Rahul Gandhi: ప్రధానిపై రాహుల్‌ విమర్శలు

Eenadu icon
By National News Team Published : 02 Nov 2025 15:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Congress MP Rahul Gandhi) మరోసారి ప్రధానిపై విమర్శలు చేశారు. ఆదివారం బిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ మాట్లాడుతూ.. ఓట్ల కోసం ప్రధాని మోదీ (PM Narendra Modi) ఏం చేయడానికైనా వెనకాడబోరని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ బిహార్‌కు వచ్చి అనేక ప్రసంగాలు, వాగ్దానాలు చేస్తారని.. ఎన్నికల తర్వాత రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడరని రాహుల్‌ విమర్శించారు.

బిహార్‌లో ప్రధాన సమస్యగా ఉన్న నిరుద్యోగం గురించి ప్రశ్నలు లేవనెత్తకుండా.. యువత దృష్టిని మళ్లించడానికి వారిని రీల్స్‌ చూడాలని మోదీ కోరుతున్నారని  రాహుల్‌ అన్నారు. రాష్ట్రంలో తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఉత్తమ విద్య, ఉద్యోగ అవకాశాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నలంద వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్ని బిహార్‌లో ప్రారంభిస్తామన్నారు. ఇండియా కూటమిని ఎన్నుకుంటే రాష్ట్రంలో రైతులు, కార్మికులు, దళితులు, బలహీనవర్గాలకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. 

భారత్‌-పాక్‌ సైనిక ఘర్షణను ఆపానని ట్రంప్‌ పదేపదే చెబుతున్నప్పటికీ.. ఆయనను నిలదీసి ప్రశ్నించే ధైర్యం మోదీ (PM Modi)కి లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలు వంటి నిర్ణయాలన్నీ దేశంలోని కొందరు వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూర్చేవేనన్నారు. కానీ తాము మాత్రం చిరు వ్యాపారులు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్లు, ఇతర పరికరాలపై మేడిన్‌ బిహార్‌ అనే ముద్రను చూడాలనుకుంటున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు