PM Modi: ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్‌కు మోదీ నివాళులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల సుదీర్ఘ ధ్యానం ముగిసింది.

Published : 01 Jun 2024 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడు (Tamil Nadu)లోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేపట్టిన సుదీర్ఘ ధ్యానం ముగిసింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ధ్యానం.. 45 గంటలపాటు కొనసాగింది. ఈ క్రమంలోనే ఉదయం సూర్యుడికి అర్ఘ్యం వదిలారు. (Modi Meditation)

ధ్యానం ముగిసిన అనంతరం ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్‌ విగ్రహానికి మోదీ పూలమాల వేసి, నివాళులర్పించారు. వివేకానంద శిలాస్మారకం పక్కనే చిన్న దీవిపై ఏర్పాటుచేసిన 133 అడుగుల ఎత్తయిన ఈ భారీ విగ్రహం వద్దకు ఆయన పడవలో చేరుకున్నారు. అనంతరం కన్యాకుమారి తీరానికి తిరిగివచ్చారు.

45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ.. ద్రవమే ఆహారం!

సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్‌ నుంచి వెనుదిరిగిన మోదీ.. తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం శిలాస్మారకాన్ని చేరుకుని, ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు. 2019లో ఎన్నికల సమయంలో మోదీ కేదార్‌నాథ్‌ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని