PM Modi: భారత్ బలం తెలిసొచ్చింది: పాక్పై మోదీ వ్యాఖ్యలు

ఇంటర్నెట్డెస్క్: చరిత్ర రాయడంలో సమయం వృథా చేయకూడదని, దానిని సృష్టించాలని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విశ్వసించారు. దానికి తగ్గట్టే భారతదేశాన్ని ఏకంచేసి ఆయన చరిత్ర సృష్టించారని కొనియాడారు. గుజరాత్లో ఐక్యతా విగ్రహం (Statue of Unity) వద్ద పటేల్ 150వ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.
‘‘స్వాతంత్ర్యం తర్వాత 550 సంస్థానాలను ఏకం చేసి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారు. ఆయనకు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికత అత్యంత ముఖ్యమైంది. దానిని మేం సమర్థిస్తాం. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఏక్తా దివస్ను జరుపుకొంటున్నాం. భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. విభజన శక్తులకు దూరంగా ఉండాలి. దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిణమించింది. నక్సల్స్ ఏరివేత కోసం ఎన్నో ఆపరేషన్స్ చేశాం. నక్సలిజం మూలాలను సమూలంగా పెకిలిస్తాం. కశ్మీర్ మొత్తాన్ని భారత్లో కలపాలని పటేల్ (Sardar Vallabhbhai Patel) ఆకాంక్షించారు. దానిని నెహ్రూ గౌరవించలేదు. పటేల్, అంబేడ్కర్ను కాంగ్రెస్ అవమానించింది. ఆయన దూరదృష్టిని మరిచిపోయింది.
కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది. దానివల్ల కశ్మీర్, దేశంలో అశాంతి నెలకొంది. ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోషించింది. ఇంత జరిగినా ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది. మన దేశం నిజమైన బలం ఏంటో ఆ ఉగ్రవాదులకు తెలిసింది. దేశ ఐక్యతను బలోపేతం చేసే చర్యలను ప్రోత్సహించాం. ఆయన ఆకాంక్షలను మేం గౌరవించాం. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటుంటే కొందరికి బాధగా ఉంటుంది. దేశం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని ప్రతిజ్ఞ చేద్దాం’’ అని మోదీ (PM Modi) మాట్లాడారు. పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల చేశామని వెల్లడించారు. ఈ రోజు పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటుచేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

యువత ‘రీల్స్’లో బిజీగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్
యువత సోషల్ మీడియా రీల్స్లో బిజీగా ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. - 
                                    
                                        

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
Rahul Gandhi: ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన ఖర్గేపై భాజపా నేతలు సెటైర్లు వేస్తున్నారు. - 
                                    
                                        

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
Shashi Tharoor: థరూర్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో భాజపా నేత నుంచి ఆయనకు హెచ్చరిక వచ్చింది. - 
                                    
                                        

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
బిహార్లోని దర్భాంగాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. - 
                                    
                                        

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
అమెరికా సెనెట్లో ఇటీవల ప్రతిపాదించిన అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత (హైర్) బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థికవ్యవస్థ దెబ్బతింటోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. - 
                                    
                                        

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
బిహార్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలక హామీ ప్రకటించారు. - 
                                    
                                        

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో నాలుగు ఏనుగులు ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాయి. - 
                                    
                                        

ఔషధ తయారీకి ఏఐ ఊతం!
ఔషధాల కోసం ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నాయి. ఓ మందు తయారు చేయాలంటే ట్రిలియన్ల సంఖ్యలో ఉన్న మాలిక్యూల్లపై వేట కొనసాగించాల్సి ఉంటుంది. - 
                                    
                                        

రైతుల అప్పు తీర్చిన బాబూభాయ్
గుజరాత్లోని సూరత్కు చెందిన వ్యాపారవేత్త బాబూభాయ్ జిరావాలా (ఛాద్వాడియా).. 290 మంది రైతుల అప్పులను తీర్చారు. దశాబ్దాలుగా అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్న వారి కష్టాన్ని చూసి చలించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. - 
                                    
                                        

ముళ్ల కంపలో దూకే ఆచారం
మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో ఉన్న గులంకీ గ్రామంలో భక్తులు నల్ల తుమ్మ చెట్టు ముళ్ల కంపలోకి దూకే ఆచారం వందల ఏళ్లుగా కొనసాగుతోంది. - 
                                    
                                        

బిహార్లో చేసిన వ్యాఖ్యలు ఇక్కడా చేయగలరా?
బిహార్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడుకు వచ్చి అనగలరా అని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రశ్నించారు. - 
                                    
                                        

ఎస్ఐఆర్పై ఆందోళన అవసరం లేదు
ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్ఐఆర్)పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ప్రక్రియ ఊహించిన దాని కన్నా బాగా జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మద్రాసు హైకోర్టుకు తెలిపింది. - 
                                    
                                        

ఆర్జేడీ-కాంగ్రెస్లది ప్రమాదకర కుట్ర
చొరబాటుదారుల్ని ప్రోత్సహించి, సీమాంచల్ ప్రాంతంలో జనాభాపరమైన మార్పుల్ని తీసుకువచ్చేందుకు ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రమాదకరమైన కుట్రపన్నుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. - 
                                    
                                        

అమెరికా హైర్ ఆందోళనకరం
అమెరికాలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత(హెచ్ఐఆర్ఈ-హైర్) చట్టం.. హెచ్-1బీ వీసా రుసుం లక్ష డాలర్లకు పెంపు కంటే ఆందోళనకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. - 
                                    
                                        

కుటుంబ వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు
భారత ప్రజాస్వామ్యానికి కుటుంబ వారసత్వ రాజకీయాలు తీవ్ర ముప్పుగా మారాయని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. రాజకీయ అధికారాన్ని సామర్థ్యం, నిబద్ధత, క్షేత్రస్థాయి బలం కన్నా.. కుటుంబ వారసత్వాలు నిర్ణయిస్తే పరిపాలన దెబ్బతింటుందని పేర్కొన్నారు. - 
                                    
                                        

రూ.3 వేల కోట్లు కొల్లగొట్టారా..
దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పెచ్చరిల్లుతున్న డిజిటల్ అరెస్టు కేసులు, సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మోసాలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పేర్కొంది. - 
                                    
                                        

ఖర్జూర చెట్ల ఆకులతో కళాకృతులు
ఒడిశాలోని పూరీ జిల్లా కాకత్పుర్కు చెందిన 24 ఏళ్ల సత్యజిత్ మహారాణా.. ఖర్జూర చెట్ల ఆకులతో అద్భుత కళాకృతులను తయారు చేస్తున్నారు. - 
                                    
                                        

నక్సల్స్ ఇలాకాలో సినిమా షూటింగ్
ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న అబూజ్మడ్ ఒకప్పుడు తుపాకీ మోతలతో దద్దరిల్లేది. అక్కడి సహజ అందాలు, దట్టమైన అడవులు, చూడచక్కని కొండ ప్రాంతాలు, పచ్చిక బయళ్లు దశాబ్దాలపాటు రక్తమోడాయి. - 
                                    
                                        

పదేళ్లుగా స్వచ్ఛ భారత్
ఒడిశాలోని బలంగీర్కు చెందిన వైద్యుడు మన్మోహన్ బాగ్.. గత పదేళ్లుగా స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించడానికి స్వచ్ఛందంగా ఆయన ఈ పని చేస్తున్నారు. - 
                                    
                                        

సంక్లిష్ట పరిశోధనల కేంద్రంగా భారత్
అత్యంత క్లిష్టమైన, అధిక ప్రభావం చూపే పరిశోధనలకు భారత ప్రభుత్వం మద్దతిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడానికి, దేశాన్ని సాంకేతిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 - 
                        
                            

అప్పుడు ఒక్క మ్యాచ్ ఆడితే రూ.1,000 ఇచ్చారు: మిథాలి రాజ్
 - 
                        
                            

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అపరెల్ గ్రూప్ను ఆహ్వానించిన మంత్రి నారాయణ
 - 
                        
                            

కొలికపూడి, కేశినేని పంచాయితీ.. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
 


