PM Modi: ‘నీ కృషితో స్వీట్ రివల్యూషన్’.. కశ్మీర్ యువకుడికి ప్రధాని మోదీ ప్రశంస
నజిమ్ నజీర్ అనే కశ్మీర్ యువకుడు తన కృషితో స్వీట్ రివల్యూషన్ తీసుకొచ్చాడని ప్రధాని మోదీ ప్రశంసించారు.
శ్రీనగర్: ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత ప్రధాని మోదీ (PM Modi) తొలిసారి కశ్మీర్ (Kashmir)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్వయం ఉపాధి పొందుతున్న స్థానిక యువతతో సంభాషించి, వారి కృషిని అభినందించారు. అనంతరం నజిమ్ నజీర్ అనే యువకుడితో సెల్ఫీ దిగి ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘ నా స్నేహితుడు నజిమ్తో సెల్ఫీ. అతను చేస్తున్న మంచి పనులు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అతణ్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. నజిమ్ భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
అనంతరం నజిమ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీని కలిసి, ఆయనతో సెల్ఫీ దిగడంతో కల సాకారమైందన్నాడు. పుల్వామా జిల్లాకు చెందిన ఈ యువకుడు.. 2018లో రెండు పెట్టెలతో తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించాడు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో 25 పెట్టెలను కొనుగోలు చేసి, మొదటి విడతలో 75 కిలోల తేనె సేకరించి రూ.60 వేలు సంపాదించినట్లు తెలిపాడు. తర్వాత ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP) ద్వారా రూ.5 లక్షలు రుణం తీసుకుని 200 పెట్టెలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం వాటితో ఐదు వేల కిలోల తేనె సేకరిస్తూ.. వంద మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు.
‘ఆర్టికల్ 370’పై కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది: ప్రధాని మోదీ
ఈ సందర్భంగా నజిమ్ కృషిని ప్రధాని ప్రశంసించారు. ‘‘ఇప్పటి వరకు గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్ గురించి విన్నాం. కానీ, ఈ యువకుడు స్వీట్ రివల్యూషన్ను తీసుకొచ్చాడు. మధ్య ఆసియాలో తేనెటీగల పెంపకం కోసం వివిధ పంటలను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలి. ఇందుకు ఆన్లైన్ సమాచారాన్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి. దాంతో తేనెలో వివిధ రకాల రుచులను పొందొచ్చు. దేశ యువతకు నువ్వు దిశానిర్దేశం చేస్తున్నావు. దేశానికి మీరే బలం’’ అని మోదీ అన్నారు. అనంతరం ఆయన ఫుడ్ టెక్నాలజీ కోర్సు చదివి.. స్థానికంగా బేకరీ నిర్వహిస్తున్న యువతుల బృందాన్ని కలిశారు. 2019లో ప్రభుత్వ సింగిల్ విండో విధానం ద్వారా బేకరీ ఏర్పాటుకు అనుమతి పొందినట్లు వారు ప్రధానికి వివరించారు. భవిష్యత్తులో అవసరమైన సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.
జమ్మూ-కశ్మీర్ కేంద్రంగా ‘వెడ్ ఇన్ ఇండియా’
కశ్మీర్ వేదికగా ‘వెడ్ ఇన్ ఇండియా’ (Wed In India) నినాదాన్ని ప్రధాని మరోసారి ప్రస్తావించారు. భారతీయులు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం జమ్మూ-కశ్మీర్లోని ప్రాంతాలను ఎంచుకోవాలని కోరారు. ‘‘ దేశ ప్రజలు తమ కుటుంబంలో జరిగే వివాహాలను జమ్మూ-కశ్మీర్లో నిర్వహించవచ్చు. జీ20 సదస్సును ఇక్కడ ఎలా నిర్వహించామో ప్రపంచమంతా చూసింది. కాబట్టి, దేశ ప్రజలు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇక్కడి రావాలి. అలా పర్యటకం పెరిగి స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి