Basava Nadu: కర్ణాటకను ‘బసవనాడు’గా మారిస్తే తప్పేంటి?: మంత్రి ఎంబీ పాటిల్
కర్ణాటక పేరును బసవనాడుగా మారిస్తే తప్పేముందని.. ఎంతోమంది ఇదే డిమాండు చేస్తున్నారని కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ పేర్కొన్నారు.
బెంగళూరు: కర్ణాటకలో పలు జిల్లాల పేర్లు (District Names) మార్పు అంశం చర్చనీయాంశమవుతోంది. రామనగర జిల్లాను బెంగళూరు సౌత్గా మార్చాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రతిపాదన చేసిన మరుసటి రోజే మరో జిల్లా పేరు మార్పు డిమాండు మొదలయ్యింది. ‘విజయపుర’ జిల్లా పేరును ‘బసవేశ్వర’గా మార్చాలంటూ ఆ రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రాన్ని ‘బసవనాడు’ (Basava Nadu)గా మార్చడంలోనూ ఎటువంటి తప్పూ లేదని స్పష్టం చేశారు.
‘హోయసల కాలంలో ఈ ప్రాంతాన్ని విజయపురగా పిలిచేవారు. తర్వాత అదిల్ షాహీ పాలనా కాలంలో దీన్ని బీజాపుర్గా మార్చారు. అనంతరం ఇది విజయపురగా మారింది. ప్రస్తుతం ఈ పేరును బసవేశ్వర జిల్లాగా మార్చాలని ఎంతోమంది ప్రజలు డిమాండు చేస్తున్నారు. బసవన్న జన్మస్థలమైన ఈ ప్రాంతం పేరును మార్చడంలో ఎటువంటి తప్పూ లేదు’ అని కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ పేర్కొన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. పేర్ల మార్పునకు కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ, వీటిపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని అన్నారు.
ఆ జిల్లా పేరు మారిస్తే ఆమరణ దీక్ష చేస్తా : హెచ్డీ కుమారస్వామి
కర్ణాటక పేరును బసవనాడుగా మార్చడంపై మీ అభిప్రాయమేంటని విలేకరులు అడగగా.. ‘అది సహజమే. అందులో తప్పేముంది? ప్రపంచంలో తొలి పార్లమెంటు ‘అనుభవ మంటపాన్ని’ అందించింది బసవన్న. సామాజిక భావనను అందించారు. మన ప్రాంతాన్ని బసవనాడుగా మార్చాలని చెబుతూనే ఉన్నాం. బసవ సంస్కృతిని మనం అలవరచుకోవాలి’ అని మంత్రి పాటిల్ పేర్కొన్నారు. నగరంలోని మెట్రో, విజయపుర్ ఎయిర్పోర్టులకు ఆయన పేరే పెట్టాలని.. వీటిపై సీఎంతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇదిలా ఉంటే, కర్ణాటకలో 12 నగరాల పేర్లను మార్చేందుకు 2014లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో బెంగళూర్ (Bangalore) బెంగళూరు (Bengaluru)గా, బీజాపుర్ విజయపురగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.