Pratap Simha: పార్లమెంట్ ఘటనపై తొలిసారి స్పందించిన ప్రతాప్ సింహా
పార్లమెంట్లో అలజడి సృష్టించిన నిందితులకు పాసులు జారీ చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ సింహా తొలిసారి ఘటనపై స్పందించారు.
మైసూరు: ·రెండు వారాల క్రితం పార్లమెంట్ (Parliament Security Breach)లోకి చొరబడిన ఇద్దరు ఆగంతకులకు పాసులు జారీ చేసిన లోక్సభ సభ్యుడు, మైసూరు (Mysuru) ఎంపీ ప్రతాప్ సింహా (Pratap Simha ) ఈ ఘటనపై తొలిసారి స్పందించారు. తాను దేశభక్తుడినా లేక దేశద్రోహినా అనేది 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఆదివారం మైసూరులో మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిర్ణయాధికారం దేవుడికి, తన రచనలు చదివే పాఠకులకు విడిచిపెడుతున్నట్లు తెలిపారు.
‘‘ప్రతాప్ సింహా దేశద్రోహా, దేశభక్తుడా అనేది మైసూరు కొండల్లో వెలసిన చాముండేశ్వరీ మాతకు, బ్రహ్మగిరిలో వెలసిన కావేరి మాతకు, గత 20 ఏళ్లుగా కన్నడనాట నా రచనలు చదివే పాఠకులకు, మైసూరు ప్రజలకు తెలుసు. జాతీయవాదం విషయంలో నా ప్రవర్తనపై 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారు. ఈ విషయంలో ఇంతకు మించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు’’ అని అన్నారు. మరోవైపు ఈ కేసులో భాజపా ఎంపీ ప్రతాప్ సింహా వాదనను పోలీసులు రికార్డు చేశారని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం వెల్లడించారు.
ప్రసంగిస్తూ వేదికపైనే కన్నుమూసిన ఐఐటీ ప్రొఫెసర్
డిసెంబరు 13న ఇద్దరు ఆగంతకులు లోక్సభ గ్యాలరీ నుంచి వెల్లోకి దూకి పొగ బాంబులను విడుదల చేశారు. ఆ ఇద్దరు భాజపా ఎంపీ ప్రతాప్ సింహా పేరుతో జారీ చేసిన పాసులతోనే సభలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను విచారించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో దాడి జరిగిన రోజే ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన వాదనను వినిపించారు. దర్యాప్తు బృందానికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పార్లమెంటులోకి ప్రవేశించిన మనోరంజన్ డి, సాగర్ శర్మలతోపాటు వెలుపల అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన అమోల్ ధన్రాజ్ శిందే, నీలమ్దేవిలను పటియాలా హౌస్ కోర్టు జనవరి 5 వరకు పోలీసుల కస్టడీ విధించింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!