Poonch attack: పాక్-చైనా పన్నాగం..? పూంఛ్ సెక్టార్లో నక్కిన 30మంది ఉగ్రవాదులు!
పూంఛ్ సెక్టార్లో దాదాపు 25 నుంచి 30 మంది ఉగ్రవాదులు నక్కినట్లు భారత సైన్యం (Indian Army) అంచనా వేస్తోంది. వీరి జాడను పసిగట్టేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: పూంఛ్ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు (Poonch attack) జరపడం మరోసారి కలవరపాటుకు గురిచేసింది. పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పూంఛ్ సెక్టార్లో దాదాపు 25 నుంచి 30 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు భారత సైన్యం అంచనా వేస్తోంది. అక్కడ నుంచే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ దాడుల ప్రణాళికలో పాకిస్థాన్-చైనాలు (China) సహకరించుకుంటున్నట్లు రక్షణశాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి.
మూడేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్లోని సరిహద్దులో చైనా-భారత్ బలగాల మధ్య ఘర్షణ (Galwan Clash)తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో ప్రతిష్టంభన నెలకొనడంతో చైనా బలగాలను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్రీయ రైఫిల్స్ను పూంఛ్ సెక్టార్ నుంచి లద్దాఖ్కు తరలించారు. అదే అదనుగా భావించిన పాకిస్థాన్.. తమ ఉగ్రవాదులను పూంఛ్ సెక్టార్లోకి పంపించడం మొదలుపెట్టింది. ఇలా వచ్చిన ముష్కరులు భారత సైన్యంపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో లద్దాఖ్లో మోహరించిన భారత సైన్యాన్ని కశ్మీర్కు మళ్లించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్-చైనాలు సహకరించుకుంటూ పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నట్లు రక్షణశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో పూంఛ్ అటవీ ప్రాంతంలో దాదాపు 25 నుంచి 30 మంది ఉగ్రవాదులు నక్కినట్లు భావిస్తున్నాయి. వీరి జాడను పసిగట్టేందుకు స్నిఫర్ డాగ్లు, డ్రోన్ల సాయంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Jammu and Kashmir: కొండల్లో నక్కి.. ‘బ్లైండ్ స్పాట్’ వద్ద టార్గెట్ చేసి..!
జమ్మూకశ్మీర్ సురాన్కోట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ధేరా కి గాలి, బుఫ్లియాజ్ మధ్య గల ధత్యార్ మోర్ వద్ద భారత సైనిక వాహనాలపై జరిగిన ఘనటలో అయిదుగురు సైనికులు అమరులయ్యారు. ఈ దాడికి తమదే బాధ్యత అని పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించుకుంది. పూంఛ్ అటవీ ప్రాంతంలో దాక్కున్న వారిని గుర్తించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ (Cordon and Search) కొనసాగుతోంది. పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GoC)తోపాటు ఇతర బృందాలు క్షేత్రస్థాయికి చేరుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు