NIA: 44 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు.. ఐసిస్‌ కుట్ర కేసులో 13 మంది అరెస్టు

ఐసిస్‌ కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్‌ఐఏ దాడులు చేపట్టింది.

Updated : 09 Dec 2023 15:36 IST

దిల్లీ: ఐసిస్‌ (ISIS) కుట్ర కేసుకు సంబంధించి మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka)లోని 44 ప్రాంతాల్లో ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తోన్న ఈ దాడుల్లో 13 మంది నిందితులను అరెస్టు చేసింది.

ఐసిస్‌ కుట్ర కేసులో భాగంగా మహారాష్ట్రలోని పుణె, ఠాణె, మీరా భయాందర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఎస్‌ఐఏ ఈ సోదాలు చేపట్టింది. మరోవైపు కర్ణాటకలోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి. పుణెలో రెండు చోట్ల, ఠాణెలో 40 చోట్ల , కర్ణాటకలో రెండు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

వెడ్‌ ఇన్‌ ఇండియా.. మీరే ప్రారంభించాలి

ఇదిలా ఉండగా.. పుణె ఐసిస్‌ మాడ్యుల్‌ కేసులో కీలక నిందితుడైన షానవాజ్‌ను దిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడి వద్ద నుంచి ఐఈడీలను తయారు చేసేందుకు ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసుతో సంబంధమున్న వారందరినీ పట్టుకునేందుకు ఎన్‌ఐఏ అధికారులు ఈ ఆపరేషన్‌ చేపట్టారు. పుణె మాడ్యూల్‌ కేసుతో సంబంధమున్న మరో ఏడుగురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసి గత నెలలో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నిందితులు ఉగ్ర ముఠాలను ఏర్పాటు చేసి.. నిధులను సేకరిస్తున్నారని పేర్కొంది. వారి నుంచి మారణాయుధాలు, ఐఈడీ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని