ISRO: 21వ శతాబ్దపు ‘పుష్పక’ విమానం.. పునర్వినియోగ రాకెట్ కీలక ప్రయోగం సక్సెస్
ISRO: అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకోవడమే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన ఆర్ఎల్వీ మిషన్లో మరో ప్రయోగ పరీక్ష విజయవంతమైంది.
బెంగళూరు: అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో ఇస్రో మరో ముందడుగు వేసింది. ఇస్రో (ISRO) తయారు చేసిన ‘రీయూజబుల్ లాంచ్ వెహికల్’ అటానమస్ ల్యాండింగ్ ప్రయోగాన్ని (RLV LEX-02) విజయవంతంగా చేపట్టింది. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్) దీనికి వేదికైంది. దీంతో దేశ సాంకేతిక సామర్థ్యాలను విస్తృతం చేసుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకునేందుకు ఆర్ఎల్వీ దోహదపడనుంది.
రెక్కలతో తయారు చేసిన ఈ ఆర్ఎల్వీకి ఇస్రో ‘పుష్పక్’ (Pushpak)గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్-01ను పూర్తి చేసిన ఇస్రో (ISRO).. స్వతంత్ర ల్యాండింగ్లో పుష్పక్ సామర్థ్యాన్ని ఎల్ఈఎక్స్-02 ద్వారా మరోసారి పరీక్షించింది. ఐఏఎఫ్కు చెందిన చినూక్ హెలికాప్టర్లో ఆర్ఎల్వీని 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. అవరోధాలు సృష్టించినా వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ నిర్దేశిత మార్గంలోకి వచ్చిన ఆర్ఎల్వీ స్వయంగా ల్యాండవడం విశేషం. అత్యంత కచ్చితత్వంతో రన్వేపై దిగిన ఈ వాహక నౌక.. బ్రేక్ పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ సాయంతో తనకు తానే ఆగిపోయింది.
ఆర్ఎల్వీ (RLV)ల స్వతంత్ర ల్యాండింగ్కు కావాల్సిన నావిగేషన్, కంట్రోల్ సిస్టమ్స్, ల్యాండింగ్ గేర్, డిసిలరేషన్ సిస్టమ్స్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతల సామర్థ్యం ఈ ప్రయోగంతో మరోసారి నిరూపితమైంది. ఎల్ఈఎక్స్-01లో ఉపయోగించిన బాడీ, ఫ్లైట్ సిస్టమ్స్నే తాజా ప్రయోగంలోనూ వాడారు. దీంతో హార్డ్వేర్, ఫ్లైట్ సిస్టమ్స్ పునర్వినియోగ సామర్థ్యం సైతం తాజా ప్రయోగంతో నిరూపితమైంది. ఎల్ఈఎక్స్-01 పరిశీలనల అనంతరం అధిక లోడ్ను తట్టుకునేలా ఎయిర్ఫ్రేమ్ స్ట్రక్చర్, ల్యాండింగ్ గేర్ను ఈసారి బలోపేతం చేసినట్లు ఇస్రో తెలిపింది.
ఈ మిషన్ను ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్తో కలిసి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విజయవంతంగా చేపట్టింది. ఐఏఎఫ్, ఏడీఈ, ఏడీఆర్డీఈ, సీఈఎంఐఎల్ఏసీ తమ వంతు సహకారాన్ని అందించాయి. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు వ్యక్తుల కోసం సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వమా?
సందేశ్ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. -
బెయిల్ కోసం విచారణ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
తన అరెస్టు, కస్టడీని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్ కోసం విచారణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. -
‘శాస్త్ర’లో యూనివర్సిటీ డే వేడుకలు
ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులను భవిష్యత్తుకు తగినట్లు తీర్చిదిద్దాలని ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ డాక్టర్ అభయ్ జెరె సూచించారు. -
ఆసుపత్రుల్లో రుసుముల నిర్ధారణపై మీ వైఖరేంటి?
ఆసుపత్రుల్లో వైద్యసేవల రుసుములను నిర్ధారించే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సెంట్రల్ గవర్నమెంట్) రూల్స్-2012లోని 9వ నిబంధనను అమలు చేయరాదన్న పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. -
పత్రికాస్వేచ్ఛ అణచివేత ధోరణి తగదు
పత్రికాస్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్కు లేఖ రాసింది. -
భోజ్శాల సర్వేకు మరో 8వారాల గడువు
భోజ్శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్ఐ)కి మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇందౌర్ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది. -
ఇక ఏటా పాఠ్యపుస్తకాల సవరణ
దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం పరిమితికి సవరణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం, హాస్టల్ రాయితీల పరిమితులను కేంద్రం సోమవారం సవరించింది. కరవు భత్యం పెరిగిన జనవరి 1, 2024 నుంచి పాటు ఈ సవరణ అమల్లోకి వచ్చింది. -
యూజీసీ నెట్ తేదీలో మార్పు
యూజీసీ నెట్ పరీక్ష తేదీ మారింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. వాస్తవానికి దాన్ని జూన్ 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. -
ఖలిస్థానీ తీవ్రవాదులను ఉపేక్షించడంపై కెనడాకు భారత్ తీవ్ర నిరసన
భారత్ వ్యతిరేక కార్యకలాపాలను బాహాటంగా నిర్వహిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్న కెనడా తీరుపై మన విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీలోని కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టీవార్ట్ వీలర్ను సోమవారం పిలిపించుకుని తీవ్ర నిరసన తెలిపింది. -
కేజ్రీవాల్, ఆతిశీలపై పరువు నష్టం దావా
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రి ఆతిశీలపై సోమవారం దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. వారిద్దరూ భాజపా, ఆ పార్టీ సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తాన్యా బామనీయాల్ ఎదుట కాషాయ పార్టీ దిల్లీ శాఖ మీడియా ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఫిర్యాదు దాఖలు చేశారు. -
శ్రీలంక సీతమ్మగుడికి సరయూ జలాలు
శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠకు భారత్ నుంచి సరయూనదీ జలాలు వెళుతున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలో కోరారు. -
చంద్రయాన్-3 ప్రయోగంలో 4 సెకన్ల జాప్యం
చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3.. ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి 4 సెకన్లపాటు ఆలస్యంగా బయలుదేరింది. -
బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం ఆదేశాలు వెనక్కి
అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసేందుకు అనుమతిస్తూ ఈ నెల 22న జారీచేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం సీజేఐ ఛాంబర్లో విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది. -
నీట్-పీజీ ఇంటర్న్షిప్ కటాఫ్ పొడిగింపు సాధ్యంకాదు: సుప్రీం
ఈ ఏడాది జూన్ 23న జరిగే నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్షిప్ కటాఫ్ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. -
కొలీజియం రద్దుకు పిటిషన్.. లిస్టింగ్పై పరిశీలనకు సుప్రీం నిరాకరణ
ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకం కోసం అమలవుతున్న కొలీజియం విధానం రద్దుకు దాఖలైన పిటిషన్ను లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. మాథ్యూస్ నెడుంపారా అనే న్యాయవాది దీన్ని దాఖలుచేశారు. -
సీఏ పరీక్షల వాయిదాకు ‘పిల్’
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. మే నెలలో జరగాల్సిన చార్టర్డ్ ఎకౌంటెన్సీకి సంబంధించిన కొన్ని పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యా (పిల్)న్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. -
దేవుళ్లు, ఆలయాల పేరుతో ఓట్లు.. మోదీపై పిటిషన్
దేవుళ్లు, ఆలయాల పేరుతో ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారని, ఎన్నికల్లో పోటీచేయకుండా ఆయనపై ఆరేళ్ల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని ముందుగా అనుకున్న సమయానికంటే 4 సెకన్లు ఆలస్యంగా చేపట్టినట్లు ఇస్రో తాజా నివేదికలో వెల్లడించింది. -
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
పెళ్లి పత్రికలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడం ఓ నవ వరుడిని చిక్కుల్లో పడేసింది.