MPs suspension: ‘సస్పెన్షన్’ కోసం విపక్ష ఎంపీలే విజ్ఞప్తి చేశారు : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
కొంతమంది ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత.. వారి సహచర సభ్యులు సస్పెన్షన్ కోరుతూ తమని అభ్యర్థించారని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో (Parliament Winter Session) సభా కార్యకలాపాలు సజావుగా సాగకుండా విపక్ష పార్టీలు అడ్డుకున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. ఎంపీలను సస్పెండ్ చేయడం (MPs suspension) తమ ప్రభుత్వానికి ఇష్టం లేదని.. కానీ, పలువురు ఎంపీల సస్పెన్షన్ తర్వాత.. తమపైనా చర్యలు తీసుకోవాలని మరికొందరు విపక్ష సభ్యులు అభ్యర్థించారని పేర్కొన్నారు. పార్లమెంటు (Parliament) ఉభయసభల ఆమోదం పొందిన మూడు బిల్లులపై ఏమైనా అభ్యంతరాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్ఛ విపక్ష పార్టీలకు ఉందన్నారు.
‘భారత్ను చైనాతో పోల్చొద్దు..!’ మోదీ కీలక వ్యాఖ్యలు
‘ఎంపీలను సస్పెండ్ చేయాలని మేము కోరుకోలేదు. కానీ, కొంతమంది ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత.. వారి సహచర సభ్యులు తమను కూడా సస్పెండ్ చేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ఈ స్థాయికి దిగజారింది’ అని ప్రహ్లాద్ జోషి విమర్శించారు. దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. సభలోకి ప్లకార్డులను తీసుకొచ్చే వారిపై చర్యలుంటాయని ఎంపీలకు ముందే చెప్పామన్నారు.
భాజపా ఎంపీ స్టేట్మెంట్ రికార్డు..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపైనా ప్రహ్లాద్ జోషి విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను అపహాస్యం చేస్తుంటే.. అటువంటి చర్యలను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు (రాహుల్ గాంధీ) తన ఫోన్లో బంధిస్తూ ఎంజాయ్ చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండదని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అదేవిధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై దర్యాప్తు కొనసాగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత చట్టం తన పని చేసుకుపోతుందన్నారు. దర్యాప్తులో భాగంగా భాజపా ఎంపీ ప్రతాప్ సింహ వాంగ్మూలాన్నీ రికార్డు చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!