Prashant Kishor: తప్పుంటే అరెస్టు చేసుకోండి - ఈసీ నోటీసులపై ప్రశాంత్‌ కిశోర్‌

Eenadu icon
By National News Team Published : 29 Oct 2025 00:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు రాష్ట్రాల్లో ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయనే కారణంతో జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor)కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పీకే స్పందించారు. ఒకవేళ రెండు ఉంటే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తన పేరు ఎందుకు తొలగించలేదని ఈసీ (Election Commission)ని ప్రశ్నించారు. తన తప్పిదం ఉన్నట్లయితే అరెస్టు చేసుకోవచ్చని ఈ సందర్భంగా సవాల్‌ విసిరారు.

‘‘రెండు జాబితాల్లో నా పేరు కనిపిస్తే.. బిహార్‌లో ఇటీవల చేపట్టిన ఎస్‌ఐఆర్‌లో నా పేరు ఎందుకు తొలగించలేదో ఎన్నికల సంఘం వివరించాలి. స్వస్థలం కోనార్‌లో 2019 నుంచి నాపేరుంది. ఆ మధ్యలో రెండేళ్లు పశ్చిమ బెంగాల్‌ ఉన్నందున అక్కడ ఓటరుగా ఉన్నాను. ఆ తర్వాత బిహార్‌లోనే ఉంది. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ చేపట్టి ఓటరు జాబితాను ప్రక్షాళన చేశామని ఈసీ చెబుతోంది. నన్ను బెదిరించడానికి నోటీసులు పంపించారు. ఏదైనా తప్పు జరిగితే అరెస్టు చేసి నిరూపించండి’’ అని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు.

ప్రశాంత్‌ కిశోర్‌కు పశ్చిమ బెంగాల్‌ ఓటరు ఐడీ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యాలయం ఉన్న కాళీఘాట్‌ రోడ్డు చిరునామా ఉన్నట్లు తెలిసింది. అక్కడి భవానీపుర్‌ నియోజకవర్గం నుంచే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీ చేశారు. ఆ సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు పీకే సలహాదారుగా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని