PM Modi: ‘70ఏళ్లుగా ఉన్న అలవాటు.. తేలిగ్గా వదులుకోరు’.. కాంగ్రెస్పై ‘ఎమోజీల’తో మోదీ పోస్ట్ వైరల్
PM Modi: హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి హస్తం పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎమోజీలు ఉపయోగించి ఆయన చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాల (Assembly Election Results)పై భాజపా (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రాష్ట్రాల్లో భాజపా విజయంపై కొందరు కాంగ్రెస్ అనుకూలురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.వీటికి భాజపా నేతలు గట్టిగా బదులిస్తున్నారు. తాజాగా దీనిపై ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. హస్తం పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
‘‘తమ (కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ) అహంకారం, అబద్ధాలు, నిరాశావాదం, అజ్ఞానంతో వారు బహుశా ఆనందంగానే ఉండి ఉంటారు. కానీ, వారి విభజన సిద్ధాంతంతో మనం జాగ్రత్తగా ఉండాలి. అది 70 ఏళ్లుగా వారికి అలవాటైన పద్ధతి. అంత సులువుగా వదిలిపెట్టలేరు’’ అని మోదీ (PM Modi) ప్రజలను హెచ్చరించారు. కానీ, ఇప్పుడు ప్రజలు మరింత విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని, అందువల్ల మున్ముందు మరిన్ని ఘోర పరాభవాలకు వారు (కాంగ్రెస్) సిద్ధంగా ఉండాలని ప్రధాని ఎద్దేవా చేశారు.
అయితే, ఈ పోస్ట్కు ప్రధాని ‘హెచ్చరిక’ను సూచించే, నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. దీంతో మోదీ పోస్ట్ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఓటమిపై అసహనాన్ని పార్లమెంటులో చూపొద్దు
ఇదిలా ఉండగా.. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విపక్షాలకు మోదీ నిన్న కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఓటమి తాలుకూ అసహనాన్ని పార్లమెంట్లో చూపించొద్దని హితవు పలికారు. వ్యతిరేకతను వీడితేనే వారిపై ఉన్న ప్రజా దృక్పథం మారుతుందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
PM Modi: బిహార్లోని గురుద్వారలో ప్రధాని మోదీ సేవ చేశారు. భక్తులకు లంగర్ వడ్డించారు. -
చైనాతో పోటీ పడటం నేర్చుకోవాలి
చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. -
యోగా చిచ్చర పిడుగు హర్షిక
కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. -
ఆసుపత్రికి తండ్రి భౌతికకాయం వితరణ.. నాన్న చివరి కోరికను నెరవేర్చిన కుమారులు
చనిపోయిన తరవాత తన శరీరాన్ని ఏదైనా వైద్యవిద్యా సంస్థకు దానం చేయాలన్న తండ్రి మాటను ఆ కుమారులు నెరవేర్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (3)
హవాలా కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. -
దర్శనమిచ్చిన బద్రీనాథుడు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. -
దిల్లీలో 20 ఆసుపత్రులకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్