Pak To India: ‘పబ్‌జీ’ పరిచయం.. నలుగురు పిల్లలతో పాకిస్థాన్‌ నుంచి వచ్చేసి!

‘పబ్‌జీ’లో పరిచయమైన వ్యక్తితో కలిసి ఉండేందుకుగానూ ఓ పాకిస్థానీ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 06 Jul 2023 12:37 IST

లఖ్‌నవూ: ఆన్‌లైన్‌ గేమ్‌ ‘పబ్‌జీ (PUBG)’లో పరిచయమైన వ్యక్తి కోసం.. ఓ పాకిస్థానీ మహిళ (Pakistan Woman) తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలోని అతడి అద్దె ఇంట్లోనే వారంతా నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరితోపాటు నలుగురు పిల్లలనూ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పాకిస్థానీ మహిళకు, గ్రేటర్‌ నోయిడా (Greater Noida)లో నివసిస్తోన్న ఓ వ్యక్తికి ‘పబ్‌జీ’లో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారింది.

ఈ క్రమంలోనే ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. నోయిడాలోని తన అద్దె ఇంట్లోనే అతడు వారికి ఆశ్రయం కల్పించాడు. ‘పాకిస్థానీ మహిళ, ఆమె పిల్లలతోపాటు స్థానిక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం’ అని స్థానిక డీసీపీ వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరినీ విచారిస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. తొలుత పాకిస్థాన్‌ నుంచి నేపాల్‌కు వెళ్లి, అక్కడినుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. బస్సు మార్గంలో గ్రేటర్‌ నోయిడాకు చేరుకున్నట్లు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని