Kangana Ranaut: కంగనపై పోస్టు వివాదం.. కాంగ్రెస్ నేతపై జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్టుపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికల్లో (Lok sabha Elections) భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్టు దుమారం రేపుతోంది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (NCW) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యకు పాల్పడిన సుప్రియా శ్రీనతే (Supriya Shrinate)పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. తన ఫిర్యాదులో హెచ్.ఎస్.అహిర్ పేరును ప్రస్తావించింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన ఏ మాత్రం సహించరానిదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను భాజపా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెను ఉద్దేశించి కాంగ్రెస్ మహిళా నేత సుప్రియ (Supriya Shrinate)చేసిన పోస్టుపై భాజపా వర్గాలు భగ్గుమన్నాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డిమాండ్ చేశాయి. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలని పేర్కొన్న కంగన (Kangana Ranaut).. గుజరాత్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన అభ్యంతరకర సంభాషణను షేర్ చేశారు.
నాడు హిమాచల్ను వద్దనుకున్న కంగన!
‘‘ఒక యువకుడికి టికెట్ లభిస్తే.. అతడి సిద్ధాంతాలను విమర్శిస్తారు. అదే యువతికి టికెట్ ఇస్తే.. ఆమె లైంగికతపై దాడి జరుగుతుంది. ఇదేం విచిత్రమో. కాంగ్రెస్ నేతలు ప్రదర్శించిన ఇలాంటి అసభ్యకరమైన ధోరణి సిగ్గుచేటు’’ అని విరుచుకుపడ్డారు. ఈ సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ బాలీవుడ్ నటికి మద్దతుగా నిలిచారు. ఉక్కు మహిళలతో ఎలా వ్యవహరించాలో ఆ నేతలకు తెలీదంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలాఉంటే.. ఈ పోస్టుపై ఇప్పటికే సుప్రియ స్పష్టత ఇచ్చారు. ‘‘నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల యాక్సెస్ చాలామంది వద్ద ఉంది. వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. నా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని తొలగించాను. నేను ఏ మహిళ గురించి కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయను. ఈ వ్యవహారంపై ‘ఎక్స్’లో ఫిర్యాదు చేశాను’’ అని వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా నకిలీ వీడియోల కేసులో కాంగ్రెస్ నేత పీఏ, ఆమ్ఆద్మీ పార్టీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. -
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
తిహాడ్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కలిశారు. -
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
Patanjali Row: పతంజలి ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ అధికారులు ఇప్పటికి నిద్ర లేచారని పెదవి విరిచింది. -
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
కర్ణాటక రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోలపై దుమారం రేగడంతో.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై వేటుపడింది. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 9 మంది మావోయిస్టులు హతం
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. -
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
నకిలీ వీడియో ఘటనపై భాజపా అగ్రనేత అమిత్ షా (Amit Shah).. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ఆ పార్టీ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. -
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)పై జరిగిన హత్యాయత్నంలో భారత గూఢచర్య సంస్థ హస్తం ఉందంటూ యూఎస్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. -
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: వెనుక నుంచి దాడి చేయడంపై తనకు నమ్మకం లేదని ప్రధాని మోదీ అన్నారు. బాలాకోట్పై దాడుల అనంతరం ముందుగా పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే యావత్ ప్రపంచానికి తెలియజేశామన్నారు. -
అలోక్ శుక్లాకు ప్రతిష్ఠాత్మక గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్
‘ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ సమితి’ కన్వీనర్ అలోక్ శుక్లా ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్’ అవార్డుకు ఎంపికయ్యారు. శుక్లా గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు. -
ప్రైవేటు వ్యక్తుల కోసం సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వమా?
సందేశ్ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. -
బెయిల్ కోసం విచారణ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
తన అరెస్టు, కస్టడీని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్ కోసం విచారణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. -
‘శాస్త్ర’లో యూనివర్సిటీ డే వేడుకలు
ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులను భవిష్యత్తుకు తగినట్లు తీర్చిదిద్దాలని ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ డాక్టర్ అభయ్ జెరె సూచించారు. -
ఆసుపత్రుల్లో రుసుముల నిర్ధారణపై మీ వైఖరేంటి?
ఆసుపత్రుల్లో వైద్యసేవల రుసుములను నిర్ధారించే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సెంట్రల్ గవర్నమెంట్) రూల్స్-2012లోని 9వ నిబంధనను అమలు చేయరాదన్న పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. -
పత్రికాస్వేచ్ఛ అణచివేత ధోరణి తగదు
పత్రికాస్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్కు లేఖ రాసింది. -
భోజ్శాల సర్వేకు మరో 8వారాల గడువు
భోజ్శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్ఐ)కి మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇందౌర్ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది. -
ఇక ఏటా పాఠ్యపుస్తకాల సవరణ
దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం పరిమితికి సవరణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం, హాస్టల్ రాయితీల పరిమితులను కేంద్రం సోమవారం సవరించింది. కరవు భత్యం పెరిగిన జనవరి 1, 2024 నుంచి పాటు ఈ సవరణ అమల్లోకి వచ్చింది. -
యూజీసీ నెట్ తేదీలో మార్పు
యూజీసీ నెట్ పరీక్ష తేదీ మారింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. వాస్తవానికి దాన్ని జూన్ 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. -
ఖలిస్థానీ తీవ్రవాదులను ఉపేక్షించడంపై కెనడాకు భారత్ తీవ్ర నిరసన
భారత్ వ్యతిరేక కార్యకలాపాలను బాహాటంగా నిర్వహిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్న కెనడా తీరుపై మన విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీలోని కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టీవార్ట్ వీలర్ను సోమవారం పిలిపించుకుని తీవ్ర నిరసన తెలిపింది. -
కేజ్రీవాల్, ఆతిశీలపై పరువు నష్టం దావా
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రి ఆతిశీలపై సోమవారం దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. వారిద్దరూ భాజపా, ఆ పార్టీ సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తాన్యా బామనీయాల్ ఎదుట కాషాయ పార్టీ దిల్లీ శాఖ మీడియా ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఫిర్యాదు దాఖలు చేశారు. -
శ్రీలంక సీతమ్మగుడికి సరయూ జలాలు
శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠకు భారత్ నుంచి సరయూనదీ జలాలు వెళుతున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలో కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..