Arvind Kejriwal: కేజ్రీవాల్.. జైలునుంచి పాలన సాధ్యమేనా..?
జైల్లో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు రాజ్యాంగం, చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ఆచరణాత్మకంగా అసాధ్యమని న్యాయనిపుణులు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను తిహాడ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం సీఎం పదవిలోనే కొనసాగుతోన్న కేజ్రీవాల్.. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు పాలనాపర ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కారాగారానికి తరలించిన నేపథ్యంలో.. సీఎంగా కొనసాగడం, పాలనాపర వ్యవహారాలు నిర్వహించడం కుదురుతుందా? అనే ప్రశ్నలు ఉత్నన్నమవుతున్నాయి. రాజ్యాంగం, చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని న్యాయనిపుణులు చెప్పారు.
‘‘జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని నిషేధించే నిర్దిష్ట నిబంధనేదీ రాజ్యాంగంలో లేదు. అయితే.. విధుల నిర్వహణ ఆచరణాత్మకంగా అసాధ్యం’’ అని సీనియర్ న్యాయవాది అజిత్ సిన్హా తెలిపారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ సైతం ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి చెరసాలకు వెళ్లే సందర్భాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరని, అందుకే ఈ వ్యవహారానికి సంబంధించిన నిబంధనలు పొందుపర్చలేదేమోనని తెలిపారు.
తిహాడ్ జైలు నంబరు 2లో కేజ్రీవాల్.. డైలీ రొటీన్ ఇదే..!
‘‘కారాగారం నుంచి ప్రభుత్వ నిర్వహణ కష్టం. ప్రభుత్వాధినేతగా చేపట్టే ప్రతీ పనికి.. కోర్టు, అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్యాబినెట్ను సమావేశపర్చడం కుదరదు. మంత్రివర్గ నిర్ణయాలు తీసుకోవడం, అధికారిక పత్రాలపై సంతకాలు చేయడం, బదిలీ ఉత్తర్వుల వంటి రోజువారీ పాలనాపర కార్యకలాపాల నిర్వహణ అసాధ్యం. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తాను అరెస్టయినప్పుడు.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపొచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ తర్వాత తన సతీమణి రబ్రీ దేవీని సీఎం చేశారు’’ అని వికాస్ సింగ్ గుర్తుచేశారు.
కారాగారం నుంచి పాలన అత్యంత సవాలుతో కూడుకున్న వ్యవహారమని తీహాడ్ జైలు మాజీ పీఆర్వో సునీల్ కుమార్ గుప్తా తెలిపారు. ‘‘దిల్లీలోని 16 జైళ్లలో ఒక్కదాంట్లోనూ సీఎం విధుల నిర్వహణకు అనువైన సౌకర్యాలు లేవు. దీని కోసం అన్ని నిబంధనలను పక్కనపెట్టాల్సి ఉంటుంది. అయితే.. దీనికి ఎవరూ అనుమతించరు. మంత్రులు, ఎల్జీ, సిబ్బందితో సమావేశాలు, టెలిఫోన్ సంభాషణలు అవసరం. తిహాడ్ జైలుకు టెలిఫోన్ సౌకర్యం కూడా లేదు. అక్కడ సీఎం కార్యాలయం ఏర్పాటు అసాధ్యం’’ అని ఓ వార్తాసంస్థతో గుప్తా తెలిపారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని ఇటీవల దిల్లీ హైకోర్టు కూడా స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్