Uttarakhand: బాబోయ్.. కొండలెక్కడం అంత ఈజీ కాదు..!
పర్వతారోహణ చెయ్యడమంటే చాలా మందికి భలే సరదా. అయితే పర్వతారోహణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను తెలుసుకొని, సరైన శిక్షణ తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లడం ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు. ఆ సమస్యలేంటి..? పరిష్కార మార్గాలేంటి?
ఉత్తరాఖండ్లో అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం కారణంగా 10 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 40 మంది పర్వతారోహణకు వెళ్లినట్లు తెలుస్తోంది. తక్షణమే స్పందించిన విపత్తు ప్రతిస్పందన సహాయక బృందాలు 8 మందిని రక్షించాయి. మిగతావారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్వతారోహకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది? వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందామా?
ఎత్తైన కొండలపై నడుచుకుంటూ ప్రకృతిని ఆస్వాదించడమంటే కొందరికి భలే సరదా. పర్వతారోహణను ప్రతికూల వాతావరణంలో చేసే ఒక రకమైన సాహస క్రీడగానే చెప్పాలి. శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఇది ఓ మార్గమే. అయితే, ట్రెక్కింగ్కి వెళ్లే వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనేందుకు ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. అవసరమైతే నిపుణులతో శిక్షణ తీసుకోవాల్సిందే. లేదంటే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదముంది. ఇంతకీ పర్వతారోహకులు ఎదుర్కొనే సమస్యలేంటి?
1. ఊహించని ప్రమాదాలు
మంచుకొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఉన్నట్లుండి హిమపాతం సంభవించొచ్చు. కొన్ని సార్లు పర్వతభాగం కుంగిపోవచ్చు. నునుపైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసే క్రమంలో కాలుజారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అందువల్ల పర్వతారోహణకు వెళ్లే ముందు కచ్చితంగా శిక్షణ తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలనన్న నమ్మకం వచ్చిన తర్వాతే పర్వతారోహణకు సిద్ధమవ్వాలి. లేదంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే అవుతుంది.
2. అరికాళ్లలో బొబ్బలు
దాదాపు సగానికిపైగా పర్వతారోహకులు ఎదుర్కొనే సమస్య ఇది. పర్వతాలను అధిరోహించే క్రమంలో బూట్లకు, ఏటవాలుగా ఉన్న కొండ ఉపరితలానికి మధ్య తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. ఈ క్రమంలో అరికాళ్లలో బొబ్బలు ఏర్పడి.. పర్వతారోహకులకు తీవ్ర సమస్యగా మారతాయి. కొన్నిసార్లు ఇవి పగిలిపోయి గాయాలుగా మారిపోతాయి. అందుకోసం ఇలాంటి సమస్యలు తలెత్తకుండా నిపుణుల సూచన మేరకు సరైన బూట్లను ఎంపిక చేసుకోవాలి. కాళ్లకు కచ్చితంగా సరిపోయేలా చూసుకోవాలి. తేలికగా ఉండి, మడమ మొత్తం బూట్ల అడుగుబాగాన ఆనుకునేలా ఉన్న బూట్లను ఎంపిక చేసుకోవాలి. క్వాలిటీ సాక్సులు ఉండేలా చూసుకోవాలి. పర్వత భాగానికి, కాలికి మధ్య ఏర్పడిన ఒత్తిడిని ఇవి కొంతవరకు తగ్గిస్తాయి.
3. చర్మ సమస్యలు
పర్వతారోహణ కోసం దేశ విదేశాల నుంచి వస్తారు. విభిన్న వాతావరణాల్లో పెరిగిన వారుంటారు.అందువల్ల వారి శరీరం అక్కడి వాతావరణానికి అలవాటుపడి ఉంటుంది. ఒక్కసారిగా ప్రతికూల వాతావరణంలోకి వచ్చేసరికి సాధారణంగానే చిన్నపాటి చర్మ సమస్యలు ఏర్పడతాయి. అలాంటిది పర్వతారోహణ సమయంలో దీని ప్రభావం మరింతగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడే అవకాశముంది. అందువల్ల శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచేలా తేలికపాటి దుస్తుల్ని ఎంపిక చేసుకోవాలి. లో దుస్తుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టీ షర్టులు వేసుకున్నప్పుడు వాటిని పూర్తిగా కప్పి ఉంచేలా పొడవాటి మరో చొక్కాను ధరించడం ఉత్తమం. చిన్నపాటి ప్రాథమిక చికిత్సపెట్టెను తమతోపాటు తీసుకెళ్లడం మంచిది.
4. మోకాళ్ల నొప్పులు
ఎత్తయిన ప్రదేశాలను ఎక్కుతున్నప్పుడు కాలి ఎముకలు, కీళ్లు, కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రధానంగా కాలి మోకీళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎదుర్కొనేలా ముందుగా జాగ్రత్త పడాలి. పర్వాతారోహణకు వెళ్లడానికి కొన్ని నెలల ముందునుంచే నడటవటం, వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవాలి. అవసరమైతే నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయడం మంచిది. పర్వతారోహణకు అనుగుణంగా శరీరాన్ని అలవాటు చేసేందుకు సహజంగా 4 నుంచి 6 వారాలు పడుతుంది. వ్యాయామానికి తగ్గట్టుగా శరీరానికి తగిన విశ్రాంతి కూడా ఇవ్వాలి.
5. మెడ నొప్పి..వెన్ను నొప్పి
పర్వతారోహకులు తమ వెంట దుస్తులు, ఆహారంతోపాటు కొన్ని నిత్యావసరాలను బ్యాగులో వేసుకొని తీసుకెళ్తారు. ఓ వైపు వీటి బరువు మోస్తూనే పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీరికి భుజాల నొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి లాంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని అధిగమించేందుకు బ్యాగు పట్టీలు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. పర్వతారోహణకు వెళ్లడానికి ముందే కొంత బరువును బ్యాగులో మోస్తూ అలవాటు చేసుకోవాలి. పర్వాతారోహకుల కోసం ప్రత్యేకంగా బ్యాగులను తయారు చేసి విక్రయిస్తుంటారు. వాటిని ఒక్కసారి ప్రయత్నించి చూడటం ఉత్తమం.
6. అతిసార సమస్యలు
పర్వతారోహకులకు ఎదుయ్యే అనారోగ్య సమస్యల్లో అతిసారం ప్రధానమైనది.దీని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పర్వతారోహణ సమయంలో పొట్టలో అలజడి మొదలైతే ఆ బాధ వర్ణనాతీతం. అందువల్ల ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. బాగా కాచిచల్లార్చిన నీటినే తాగాలి. లేదంటే ఫిల్టర్ నీటిని వెంట తీసుకెళ్లాలి. శాకాహారం మాత్రమే తీసుకోవాలి. కూరగాయాలు వేడినీటిలో కడిగిన తర్వాత మాత్రమే వండాలి. పర్వతారోహణకు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడి ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాతావరణానికి తగినట్లు అక్కడి ఆహారపు అలవాట్లు ఉంటాయి. అందువల్ల శరీరం ముందుగానే అలవాటుపడుతుంది. ప్రతిసారి చేతులు కడుక్కోవడం సాధ్యం కాదు కాబట్టి.. హ్యాండ్ శానిటైజర్ని వెంట తీసుకెళ్లడం మంచిది.
7. డీహైడ్రేషన్
పర్వతారోహణ సమయంలో బాగా అలసిపోతారు. అందువల్ల శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశముంది. దీని నుంచి బయట పడేందుకు వీలైంత ఎక్కువగా నీటిని తాగాలి. అలాగని పెద్దపెద్ద బాటిళ్లు తీసుకొని వెళ్లడం కుదరని పని. అందువల్ల పర్వతారోహకుల కోసం ప్రత్యకమైన రబ్బరు సంచులు ఉంటాయి. వాటిని మాత్రమే తీసుకెళ్లాలి. ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. దీనివల్ల బ్యాగులో స్థలం వృథా అవడంతోపాటు అదనపుభారంగా మారుతాయి.
8. వడదెబ్బ
పైకి వెళుతున్న కొద్దీ గాలిలో తేమ మూలంగా వేడి క్రమంగా పెరుగుతుంది. అంతేకాకుండా రోజుకు దాదాపు ఏడెనిమిది గంటలకు పైగా పర్వతారోహణ చేయాల్సి ఉంటుంది. అందువల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దీనిని నుంచి బయటపడేందుకు సన్గ్లాస్ కళ్లజోడును వాడటం ఉత్తమం. పెదవులు పొడిబారకుండా ఏదైనా లోషన్ ఉపయోగించుకోవాలి. పై జాగ్రత్తలన్నీ పాటిస్తూ, సరైన శిక్షణ తీసుకున్న తర్వాత పర్వాతారోహణకు వెళ్తే..అనుకున్నట్లుగా ఎంజాయ్ చెయ్యగలుగుతారు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 5కోట్లకు పైనే: కేంద్రం
దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. -
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ