Tajinder Bagga : తజీందర్‌ బగ్గాకు కోర్టులో ఉపశమనం

దిల్లీ భాజపా నేత తజీందర్‌ బగ్గాకు హరియాణా హైకోర్టులో ఉపశమనం లభించింది. శనివారం అర్ధరాత్రి న్యాయస్థానంలో ఆయనపై విచారణ జరిగింది.

Published : 08 May 2022 09:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ భాజపా నేత తజీందర్‌ బగ్గాకు హరియాణా హైకోర్టులో ఉపశమనం లభించింది. శనివారం అర్ధరాత్రి  న్యాయస్థానంలో ఆయనపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా మే10వ తేదీ వరకు విచారణను వాయిదావేసింది. బగ్గాపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని పంజాబ్‌ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. 

మొహాలీలోని ఒక కోర్టు తనపై జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను సవాలు చేస్తూ శనివారం బగ్గా హరియాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అర్ధరాత్రి వరకు విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.  

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం ఎదుట భాజపా యువ విభాగం నేతలు ఇటీవల ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బగ్గా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ మేరకు నమోదైన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పంజాబ్‌ పోలీసులు.. శుక్రవారం అతడిని దిల్లీలో అరెస్టు చేసి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. అతడిని బలవంతంగా తరలిస్తున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందంటూ తెలిపారు. ఆ తర్వాత దిల్లీలో బగ్గా కిడ్నాప్‌ కేసు నమోదు కావడంతో.. దిల్లీ పోలీసులు రంగప్రవేశం చేసి  అతడిని దేశ రాజధానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని