Exit polls: భాజపా ఖాతాలోకి రాజస్థాన్.. మధ్యప్రదేశ్లో హోరాహోరీ!
Exit poll 2023: రాజస్థాన్లో భాజపా.. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మధ్యప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 2024 లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ రెండు పార్టీలకు కీలకం. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. రాజస్థాన్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఛత్తీస్గఢ్లో మాత్రం మరోసారి కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపాకు, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉండబోతోందని అంచనాలు ఉన్నాయి.
తెలంగాణలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్కే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!
రాజస్థాన్లో గహ్లోత్కు షాక్..!
రాజస్థాన్లో అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్కు షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్లో 200 స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే 100 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. ఎడారి రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. కానీ తాము మళ్లీ అధికారం నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ చెప్తూ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం మరోసారి సంప్రదాయమే రిపీట్ కానుందని అంచనా వేస్తున్నాయి. మెజారిటీ ఎగ్జిట్పోల్స్ భాజపాకు మెజారిటీని కట్టబెట్టాయి. అయితే, కాంగ్రెస్ అధికారానికి దూరమైనా భాజపాకు గట్టి పోటీ ఇవ్వనుందని కొన్ని సర్వేలు పేర్కొన్నాయి.
తాజా వార్తల కోసం Eenadu.net వాట్సప్ ఛానెల్ ఫాలో అవ్వండి..
ఛత్తీస్గఢ్లో హస్తం
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో మళ్లీ హస్తానికే ఓటర్లు పట్టం కట్టనున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 90 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారం రావొచ్చని అంచనా వేశాయి. అదే సమయంలో గత ఎన్నికల్లో 15 స్థానాలకే పరిమితమైన భాజపాకు ఈ సారి సీట్లు భారీగానే పెరగనున్నాయని పేర్కొన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే 45 స్థానాల్లో గెలుపొందాలి.
మధ్యప్రదేశ్లో టఫ్ ఫైట్
మధ్యప్రదేశ్లో గత ఎన్నికల్లో 114 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భాజపాకు 109 స్థానాలు వచ్చాయి. కమల్నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. సింథియా తిరుగుబాటుతో కాంగ్రెస్ అధికారం కోల్పోగా.. భాజపా అధికారం చేపట్టింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలుపొందాలి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం ఏ ఒక్క పార్టీకి పట్టం కట్టలేదు. కొన్ని సంస్థలు కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వస్తాయంటే.. మరికొన్ని భాజపాకు అధిక సీట్లు వస్తాయని అంచనా వేశాయి. దీంతో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ఫలితాల రోజే అసలు విషయం తేలుతుంది.
మిజోరంలో ఎవరో?
మొత్తం 40 స్థానాలున్న మిజోరంలో త్రిముఖ పోరు నెలకొంది. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూమెంట్ (ZPM) మధ్యే ప్రధాన పోటీ. భాజపా సైతం పోటీలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంఎన్ఎఫ్కు, జడ్పీఎంకు మధ్య గట్టిపోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా ప్రభావం నామమాత్రమే. కాంగ్రెస్ కొన్నిసీట్లలో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. భాజపాకు ఒకటీ, రెండు కూడా కష్టమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం