్నట్లు చెప్పారు.
పార్టీల వ్యూహాలపైనా..
అభ్యర్థులే కాకుండా పార్టీలకు నగదు, మద్యం ఎక్కడ నుంచి వస్తోంది?, వాటిని ఎక్కడ నిల్వ చేస్తున్నారు? పంపిణీ చేసేందుకు ఎటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారు? వంటివి కనిపెట్టే పనులను డిటెక్టివ్లకు అప్పగిస్తున్నట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ప్రత్యర్థుల ప్రజాదరణతో పోలిస్తే తమ అభ్యర్థి బలాబలాలు, రాజకీయాల్లో కొత్త ముఖాలను దించే అంశంపైనా తమను సంప్రదిస్తున్నారని దిల్లీ కేంద్రంగా పనిచేసే మరో (Sleuths India) డిటెక్టివ్ ఏజెన్సీ ఎండీ నమాన్ జైన్ పేర్కొన్నారు. సమగ్ర సర్వేల ద్వారా ఎన్నికల ఫలితాలను కూడా అంచనా వేయడం మరో ముఖ్య అంశమన్నారు. ఇలా ఎన్నికల ప్రచార సమయంలో డిటెక్టివ్ల పాత్ర ఇటీవల గణనీయంగా పెరిగిందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ