PM Modi: గూగుల్ ‘జెమిని’లో మోదీపై వివాదాస్పద సమాధానం.. కేంద్రం సీరియస్
PM Modi: ప్రధాని మోదీపై గూగుల్ ఏఐ టూల్ ఇచ్చిన సమాధానం వివాదాస్పదమైంది. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. అసలేం జరిగిదంటే..
దిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) ఇటీవల అత్యంత అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ‘జెమిని (Gemini AI)’ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇది కచ్చితత్వంతో వేగవంతమైన ఫలితాలు ఇస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) గురించి అడిగిన ఓ ప్రశ్నకు ‘జెమిని’ చెప్పిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీంతో కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. జెమిని ఏఐ అనుచిత సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురించి అడిగితే మాత్రం.. ‘కచ్చితంగా, స్పష్టంగా చెప్పలేం’ అంటూ దాటవేత ధోరణిలో జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఓ జర్నలిస్టు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. దీంతో ‘జెమిని’పై విమర్శలు వ్యక్తమయ్యాయి. గూగుల్ ఏఐ టూల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు.
అర్ధరాత్రి వేళ.. వారణాసి రోడ్డును తనిఖీ చేసిన మోదీ
ఇది కాస్తా కేంద్రప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ‘‘ఇది ఐటీ చట్టం నిబంధనల ప్రత్యక్ష ఉల్లంఘన కిందకు వస్తుంది. క్రిమినల్ కోడ్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లే’’ అని హెచ్చరించారు.
గతేడాది డిసెంబరులో గూగుల్ ఈ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ మోడల్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలిపింది. అయితే, ఇటీవల దీని వాడకంపై గూగుల్ యూజర్లకు కీలక సూచనలు చేసింది. ఈ ఏఐ టూల్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే క్రమంలో లేదా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత, సున్నితమైన డేటాని షేర్ చేయొద్దని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వాతీమాలీవాల్పై దాడి..! దిల్లీ సీఎం నివాసం బాక్సింగ్ రింగ్లా మారిందన్న భాజపా
ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్ (Swati Maliwal) ఆరోపించినట్లుగా వెలుగులోకి వచ్చిన కథనాలపై భాజపా స్పందించింది. -
‘దుమ్మురేపిన’ గాలివాన.. ముంబయిలో మెట్రో, సబ్అర్బన్ సర్వీసులకు అంతరాయం
ముంబయిలో పలు ప్రాంతాల్లో వర్షంతోపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మెట్రోతోపాటు లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. -
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
జబ్బుపడిన ఓ ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకుగానూ ‘వన్తార’ సిబ్బంది ఏకంగా 3500 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. -
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
లైంగిక వేధింపుల వ్యవహారంలో హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన షాకింగ్ విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. -
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
క్యాన్సర్తో పోరాడుతున్న బిహార్కు చెందిన ఓ మహిళ లేవలేని స్థితిలోనూ తన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు. -
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా ఇప్పటి వరకు పనికొచ్చే ఆధారాలు, సమాచారం ఏదీ ఇవ్వలేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. -
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
దిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆయన పార్టీ ఆప్ మహిళా నేత స్వాతీమాలీవాల్పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. -
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
PM Modi: బిహార్లోని గురుద్వారలో ప్రధాని మోదీ సేవ చేశారు. భక్తులకు లంగర్ వడ్డించారు. -
చైనాతో పోటీ పడటం నేర్చుకోవాలి
చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. -
యోగా చిచ్చర పిడుగు హర్షిక
కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. -
ఆసుపత్రికి తండ్రి భౌతికకాయం వితరణ.. నాన్న చివరి కోరికను నెరవేర్చిన కుమారులు
చనిపోయిన తరవాత తన శరీరాన్ని ఏదైనా వైద్యవిద్యా సంస్థకు దానం చేయాలన్న తండ్రి మాటను ఆ కుమారులు నెరవేర్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (3)
హవాలా కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. -
దర్శనమిచ్చిన బద్రీనాథుడు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. -
దిల్లీలో 20 ఆసుపత్రులకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు