Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
Fake Toll Plaza: గుజరాత్లో ఘరానా మోసం బయటపడింది. కొందరు మోసగాళ్లు ఏకంగా రోడ్డు వేసి.. మధ్యలో టోల్ ప్లాజా కట్టేశారు. ఏడాదిన్నరగా రూ. కోట్లు వసూలు చేస్తున్నా అధికారులు దీన్ని గుర్తించకపోవడం గమనార్హం.
అహ్మదాబాద్: గుజరాత్ (Gujarat)లో మరోసారి ‘నకిలీ’ వ్యవహారం కలకలం రేపింది. మోర్బీ జిల్లాలో కొందరు మోసగాళ్లు బైపాస్ రోడ్డును నిర్మించి.. మధ్యలో టోల్ ప్లాజా (Fake Toll Plaza) ఏర్పాటు చేశారు. ఏకంగా ఏడాదిన్నర పాటు వాహనదారుల నుంచి టోల్ వసూలు చేసి రూ. కోట్లు దండుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మోర్బీ, కచ్ జిల్లాలను కలిపే 8ఏ నంబరు జాతీయ రహదారిపై వాఘసియా టోల్ ప్లాజా ఉంది. అయితే ఈ టోల్ ప్లాజా (Fake Toll Plaza) తగలకుండా ఉండేందుకు కొందరు వాహనదారులు పక్కనే ప్రత్యామ్నాయంగా ఉన్న మరో మార్గంలో వెళ్తుండేవారు. దీన్ని గమనించిన కొందరు మోసగాళ్లు.. ఈ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్ రోడ్డును నిర్మించి.. ఫ్యాక్టరీలో టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు.
దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ ‘నకిలీ టోల్ ప్లాజా’ను నడిపిస్తున్నట్లు సమాచారం. హైవేపై ఉన్న టోల్ ప్లాజా ఛార్జీల కంటే తక్కువగా వసూలు చేయడంతో వాహనదారులు కూడా దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దీనిపై ఇటీవల స్థానిక మీడియాల్లో వార్తలు రావడంతో ఈ నకిలీ టోల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తొలి బుల్లెట్ రైలు స్టేషన్ను వీక్షించారా..?
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగుర్ని అరెస్టు చేశారు. నిందుతుల్లో ఒకరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా.. పాటిదార్ వర్గానికి చెందిన ప్రముఖ నేత కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కాలంలో ఈ నకిలీ టోల్ ప్లాజాతో నిందితులు వాహనదారుల నుంచి దాదాపు రూ.75కోట్లు వసూలు చేసినట్లు స్థానిక మీడియా కథనాల సమాచారం. అయితే దీని గురించి స్థానిక అధికారులకు తెలిసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాగా.. గుజరాత్లో ఇలా ‘నకిలీ’ వ్యవహారం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల దాహోద్ జిల్లాలో ఓ నకిలీ ప్రభుత్వ ఆఫీసు గుట్టు బయటపడింది. దాన్ని ఛేదించగా.. జిల్లాలో అలాంటివి మరో ఆరు నకిలీ కార్యాలయాలున్నట్లు తెలిసి పోలీసులు విస్తుపోయారు. ప్రభుత్వ ఆఫీసులంటూ ప్రజలను నమ్మించి నిందుతులు గత కొన్నేళ్లుగా రూ.18కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సహా పలువుర్ని పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!